UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 27 December 2014

MP Kavitha Speech @Telangana Cinema Directors Association Press Meet - 6TV


ఈ దివ్యమైన ఆచార్య స్వరూపమైనటువంటి ఆళ్వార్ రూపిణియైన గోపిక ఉన్న ఇల్లు అటువంటి భగవదనుభూతితో తడిసిపోయింది. ఆ ఇంటి పరంపర అంతే. అందుకే ఇంటి యజమానికి చెల్లెలా అన్నప్పుడు ఆ అనుభూతి అటువంటిది. ఆ యింటినిండా ఉన్నది. భగవదనుభూతితో తేమ అయింది. పైనుంచి పడుతున్న మంచు కూడా తెల్లని తేమ. చల్లదనమూ, తేమ, రెండూ ఉన్నాయి. అందులో భాగం. ఇదేమిటంటే పైనుంచి పడుతున్న మంచు అన్నప్పుడు ఇక్కడ శాస్త్రములనుంచి బ్రహ్మ జ్ఞానులయొక్క అనుభూతులలోనుంచి కురుస్తున్న బోధ అనేటటువంటి ఆర్ద్రమైన జ్ఞానవృష్టి అది. అటువంటి జ్ఞానరూపమైన, భక్తిరూపమైన వృష్టి పైనుంచి కురుస్తున్నది. ఇతను భగవదనుభూతి కలిగినటువంటి మహాత్ముడు అనేటటువంటి పేరు జగత్తులో వ్యాప్తి చెందిపోయింది. పైగా











