Vvs Sarma |
భగవద్గీత
101
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్|| 4-13 ||
101
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్|| 4-13 ||
(సత్త్వము, రజస్సు , తమస్సు అనే మూడు) గుణములు, ఆగుణములచే చేయబడు కర్మల యొక్క విభాగము ననుసరించి (గుణ కర్మ విభాగశః) నా చేత నాలుగు వర్ణములు సృజింపబడినవి (చాతుర్వర్ణ్యం సృజామ్యహమ్) . వాని కర్తనైనప్పటీకి నన్ను అకర్తగను, అవ్యయుడననియు (నాశ రహితుడననియు) తెలియుము.
భగవద్గీతలోని ఈశ్లోకమును భగవద్వాణిగా జాగరూకతతో అర్థంచేసుకోవాలి. తి.తి.దే వారి ఆంధ్రమహాభారతములో ఒక పర్వానికి టీకా తాత్పర్యములను సమకూర్చిన ఒక తెలుగు ఆచార్యుడు ఒక సభలో దీనిని భగవద్గీతలో తనకు నచ్చని భావముగా పేర్కొన్నాడు. కారణం కనుపిస్తూనే ఉన్నది... వర్ణవ్యవస్థకు భగవంతుని ఆమోదమే కాక “సృజామ్యహమ్” అని ఆయన చెప్పడమే.
ఈ శ్లోకంలో భగవంతుడు "గుణములనుబట్టి, వారుచేస్తున్న కర్మలను బట్టి మనుష్యులను నాలుగు వర్ణములుగా విభజించానని" చెబుతున్నాడు. నాలుగు వర్ణములనే చెప్పాడుకాని వాటికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని పేర్లు పెట్టలేదు, ఆపదములు వాడలేదు. ఇది మనుష్యుల తత్త్వముల విభాగము, సమాజము యొక్క వ్యవస్థ అనే అర్థంకూడాలేదు. గుణములు మూడే. సత్త్వరజస్తమోగుణములు. ఇవి అన్నీ వేరు వేరు నిష్పత్తులలో మనుష్యులందరిలోనూ ఉంటాయి. అంటే ఏ వ్యక్తి తనకు ప్రత్యేకముగా ఒక గుణమే ఉంటుందనికాని, ఒకే కుటుంబములోని వ్యక్తులు కూడా ఒకేగుణములు కలిగియుంటారని కాని చెప్పలేడు. . భగవంతుని విభజన వ్యక్తులకేగాని సమాజములో వర్గములకు కావు. మన సమాజములో జన్మ ఆధారముగా చేసుకున్న, వృత్తిని ఆధారముగా చేసుకున్న, కులములనే సమూహములను భగవంతుడు సృష్టించలేదు. అవి మానవ కల్పితాలు. అశాశ్వతంకూడా. కేవలము కర్మల ఆధారంగా ముక్తికి అర్హుడవుతాడని, అనర్హుడవుతాడని కాని ఎక్కడా చెప్పలేదు. రెండవ పాదంలో "తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్" అంటే గుణములను నేను సృష్టించినా. ఈ గుణముల వలన మనుష్యులు అనేక కర్మలు చేసినా తాను "అకర్మకృత్" (మాం విద్ధి అకర్తారమ్) అంటున్నాడు. మాయతో కూడీన సృష్టిలో భాగం గుణములు. మానవులు చేసిన కర్మలు, విభజనలు, వారికి ఫలదాయకాలు
No comments:
Post a Comment