పాశురం 12
విష్ణుచిత్తుల వారి ఇంట ఉద్భవించిన తల్లి మనందరికీ కూడా దివ్యమైనటువంటి మధుర భక్తి మార్గాన్ని ఉపదేశించినటువంటి ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాశురాలలో 12వ పాశురాన్ని ఈరోజు ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం.
కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్
ఈదివ్యమైన పాశురములలో ఆ గోపకాంతని మేల్కొల్పుతున్నది. ఇది కూడా ఇక్కడ గోపకాంత అన్నప్పుడు దివ్యమైనటువంటి భగవత్ భావనా భూమికలో తాదాత్మ్య స్థితిలో ఉంటూ బహిర్ముఖత్వము లేని ఆచార్యుని ఆశ్రయించినటువంటి శిష్యులు తమకు దివ్యమైన భక్తి మార్గాన్ని నిర్దేశించమని ప్రార్ధిస్తున్న భావమే ఇందులో కూడా దర్శిస్తూ ఉన్నారు.
కనైత్తిళం కట్రెరుమై - ఇక్కడ మొట్టమొదట కనైత్తు అనే మాట మొదలవుతున్నది. అంటే అరచి అని అర్థం. గేదెలు అరుస్తున్నాయి అని. ఇది కూడా తెల్లవారుఝామున ఉన్న వాతావరణాన్ని చూపిస్తుంది. ఎలాంటి గేదెలు అంటే
ఇళంగత్తు ఎరుమై - అంటే లేగదూడలు కలిగినటువంటి గేదెలు. అవి దూడలకోసం అరుస్తున్నాయి. ఆ అరుస్తూ ఉండగా; పైగా
ఇరంగి - ఆ దూడల పట్ల జాలి, వాత్సల్య భావం కలుగుతూ ఉన్నది. దగ్గరలో ఆ దూడలు లేవు. కనుక దూరంగా ఉన్న దూడల కోసం వాత్సల్య భావంతో జాలి కలిగి అరుస్తున్నటువంటి ఆ గేదెలయొక్క పోడుగులలో నుంచి తమంత తాముగా పాలు స్రవిస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర - అంటే ఆ దూడలను తలంచుకుంటున్నాయి. దగ్గరలేని దూడలని వాత్సల్య భావంతో తలంచుకోవడం వల్ల ఆ పొదుగులో క్షీరము తమంత తాము స్రవిస్తున్నాయి. ములై వళియే - అంటే ఆ పొదుగుల యొక్క శిరములనుంచి; నిన్రు - నిండుగా ఎడతెగకుండా; పాల్ శోర - పాలు కారుతూ ఉన్నాయి. ఆ కారణం చేత ఆ ప్రాంతమంతా తడిసిపోయింది పాలతో.
ననైత్తిలమ్ శేరాక్కుమ్ - ఆ పాలతో తడిసిన మట్టి ఒక చిత్రమైన బురదగా మారింది. అలాగ ఎవరియొక్క గేదెలు యొక్క పాలు బురదగా మారాయో ఆ గేదెల యజమానియైనటువంటి ఒక మహానుభావుడున్నాడు, గోపకుడు. ఆ గేదెల యజమానియొక్క చెల్లెలా! నిద్రలే అన్నారిక్కడ. ఇక్కడ చిత్రమైన సంబోధన ఉంది. ఓ గోపికా నిద్రలే అనే భావమైనా ఈ గోపిక ఎవరు? ఒక గోపకునియొక్క చెల్లెలు. ఆ గోపకుడు ఎవరు? అంటే అతని దగ్గర ఆవులు, గేదెలు ఎన్నో ఉన్నాయి. ఆ గేదెల పాలు తమంత తాము స్రవించి ఆ భాగమంతా బురదతో ఉన్నది. ఇక్కడ ఎలాంటి భావము అంటే పొద్దున్నే ఇక్కడ ఈ గోపకాంతలు శ్రీవ్రతం చేద్దాం అని చెప్పి స్నానానికి బయలుదేరారు. వెళుతూ ఈ గోపికను కూడా నిద్రలేపడానికి ఆమె ఇంటికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికల్లా ఆ యింటి భాగమంతా ఎలా కనిపించింది అంటే ముందున్న మట్టి భాగమంతా బురద బురదగా ఉంది. ఆ బురద ఎక్కడిది? అక్కడునటువంటి గేదెలు, ఆవులు, వాటి యొక్క పాలవల్ల వచ్చిన బురద. నీటివల్ల వచ్చిన బురద కాదు. ఆ పాలు ఎలా కింద పడిపోయినయ్యి అంటే అవి తమంత తాము స్రవించాయి. ఇప్పుడు ఈ క్రింది భాగమంతా తేమతేమగా ఉంది నీ ఇంటికి వచ్చేటప్పటికీ. పైభాగం కూడా తడితడిగానే ఉన్నది. ఆకాశంలోంచి మంచు పడుతోందిట.
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి - పనిత్తెలై వీళ అన్నప్పుడు పైనుంచి పడుతున్న మంచుతో తల తడిసిపోతూ ఉన్నది. అందుకు ముందు మంచు పడకుండా ఉండడం కోసం అని; ద్వారం దగ్గరకు కదిలాము. నిన్ వాశల్ కడైపట్రి. ద్వారం వద్దకు రాగానే కింద మట్టియొక్క తేమ ఉన్నది. పైన మంచుయొక్క తేమ ఉన్నది. ఆ కారణం చేత క్రింద కాలుపడి జారిపడిపోకుండాను, పైన మంచుపడి తడిసిపోకుండానూ ఆ ద్వారం దగ్గరికి చేరి పైన ఉన్నటువంటి దూలము, కమ్మి అంటారు ఆ దూలాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాము మేము. నిలబడి ఆ నారాయణుని గానం చేస్తూ నిన్ను లేపుతున్నాము. ఇంకా నిద్రలేవవేమి? ఆమె పరంపర, ఆమె ఇంటియొక్క సంసారం ఎటువంటిది అంటే గొప్ప సంపన్నమైన, సంస్కారవంతమైన కుటుంబములో ఆమె పుట్టింది. ఆ సంపద ఎంత అంటే గొప్ప గో సంపద ఉంది వాళ్ళ దగ్గర. గోవులు తమంత తాము స్రవిస్తున్నాయి. ఇందులో ఉన్న భావాన్ని పరిశీలించాలి. ఇక్కడ దూరంగా ఉన్న దూడాలని తలంచుకుంటే ఆవులో వాత్సల్య భావం పొంగి ఆ మాతృవాత్సల్యంతో క్షీరం తమంత తాము స్రవించింది. దీనిలో భావం ఏమిటంటే వాత్సల్యం కలిగినప్పుడు హృదయం నిండుగా ఉన్నటువంటి ఆ అమృత భావన పైకి పొంగి వ్యక్తమవుతున్నది. అలాగ శిష్యులు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆచార్యుడు కరుణతో వారిని తలంచుకోగానే ఆయన హృదయం నిండా ఉన్న భగవదనుభూతి భగవత్ జ్ఞానము అనే క్షీరము వెలికి వస్తోంది. చక్కటి భావన ఇది. సాధారణంగా అనుభూతి కలిగినటువంటి వారు, సాధన చేసినటువంటి వారు, సిద్ధి పొందిన వారు, జ్ఞానులైన భక్తులు అనుభూతితో నిండిపోతారు. అలా నిండి పోయినటువంటి వారికి శిష్యులపై వాత్సల్యం కలిగితే అనుభూతి, ఆ జ్ఞానం ఉపదేశంగా వెలికి వస్తుంది. ఇక్కడ వాత్సల్య భావం అంటే దూడ, ఆవుకి ఉన్నటువంటి ఆ ప్రేమ బాంధవ్యాన్ని మనం వాత్సల్యం అనచ్చు. పెద్ద వాళ్ళకి పిల్లల పట్ల ఉన్న ప్రేమని వాత్సల్యం అని అంటారు. అలా గురువులకి కూడా శిష్యులపట్ల వాత్సల్యం ఉంటుంది. లేకపోతే ఏం చూసి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు వాళ్ళు? ఇచ్చే దక్షిణలు చూసి కాదు. వాళ్ళ యోగ్యతలు చూసి వీళ్ళ మనసు కరిగి చెప్పాలి. ఈ దివ్యమైన ఆచార్య స్వరూపమైనటువంటి ఆళ్వార్ రూపిణియైన గోపిక ఉన్న ఇల్లు అటువంటి భగవదనుభూతితో తడిసిపోయింది. ఆ ఇంటి పరంపర అంతే. అందుకే ఇంటి యజమానికి చెల్లెలా అన్నప్పుడు ఆ అనుభూతి అటువంటిది. ఆ యింటినిండా ఉన్నది. భగవదనుభూతితో తేమ అయింది. పైనుంచి పడుతున్న మంచు కూడా తెల్లని తేమ. చల్లదనమూ, తేమ, రెండూ ఉన్నాయి. అందులో భాగం. ఇదేమిటంటే పైనుంచి పడుతున్న మంచు అన్నప్పుడు ఇక్కడ శాస్త్రములనుంచి బ్రహ్మ జ్ఞానులయొక్క అనుభూతులలోనుంచి కురుస్తున్న బోధ అనేటటువంటి ఆర్ద్రమైన జ్ఞానవృష్టి అది. అటువంటి జ్ఞానరూపమైన, భక్తిరూపమైన వృష్టి పైనుంచి కురుస్తున్నది. ఇతను భగవదనుభూతి కలిగినటువంటి మహాత్ముడు అనేటటువంటి పేరు జగత్తులో వ్యాప్తి చెందిపోయింది. పైగా అటువంటి నిన్ను మేము మేల్కొల్పుతున్నాం. మా మేలుకొలుపు విని దయచేసి రావమ్మా! అని అంటూ ఉన్నారు. ఇక్కడ రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు కోపగించుకోని అన్నారు. రామచంద్రమూర్తికి కోపం ఉందా? అంటే జితక్రోధుడు. ఆయనకు కోపం లేదు. కానీ జగద్రక్షణ కోసం ఆయన చూపించినటువంటి ధర్మాగ్రహం ఉన్నదే అది కూడా మనస్సుకు ఆహ్లాదం. భగవత్ కథ మనస్సుకు ఆహ్లాదం. పైగా రామచంద్రుడు, ఆయనను చూసినా ఆయనను తలన్చుకున్నా మనస్సు పరవశిస్తుంది. అందుకు
మనత్తుక్కినియానై - మనస్సును పరవశింపజేసే ఆ రామచంద్రుని గానం చేస్తూ ఉన్నాం. మేల్కొను తల్లీ! అని ప్రార్థిస్తున్నది ఇక్కడ ఆండాళ్ళమ్మ.

Like ·  · Share

అర్జునుడన్నాడు: మధుసూదనా! -పూజలకి అర్హులైనభీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలను? అర్జునుడు తాను భీరువు కాను, కానీ తన పెద్దల ముందు వారికి విరుద్ధంగా ఎలా యుద్ధం చెయ్యగలను అని వాపోతాడు.




రోజూ భగవద్గీత – ఉపోద్ఘాతం , ౩ శ్లోకాలు
[2-4] – [2-7]
అర్జున ఉవాచ|
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన|
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన|| 2-4 ||
అర్జునుడన్నాడు:
మధుసూదనా! -పూజలకి అర్హులైనభీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలను? అర్జునుడు తాను భీరువు కాను, కానీ తన పెద్దల ముందు వారికి విరుద్ధంగా ఎలా యుద్ధం చెయ్యగలను అని వాపోతాడు.
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే|
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్|| 2-5 ||
మహానుభావులైన గురువులను వధించకుండా ఈ లోకంలో బిచ్చం ఎత్తి అయినా జీవించడమే మేలు. గురువుల్ని వధించి ఆ నెత్తుటితో తడిసిన సంపదలు, భోగాలు ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను.
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్-
తేऽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః|| 2-6 ||
ఈ రెండింటిలో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధం చేసినా మేము గెలుస్తామో వాళ్ళే గెలుస్తారో, ఎవరిని చంపాక జీవించడానికి ఇష్ట పడమో, ఆధృతరాష్ట్రనందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు.
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేऽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్|| 2-7 ||
కార్పణ్య దోషం చేత నా బుద్ధి దెబ్బ తిన్నది. ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి. నీ శిష్యుడిని, నీ శరణు జొచ్చిన నాకు బోధ చెయ్యి.
తాను క్షత్రియుడనయ్యి క్షాత్ర ధర్మం విడనాడి తాను అలా వ్యవహరించలేదని, తన వారి మీద ప్రేమ వలన మాత్రమేనని ఇక తాను ఏది నిశ్చయించుకునే పరిస్థితి లో లేనని శరణాగతి చేస్తాడు.
ఓం నమో వెంకటేశాయ!!
ఓం నమో నారాయణాయ!!

ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్షణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు.


తిరుప్పావై 12వ రోజు పాశురము
ఆండాళ్ తిరువడిగలేశరణం

కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్యజ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితికి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్షణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు.

"ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే |
ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్ || "

వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు. మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు.

"దుఃఖేషు అనుద్విజ్ఞమనాః సుఖేఃషు విగతస్పృహ:
వీత రాగ భయ క్రోద: స్తితదీ: ముణిరుచ్యతే"

ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటియందు ఉంచకుండా సాధన చేస్తాడు. ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్.

"ఇళంకత్తెరుమై" లేత దూడలు కల్గిన గేదెల "కనైత్త్" అరుపు వినిపిస్తోంది. ఎందుకంటే వాటిని పట్టించుకోనే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నారు. "కన్ఱుక్కిరంగి" దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే "నినైత్తు" దూడ వచ్చిందని భావించి, "ములై వరియే" పొదుగుల గుండ "నిన్ఱు పాల్ శోర" ఏక ధారలుగా పాలు ఇస్తున్నాయి. "ననైత్త్-ఇల్లమ్" ఇల్లంతా తడిసి పోయి , "శేఱాక్కుమ్" అంతా బురద అయ్యింది.

ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్టానం చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే.

"నచ్చెల్వన్ తంగాయ్" ఏం సంపదలు కల్గిన వాడి చెల్లెలా!. ఆండాళ్ లోపలున్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది, జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి, లోపల మనలోని హృదయం ద్రవించేట్టుచేసి మనం కూడా భగవంతుణ్ణి అనుభవించేట్టు చేస్తుంది. "పనిత్తలై వీర" మంచుతో పైన తడుస్తున్నాం, ఏం స్థితి వచ్చిందమ్మా మాకు!! మూడు ప్రవాహాలుగా మేం కొట్టుకుపోతున్నాం. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలో మాహృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణగుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది, మరి "నిన్ వాశల్ కడై పత్తి" అమ్మా నీ గుమ్మపు పైకప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాం .

అయితే లోపలున్న గోపబాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది, అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు "శినత్తినాల్" కోపంతో "తెన్ ఇలంగై క్కోమానై" అందమైన లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి "చ్చెత్తమ్" సంహరించి, "మనత్తుక్కినియానై" అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం "ప్పాడవుమ్" పాడుతున్నా "నీ వాయ్ తిఱవాయ్" నీవు నోరు తెరవవా! "ఇనిత్తాన్ ఎరుందిరాయ్" ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా. "ఈదెన్న పేర్ ఉఱక్కమ్" ఇది ఎలాంటి నిద్రమ్మా, "అనైత్తిల్లత్తారుం అఱింద్" లోకమంతా తెలిసి పోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి.

MIGHTY BLESSINGS FROM #MAHARAJA --- NICE SONG EMERGED THROUGH ME IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2012




HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLAVAARU 
OFFICE CUM RESIDENCE 
HYDERABAD 

MIGHTY BLESSINGS FROM #MAHARAJA

Friday, 26 December 2014

మానసికంగా నేను సన్యసింఛాను. అందుచేత భార్యా పుత్రులుకూడా నాకు ఇప్పుడు ఏమీకారు - అని ఆధనాన్ని భూమిలో నిక్షిప్తం చేశారు. ఆ ధనం హరిహర, బుక్కలకు సామ్రాజ్య స్థాపనకు ఉపయోగించినదని చెబుతారు.



Vvs Sarma
భగవద్గీత
111
శృంగేరీ పీఠము జగద్గురు విద్యారణ్యుల కర్మఫలానుభవము
(సద్గురు శివానందమూర్తి గారి గీతా ప్రసంగములనుండి)- (భగవద్గీత 4.21 వ్యాఖ్య కొనసాగింపు)
14వశతాబ్దములో శృంగేరీ పీఠమును అధిష్ఠించిన వారు జగద్గురు విద్యారణ్యులు (12వ పీఠాధిపతి). వారు హరిహర రాయలు బుక్కరాయల చేత విజయనగర సామ్రాజ్య స్థాపనను ప్రోత్సహించినవారు. నేటికీ శృంగేరీ పీఠాధిపతులను "సర్వతంత్ర స్వతంత్రాది రాజధానీ, విద్యానగర మహారాజధానీ, కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య శ్రీ శృంగేరీ జగద్గురు మహాసంస్థానంగా వ్యవహరిస్తారు. విద్యారణుల పూర్వాశ్రమ నామం "సాయణ మాధవాచార్యులు". వారి కర్మానుభవమును గీతాబోధకు ఉదాహరణముగా సద్గురువులు ఇచ్చారు.
మాధవాచార్యులు వేదవేదాంగములు చదివిన మహా పండితుడు. యజ్ఞములు, యంత్ర తంత్ర రహస్యములు, అనుష్ఠానములు బాగా తెలిసిన వారు. పెద్దసంసారముతో, దారిద్ర్యముతో బాధ పడుతున్నారు. లక్ష్మీహోమము చేసి లక్ష్మీ కటాక్షము పొంది దారిద్ర్యమును బాపుకోవాలని సంకల్పము కలిగినది. అనుకున్నట్టుగా యథావిధిగా హోమము పూర్తిచేశారు. లక్ష్మి ప్రసన్నము కాలేదు. పరిస్థితి ఆలానే ఉన్నది. ఏదైనా పొరపాటు జరిగినదేమోనని తిరిగి హోమము చేసినారు. పరిస్థితిలో మార్పురాలేదు. పట్టువిడువక అలానే ఏడుహోమములు పూర్తిచేశారు. అయినా లక్ష్మి ప్రసన్నము కాలేదు. ఆయనకు విపరీతమైన దుఃఖము, క్రోధము కలిగినవి. లక్ష్మీదేవికి బుద్ధిగరపాలని ఆవిడకి శక్తిలేకుండా చేసే అభిచార హోమము చేయడం మొదలు పెట్టాడు. మంత్రములతో ఆహుతులు సమర్పించేసమయానికి లక్ష్మి ప్రత్యక్షమైనది. ఆయనకు ఏడు హోమములు చేసినా ఫలం ఎందుకు రాలేదో వివరించినది. నీదారిద్ర్యానికి కారణం నీ పూర్వజన్మల కర్మ ఫలమే అని చెప్పింది. ఏడుకొండలంత పాపఫలం ఉండేది. ఒకొక హోమంతో ఒక కొండంత పాపఫలం దహింపబడినది."ఎనిమిదవ పర్యాయం సరియైన హోమంచేస్తే నీకు లక్ష్మి ప్రసన్నమయేది. కాని అభిచారహోమం సంకల్పించి కొత్త పాపాన్ని మూటగట్టుకున్నావు" అని మందలించింది. కాని దయా స్వరూపిణి అవడం వలన కనక వర్షం కురిసింది. మాధవాచార్యులకు అపరిమితమైన వైరాగ్యం ఆవరించినది. నేను ఆధనాన్ని స్వీకరించను..మానసికంగా నేను సన్యసింఛాను. అందుచేత భార్యా పుత్రులుకూడా నాకు ఇప్పుడు ఏమీకారు - అని ఆధనాన్ని భూమిలో నిక్షిప్తం చేశారు. ఆ ధనం హరిహర, బుక్కలకు సామ్రాజ్య స్థాపనకు ఉపయోగించినదని చెబుతారు.
###

--------------------------


అఖిల్‌కి హీరోయిన్ దొరికేసిందా? కథానాయిక ఎవరో తెలియకుండానే పట్టాలెక్కేసింది అఖిల్ సినిమా. వినాయక్ దర్శకత్వం

Wednesday, 24 December 2014

WHEN I HAPPENED TO SAID ABOUT INCIDENCE HAPPENED IN 2012 REGARDING MALALA YOUSUFJAI IN 2003 ITSELF ALONG WITH MANY DELIGHT SONGS AND OTHER POLITICAL AND SOCIOLOGICAL HAPPENING,---- THEN WHY I AM UNABLE TO TRACE ON THE ATTACK IN PAKISTHAN, KILLED 145 CHILDREN. I AM SUGGESTING THE WITNESS PERSONS TO COME FORWARD TO GIVE DETAILS AND NOT HIDE THE TRUTH, ALONG WITH THE TELUGU MEDIA AND EDUCATED PERSONS, WHOM I AM CONTACTING TO GIVE THE DETAILS FURTHER TO THE WORLD.

SAMANVAYA DRUSTI 



I RAISED THE VOICE O MY GOD, IN MY DIVINE TRANCE ---  I HAVE THE WITNESS OF THE PEOPLE  THAT EVERYTHING IS DEPEND  UPON THE REASONING  OF THE HUMANS  --  WHEN I HAPPENED TO SAID ABOUT INCIDENCE HAPPENED IN 2012 REGARDING  MALALA YOUSUFJAI IN 2003 ITSELF ALONG WITH MANY DELIGHT SONGS AND OTHER POLITICAL AND SOCIOLOGICAL HAPPENING,---- THEN WHY I AM UNABLE TO TRACE ON THE ATTACK  IN PAKISTHAN, KILLED 145 CHILDREN.  I AM SUGGESTING THE    WITNESS PERSONS TO COME FORWARD TO GIVE DETAILS AND NOT  HIDE THE TRUTH,  ALONG WITH THE   TELUGU MEDIA AND EDUCATED  PERSONS, WHOM  I AM CONTACTING  TO GIVE THE DETAILS FURTHER TO THE WORLD.  I AM REQUESTING ALL THE BELIEF OF THE WORLD TO COME FORWARD WITH AMICABILITY FOR NEW UNITED FEELING OF LIVING IN THE WORLD.  I AM PROPOSING WITH  READINESS  TO GIVE THE DETAILS FROM RAMOJI FILM CITY REGULARLY WITH THE HELP OF ALL THE PANDITS AND PROFESSORS.  I AM REQUESTING OR SUGGESTING SRI RAMOJI RAO GAARU TO TAKE ME TO THE RAMOJI FILM CITY AND ENABLE ME START MY  VISION TO UNITE THE WORLD FOR BETTER CIVILIZED WORLD, BY OVERCOMING THE SELFISH FEELING DUE TO STRUCK IN CONCRETE JUNGLE  I WILL INVITE NATIONAL AND INTERNATIONAL PROFESSORS TO PARTICIPATE IN THE MIGHTY DISCUSSION AN DRAWING THE CONCLUSIONS OF REASONING TO ESTABLISH NEW WAY OF THINKING TO CONFIRM THE NEW GOLDEN AGE TO THE WORLD. 


MAHARA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
SOCIAL ACTIVIST AND VOLUNTEER 
HYDERABAD 

COPY TO THE TELUGU FILM INDUSTRY PERSONALITIES, PANDITS, PROFESSORS AND POLITICAL LEADERS OF TELUGU PEOPLE, AND WHOLE INDIA,   TO COME FORWARD TO ESTABLISH THE MEANING HUMAN EXISTENCE TO FEEL NEW HEIGHTS OF LIVING THE LIFE FOR GREATNESS, GREATNESS  IS THE WAY OF LIFE BY LEAVING ALL THE CONGESTED NARROW FEELINGS  AMONG HUMAN BEINGS.

     

చిత్తశుద్ధితో కర్మచేసి దానికి ఫలనిర్ణయం భగవంతునికే వదిలివేయడం ఉత్తమ మార్గం.



Vvs Sarma
భగవద్గీత
109
త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః|
కర్మణ్యభిప్రవృత్తోऽపి నైవ కిఞ్చిత్కరోతి సః|| 4-20 ||
ఎవడు కర్మఫలములయందు ఆసక్తినివిడనాడి, నిరంతరము సంతృప్తి కలవాడై, దేనినీ ఆశ్రయింపకయుండునో, అట్టివాడు కర్మలయందు ప్రవర్తించినను, ఒకింతయూ చేయనివాడే అగుచున్నాడు.
సామాన్యముగా ఫలాసక్తితోనే మనుష్యుడు కర్మలను చేస్తాడు. ఫలము ఏమైనా నిత్యసంతృప్తితో ఉండాలి. ఆశించిన ఫలము రాకపోయినా నిర్వికారముగా ఉండాలి. ఉహించిన ఫలము రాకపోతే ఇంకా కర్మలు, దుష్కర్మలు కూడా ఛేయకూడదు. న్యాయమైన కర్మకు న్యాయమైన ఫలం కోరుకోవడములో తప్పులేదు, కాని అత్యధికమైన ఫలం ఆశించడం, పాప కర్మలకు తగిన ఫలం రాకుండా ఉండాలని కోరుకోవడం అజ్ఞానాన్నే సూచిస్తాయి. అర్హత లేని ఫలాలు ఆశించి వానికై దుష్టకర్మలు చేయవచ్చు. చిత్తశుద్ధితో కర్మచేసి దానికి ఫలనిర్ణయం భగవంతునికే వదిలివేయడం ఉత్తమ మార్గం.


--------------------




Tuesday, 23 December 2014

Monday, 22 December 2014

ఆకలి కేకలతో ప్రజలు విలవిలాడుతున్న రోజులవి...ఇంగ్లాండ్‌కు చెందిన పాస్నెట్ దొరకు ఈ ప్రాంతంలోని కరువును చూసి గుండె కరిగింది. చిల్లిగవ్వ లేకున్నా తెలంగాణ ప్రాంత ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టి ఆదుకోవాలన్న సంకల్పంతో పనికి ఆహార పథకం కింద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ------మహాత్వపూర్వక అగ్రగణ్యులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతికి క్రిష్మాస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నారు

మెదక్ చర్చి శాంతి స్వరూపం


కరువు కాలంలో ఆకలి తీర్చిన అద్భుత కట్టడం

నిర్మాణంలో తెలంగాణ కూలీలదే కీలక పాత్ర
ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి
క్రిస్మస్ రాకతో కళకళలాడుతున్న మెదక్ చర్చి

మెదక్, డిసెంబర్ 20 (టీ మీడియా): నిజాం పాలనలో కరువు రక్కసి తాండవిస్తున్న తరుణం...ఆకలి కేకలతో ప్రజలు విలవిలాడుతున్న రోజులవి...ఇంగ్లాండ్‌కు చెందిన పాస్నెట్ దొరకు ఈ ప్రాంతంలోని కరువును చూసి గుండె కరిగింది. చిల్లిగవ్వ లేకున్నా తెలంగాణ ప్రాంత ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టి ఆదుకోవాలన్న సంకల్పంతో పనికి ఆహార పథకం కింద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.


medak church is famous in Asia



ఈక్రమంలోనే పనికి ఆహార పథకం కింద 1914నుంచి 1924సంవత్సర కాలంలో చార్లెస్ వాకర్ పాస్నెట్ చేతిలో అత్యద్భుత నిర్మాణం ఏర్పాటైంది. ఇది ఆసియా ఖండంలోనే ఉన్నతంగా నిలిచింది. తెలంగాణ కూలీలు ఈ చర్చి అద్భుత నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. క్రైస్తవులకు పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి విరాజిల్లుతోంది. ఇది ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద దేవాలయం. ఈ అద్భుత నిర్మాణం తెలంగాణకే గర్వకారణం. ప్రేమ, శాంతి, సామరస్యాన్ని అందించే పుణ్యస్థలంగా, మత సామరస్యానికి ప్రతీకగా మెదక్ చర్చి నిలిచింది. అద్భుత కట్టడాల్లో ఒకటిగా దీనికి పేరుంది.


Latest News



1879లో ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన వెస్లియన్ మెథడిస్టు మిషన్ వారు మెదక్ ప్రాంతంలో మిషనరీ కార్యక్రమాలు ప్రారంభించారు. చార్లెస్ వాకర్ పాస్నెట్ చేతిలో రూపుదిద్దుకున్న అద్భుత సృష్టి కేథడ్రల్ చర్చి 1914నుంచి 1924వరకు నిర్మాణం జరుపుకుంది. దక్షిణ, తూర్పు ఆసియా ఖండాల్లో ఈ కేథడ్రల్ చర్చి మహోన్నతమైంది. ఇంగ్లాండ్‌లోని రన్‌కోడ్ పట్టణానికి చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ అద్భుత నిర్మాణానికి పూనుకున్నారు. చర్చి నిర్మాణంలో పాస్నెట్ సాధించిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.

నిత్యనూతన ప్రయోగాలతో కట్టడంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. మెదక్ పట్టణ నడిబొడ్డున రూపుదిద్దుకున్న ఈ చర్చి అంబర చుంబి, ఉక్కు ఆకాశహర్మ్యంగా ప్రఖ్యాత రచయితలు ప్రశంసించారు. 55మీటర్ల ఎత్తు గల ఈ మహా స్థూపం ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. ఆసియా ఖండంలోనే ఎత్తైన చర్చిగా మెదక్ చర్చి రెండోదిగా ప్రసిద్ధికెక్కింది. అయితే నిర్మాణ సమయంలో అవసరాలకు తగ్గటుగా నిపుణులు, పనివారు లభించక నిర్మాణ సంస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాలంలో నిపుణులు కానీ, పనివారితో కానీ సత్వరంగా పని చేయించడంలో ఉద్యుక్తుడైన రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ త్వరలోనే సఫలీకృతుడయ్యాడు.


Latest News



ఉక్కును గురించి సాంకేతిక వివరాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిర్మాణ సంస్థల్లో ఎప్పటికప్పుడు పనిని కొనసాగించే విధానాన్ని అమలుపరిచాడు. తయారు చేసిన భాగాలను కేవలం బిగించి పనిచేయడం అనే నూతన ప్రక్రియతో ఇండియాలోనే మొదటిసారిగా ఈ చర్చి నిర్మాణం చేపట్టి ఆధునికీకరణకు పునాది వేశారు.

కరువు కాటకాలు, దేశంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఆకలి చావులు సంభవిస్తున్న సమయంలో ఈ చర్చి నిర్మాణం చేపట్టారు. ఈ చర్చి క్రైస్తవ మందిరమైన పరమత సహనానికి ప్రతీకగా నిలుస్తోంది. విభిన్న మతాలకు చెందిన వేలాది మంది చర్చికి వస్తుంటారు. క్రిస్మస్ పండుగ రోజు లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు.

ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి చర్చిని సందర్శించిన కేసీఆర్....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న మెదక్ వచ్చిన సందర్భంగా ప్రపంప ప్రఖ్యాతిగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రెసిబీటర్ ఇన్‌చార్జి రాబీన్‌సన్ సీఎం కేసీఆర్‌ను శాలువాలు, మెమోంటాలతో ఘనంగా సన్మానించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జడ్జీలు, డీజీపీలు, సినీ నటులు, ఇతర ఉన్నతాధికారులు, వివిధ దేశాల ప్రముఖులు ఈ చర్చిని దర్శించుకోవడానిక వచ్చారు. చరిత్రాత్మక విశిష్టత కలిగిన ఈ చర్చి క్రిస్మస్ పండుగతో కొత్త శోభను సంతరించుకుంటుంది. ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు జాతర జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవిదేశాల నుంచి ఈ చర్చిని సందర్శించడానికి ప్రజలు వస్తారు.



Latest News


































------------------------------
మహాత్వపూర్వక అగ్రగణ్యులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   యావత్తు మానవజాతికి క్రిష్మాస్  పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నారు 

గణిత శాస్త్ర స్వభావాన్ని, భావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. --- Ramanujam great mathametician --- Mathamaticians day ---- concentrating on the happening of dharmaswaroopam or kaalaswaroopam or strategy of king and queen with mathematical view like mapping, relations, expressions, with the support of physics and astrophysics, professors can draw many ready answers and explanations require to the present generation on human existence and his influence on nature ---- mighty blessings from your loving caring father like MAHARAJA ANJANI RAVISHANKAR PILLA VAARU,

గణితశాస్త్ర చరిత్రలో మహోన్నతుడు రామానుజన్


Latest News


- నేడు జాతీయ గణితోత్సవం
- పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఆదేశాలు
ఎన్జీవోస్‌కాలనీ : గణితశాస్త్ర చరిత్రలో మహోన్నతమైన వ్యక్తి శ్రీనివాస రామానుజన్. 20వ శతాబ్దపు గొప్ప గణిత శాస్త్రవేత్త. 1887 డిసెంబర్ 22 న రామానుజన్ జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్క రించుకొని జాతీయ గణిత దినోత్సవంగా అధికారికంగా నిర్వహించుకుంటున్నాము. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మేళాలను నిర్వహించి విద్యార్థులకు గణితశాస్త్ర ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించాల్సి ఉంది. పాఠశాలలో ఈ సందర్భంగా గణిత కృత్యాలు, ప్రాజెక్టులు, క్రీడలు, ఫ జిల్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. వ్యాసరచన, వకృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించాలి. ఈ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ఆదేశాలను జారీ చేసింది.

గణితంపై అవగాహన కల్పించాలి..


సోమయ్య, డైట్ లెక్చరర్ (గణితశాస్త్ర బోధకుడు)
గణిత శాస్త్ర స్వభావాన్ని, భావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. గణితంతోని విద్యా ప్రమాణాలను విద్యార్థులలో పెంపొందించే విధంగా సంసిద్ధతను ఉపాద్యాయులు కలిగి ఉండాలి. ఫార్మీటివ్ అసెస్‌మెంటుకు సంబందించి, నూతన సమస్యల తయారీ, రాతపని, ప్రాజెక్టు పనులపై దృష్టి కేంద్రీకరించాలి. గణిత ప్రయోగశాలను ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేయాలి. కృత్యాలు, ప్రాజెక్టుల నిర్వహణలో విద్యార్థులకు మార్గ నిర్దేశం చేయాలి. నిరంతర, సమగ్ర మూల్యాంకనా విధానాలకు అనుగుణంగా గణిత పాఠ్యాంశాలను బోధించాలి
.

పూర్వమువారు చేసినట్లు నిష్కామకర్మ చేయుము

Vvs Sarma

భగవద్గీత
106
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః|
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్|| 4-15 ||
తాను వాస్తవముగా కర్తకాదు. తనకు కర్మల ఫలములందపేక్షయుండరాదు. --- ఈ విధముగా తెలుసుకొనిన పూర్వమువారైన అనేక ముముక్షువులు నిష్కామ కర్మ ఆచరించి యుండిరి. కావున ఓ అర్జునా! నీవునూ వారివలే పూర్వమువారు చేసినట్లు నిష్కామకర్మ చేయుము.
మదర్పిత బుద్ధితో కర్మచేయుటవలన ఆ కర్మ నీకు అంటదు. కర్త, కర్మ, కర్మఫలము అన్నీ భగవంతునివే అనేదృస్టితో చేసిన కర్మ నిన్ను బాధించకుండా చేస్తాను.

కిం కర్మ కిమకర్మేతి కవయోऽప్యత్ర మోహితాః|
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసేऽశుభాత్|| 4-16 ||
కర్మ ఏది? అకర్మయేది? ఈరహస్యమును సరిగా తెలియలేకున్నారు. దేనిని ఎరిగినచో నీవు సంసార బంధమునుండి విముక్తి పొందగలవో, అట్టి కర్మరహస్యమును నీకిప్పుడు చెప్పబోవు తున్నాను.
ఇంతకంటె తేలిక వాక్యములు మన ఆధ్యాత్మిక సాహిత్యంలో ఎక్కడా దొరకవు. ఇది భగవంతుని ప్రత్యక్ష బోధ. ఇది భగవంతుని వాక్కునుండి సకల వేదశాస్త్రముల సంగ్రహ రూపముగా వచ్చినది. ఒక కర్మ చేయవచ్చునా? చేయకూడదా? చేయకుండ ఉండవచ్చునా? వీటికి ఫలములు ఏమిటి? ఏలా చేస్తే ఇది బంధహేతువు అవుతుంది? ఆ పరిస్థితులలో నీ ధర్మం ఏమిటి? తరువాత శ్లోకాలలో వివరంగా చెబుతాడు

Baahubali Making - Visualising the world of Baahubali------ EARLIER I AM SIMHADRI, VIKRAMARKUDU, CHATRAPATI, MAGADHEERA FROM THE CREATION OF SS RAJAMOULI GAARU, MOST CONTENT DIRECTOR OF TELUGU FILM INDUSTRY NOW HE IS DOING BAHUBALI I WILL BE THERE WITH SPECIAL APPEARANCE OR HISTORICAL MERGE WITH THE FILM









ALL THE SONGS AND FEW DIALOGUES OF THE FILM ARE EMERGED THROUGH ME IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2010.

HIS MAJESTIC HIGHNESS, MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
SOCIAL ACTIVIST AND VOLUNTEER
HYDERABAD 

శివపార్వతులకు అభిషేకం చేసి, అక్షతలు పూల మాలలు వస్త్రాభరణాలు అలంకరించారు. కానుకలు దీపాలు నివేదించారు. రుక్మిణిచేత మొక్కించారు,



నా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒక్కటి 

Aditya Srirambhatla
రుక్మిణీకల్యాణం – 54:

64- వ.
మఱియు సూత మాగధ వంది గాయక పాఠక జను లంతంత నభినందించుచుఁ జనుదేర మందగమనంబున, ముకుంద చరణారవిందంబులు డెందంబునం దలఁచుచు నిందుధరసుందరీ మందిరంబు చేరి సలిల ధౌత చరణకరారవింద యై వార్చి శుచియై, గౌరీసమీపంబునకుం జనియె నంత ముత్తైదువలగు భూసురోత్తమ భార్యలు భవసహితయైన భవానికి మజ్జనంబు గావించి, గంధాక్షత లిడి, వస్త్రమాల్యాది భూషణంబుల నలంకరించి ధూపదీపంబు లొసంగి నానావిధో పహారంబులు సమర్పించి, కానుక లిచ్చి, దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మ్రొక్కించి; రప్పుడు.

అక్కడక్కడ సూత వంది మాగధులు వంశకీర్తి, పరాక్రమం వర్ణిస్తున్నారు స్తోత్రాలు చేస్తున్నారు, గీతాలు పాడేవాళ్ళు పాడుతున్నారు, పద్యాలు చదివేవాళ్ళు చదువుతున్నారు. స్వయంవర పెళ్ళి కూతురు, రుక్మిణి మెల్లగా నడుస్తూ చక్రి పాదాలు స్మరిస్తూ ఉమాసతి గుడికి చేరింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, గౌరీదేవి దగ్గరకు వెళ్ళింది. బ్రాహ్మణ ముత్తైదువలు శివపార్వతులకు అభిషేకం చేసి, అక్షతలు పూల మాలలు వస్త్రాభరణాలు అలంకరించారు. కానుకలు దీపాలు నివేదించారు. రుక్మిణిచేత మొక్కించారు, అప్పుడు.

64- va.
maRriyu soota maagadha vaMdi gaayaka paaThaka janu laMtaMta nabhinaMdiMchuchuM~ janudEra maMdagamanaMbuna, mukuMda charaNaaraviMdaMbulu DeMdaMbunaM dalaM~chuchu niMdudharasuMdaree maMdiraMbu chEri salila dhauta charaNakaraaraviMda yai vaarchi shuchiyai, gaureesameepaMbunakuM janiye naMta muttaiduvalagu bhoosurOttama bhaaryalu bhavasahitayaina bhavaaniki majjanaMbu gaaviMchi, gaMdhaakShata liDi, vastramaalyaadi bhooShaNaMbula nalaMkariMchi dhoopadeepaMbu losaMgi naanaavidhO pahaaraMbulu samarpiMchi, kaanuka lichchi, deepamaalikala nivaaLiMchi rukmiNeedEvini mrokkiMchi; rappuDu.

మఱియున్ = ఇంకను; సూత = కీర్తించువారు; మాగధ = ప్రతాపము వర్ణించువారు; వంది = స్తోత్రములు చేయువారు; గాయక = పాటలు పాడువారు; పాఠక = వంశావళి చదువువారు; జనులు = ప్రజలు; అంతంతన్ = అక్కడక్కడ; అభినందించుచున్ = పొగడుతు; చనుదేర = రాగా; మంద = మెల్లని; గమనంబునన్ = నడకలతో; ముకుంద = శ్రీకృష్ణుని; చరణ = పాదములనెడి; అరవిందంబులున్ = పద్మములను; డెందంబునన్ = మనసునందు; తలచుచు = స్మరించుతు; ఇందుధరసుందరీ = పార్వతీదేవి యొక్క {ఇందుధరసుందరి - ఇందుధరుని (శివుని) యొక్క సుందరి (భార్య), పార్వతి}; మందిరంబున్ = గుడిని; చేరి = దగ్గరకువెళ్ళి; సలిల = నీటితో; ధౌత = కడగబడిన; చరణ = కాళ్ళు; కర = చేతులు అనెడి; అరవింద = పద్మములు కలామె; ఐ = అయ్యి; వార్చి = ఆచమనము చేసి; శుచి = పరిశుద్ధురాలు; ఐ = అయ్యి; గౌరీ = పార్వతీదేవి; సమీపంబున్ = దగ్గర; కున్ = కు; చనియె = వెళ్ళను; అంతన్ = అంతట; ముత్తైదువలు = పునిస్త్రీలు {ముత్తైదువ - భర్త జీవించి ఉన్నామె, పునిస్త్రీ}; అగు = ఐన; భూసుర = బ్రాహ్మణ; ఉత్తమ = శ్రేష్ఠుల; భార్యలు = స్త్రీలు; భవ = శివునితో {భవుడు - సమస్తము తానే అగువాడు, శివుడు}; సహిత = కలిసి ఉన్నామె; ఐన = అయిన; భవాని = పార్వతీదేవి {భవాని - భవుని భార్య, పార్వతి}; కిన్ = కి; మజ్జనంబు = అభిషేకము; కావించి = చేసి; గంధ = సుగంధ ద్రవ్యములు; అక్షతలు = అక్షింతలు {అక్షతలు - పసుపు కలిపిన బియ్యము గింజలు}; ఇడి = వేసి; వస్త్ర = బట్టలు; మాల్య = పూలదండలు; ఆది = మున్నగు; భూషణంబులన్ = ఆలంకారములచేత; అలంకరించి = అలంకారము చేసి; ధూప = ధూపము; దీపంబులు = దీపములను; ఒసంగి = ఇచ్చి; నానా = అనేక; విధ = రకములైన; ఉపహారంబులున్ = నైవేద్యములను; సమర్పించి = ఇచ్చి; కానుకలు = కానికలు; ఇచ్చి = ఇచ్చి; దీప = దీపముల; మాలికలన్ = వరుసలను; నివాళించి = హారతులిచ్చి; రుక్మిణీదేవిని = రుక్మిణీదేవిచేత; మ్రొక్కించిరి = నమస్కరింపజేసిరి; అప్పుడు = అప్పుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=206&Padyam=1743.0

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Sunday, 21 December 2014

Bathukamma Best Song | Telangana Folk Songs | Janapada Patalu | Telugu Folk Songs

Bathukamma Best Song | Telangana Folk Songs | Janapada Patalu | Telugu Folk Songs

MORE GREATEFULL -- YOURS MAHARAJA

ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవ్య మాహ్నికమ్



Madhu Gonugunta

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే|
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవ్య మాహ్నికమ్||1||

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ|
ఉత్తిష్ఠ కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు||2||

మహాత్వపూర్వక అగ్రగణ్యులు ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
స్వచ్చంద సామజిక వేత్త మరియు కార్యకర్త 
నివాసము మరియు పరిపాలన 
కార్యాలయం 
హైదరాబాద్  

లోకమంతా శబ్దతరంగాలు వ్యాపించి ఉంటాయి. ఈ శబ్దానికి మూలం నాదం, అదే ఓంకారం. ఏ వస్తువుల మధ్య రాపిడి లేకపోయినా, నిశ్శబ్దం నుంచి వినిపించే ఏకైక నాదం ఓంకారం. ఈ మంత్రాలకు కూడా మూలం ఓంకారం.


హిందూ ధర్మం - 117 (వేదం)
మంత్రం అంటే ఏంటి అని సందేహం వస్తుంది. మంత్రం అంటే ఎంతో యుక్తితో కోడింగ్ (Coding) చేయబడిన విజ్ఞానం యొక్క రహస్య రూపం. అసలు మంత్రమే ఒక కోడ్ (Code). అది పైకి మాములుగానే కనిపిస్తుంది, కానీ అర్దం చేసుకుంటే అద్భుతాలు గమనిస్తాం. ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, ఉద్దేశ్యము ఉంటుంది. పెద్ద మర్రిచెట్టు చిన్న విత్తనంలో ఉన్నట్లే, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం మంత్రాల్లో ఉంటుంది. విత్తనాన్ని మట్టిలో వేసి, నీరు అందించి, తగిన పోషకాలు అందించినప్పుడు, భూమిలో పరిస్థితులు అనుకూలించినప్పుడు అది ఏ విధంగా అయితే మొలకెత్తుతుందో, అదే విధంగా తగిన వ్యక్తికి, కొన్ని ప్రత్యేక సమయాల్లో మంత్రాల్లో అర్ధాలు వెళ్ళడవుతాయి. ఈ మంత్రాలను డికోడింగ్ (Decoding) చేసిన వ్యక్తులనే మనం ఋషులు అంటున్నాం. ఇలా భగవంతుడు మంత్రరూపంలో చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సమస్త విజ్ఞానమంతా మంత్రంలో బీజరూపంలో ఉంచి, మేదస్సును, మనోశక్తిని ఉపయోగించి విజ్ఞానాన్ని కనుగొనమన్నారు. రెండవది లోకంలో అనేక మనస్తత్త్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. కొందరు పరమ నిస్వార్ధపరులు ఉంటారు. తమ గురించి ఏమీ ఆలోచించరు, ఎప్పుడు పదిమంది బాగుండాలని కోరుకుంటారు, అవసరమైతే లోకం కోసం తమ కోరికలను, సుఖాలను సైతం విడిచిపెడతారు. ఈ కోవలోకి వస్తారు ఋషులు. వారు కాక, కొందరు తమ స్వార్ధం చూసుకుంటూ లోకం బాగుండాలని కాంక్షిస్తారు. వారు రెండవరకం. మూడవరకం వారు కేవలం తమ స్వార్ధమే చూసుకుంటారు, లోకం ఏమైపోయినా వీరికి అనవసరం. నాలుగవరకం వారు తమ మాత్రమే బాగుండాలి, లోకం నాశనమవ్వాలి, తాము మాత్రమే సుఖంగా ఉండాలి, వెరొకరు అలా ఉంటే చూడలేరు. ఒక గొప్ప విషయం చెప్పవలసి వచ్చినప్పుడు, అది సరైన వ్యక్తులకే చెప్పాలి, దుర్మార్గులకు కానీ ఒక అద్భుతమైన జ్ఞానం వెళ్ళిందా, అది లోకకంటకం అవుతుంది. మంచివాళ్ళకి, నిశ్వార్ధపరులకు జ్ఞానం చేరితే, అది లోకకల్యాణ కారకమవుతుంది. అందుకే భగవంతుడు తాను చెప్పదల్చుకున్న విషయాలను వేదమంత్రాల ద్వారా చెప్పారు.
మంత్రమనగానే అది కేవలం ఒక అక్షరసమూహం అని భావించకూడదు. మంత్రానికి శబ్దానికి చాలా సూక్ష్మమైన, విశేషమైన సంబంధం ఉంటుంది. శబ్దం చరాచరాత్మక ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. రెండు వస్తువుల రాపిడివల్ల శబ్దం ఏర్పడుతుంది. అణువుల మధ్య రాపిడి వల్ల కూడా చాలా సూక్ష్మమైన శబ్దాలు ఏర్పడతాయి. లోకమంతా శబ్దతరంగాలు వ్యాపించి ఉంటాయి. ఈ శబ్దానికి మూలం నాదం, అదే ఓంకారం. ఏ వస్తువుల మధ్య రాపిడి లేకపోయినా, నిశ్శబ్దం నుంచి వినిపించే ఏకైక నాదం ఓంకారం. ఈ మంత్రాలకు కూడా మూలం ఓంకారం.
To be continued ...........

వెచ్చదనాన్ని వేకువకు పరిచయం చేసిన ఉదయభాస్కరునిపై ... మరపంటూ తెలియని కాలపరిమితిపై... ఓటమిని దరిచేరనివ్వని కడలి కెరటాలపై ....


మనసు పడ్డాను ...
పవిత్రతంతా తనలో కనపడే మంచుబిందువుపై......
అలసటంటూ తెలియని తొలి పొద్దుపై ...
ఒంటరితనమే లేని జంట పక్షులపై ...
మధువును మధురంగా దోచుకునే సీతకోకపు చిలిపితనంపై ....
వెచ్చదనాన్ని వేకువకు పరిచయం చేసిన ఉదయభాస్కరునిపై ...
మరపంటూ తెలియని కాలపరిమితిపై...
ఓటమిని దరిచేరనివ్వని కడలి కెరటాలపై ....
మత్తును గమ్మత్తుగా వదిలించే పైరగాలి పదనిసలపై .....
ఎప్పటికి పరువం కోరే మల్లె పువ్వు మకరందముపై .....
మలిసాయత్రం ముద్దులొలికించే సందె పొద్దు సమీరంపై ....
ఆశల పల్లకిని ప్రతినిమిషం ఎక్కించే ఊసుల ఆవిరులపై .....
కల్లాకపటం తెలియని వెన్నెల మయూఖం పై ......
చెలిమి బిగి కౌగిలిలో బందీలమయ్యే భాంధవ్యాల బంధనముపై .....
ఎన్నోరంగులు జగతికి పరిచయం చేసిన హరివిల్లుల అందాలపై ...
వర్షపుచినుకును వయ్యారంగా ఆహ్వానించే మట్టివాసన మరువము పై ........
గగనముపై గంబీరంగా మెరిసే నయగారపు నక్షత్రాలపై .......
ఆమనిలో ఉన్న ప్రతిది నాకే సొంతమనుకునే నా మనసుపై ..పడ్డాను మనసు ,,........ సుభాషిణి తోట


HAPPY BIRTHDAY TAMANNA -- YOU KNOW YOU ARE EMERGED THROUGH ME (DHARMASWAROOPAM OR KAALASWAROOPAM OR KING AND QUEEN) AS ACTOR ALONG WITH OTHER HEROES AND HEROINES IN 2003 ITSELF --- I SAID YOU ARE GOING HIGHLIGHT AS MILKY BEAUTY

Embedded image permalink











మహాత్వపూర్వక అగ్రగణ్యులు ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
స్వచ్చంద సామజిక వేత్త మరియు కార్యకర్త 
నివాసము మరియు పరిపాలన 
కార్యాలయం 
హైదరాబాద్  





SAHASRANAMALU -- BHAKTI CHANNEL ---MAHARAJA


AVATAR MOVIE IS EMERGED FROM DHARMASWAROOPAM OR KALASWAROOPAM OR KING AND QUEENS RULE OF THE WORLD IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2010. MANY DETIALS OF THE FILM ARE REVEALED BEFORE SCIENTISTS AND STAFF IN 2003 ITSELF ALONG WITH OTHER HAPPENINGS OF THE WORLD



AVATAR MOVIE IS  EMERGED FROM DHARMASWAROOPAM  OR  KALASWAROOPAM OR KING AND QUEENS RULE OF THE WORLD IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2010. MANY DETIALS OF THE FILM ARE REVEALED BEFORE SCIENTISTS AND STAFF IN 2003 ITSELF ALONG WITH OTHER HAPPENINGS OF THE WORLD. 

HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
SOCIAL ACTIVIST AND VOLUNTEER
HYDERABAD