సంస్కృతము భారతదేశానికి చెందిన ప్రాచీన భాష. సంస్కృతం అంటే ‘సంస్కరించబడిన’, ‘ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన’ అని అర్థం. సంస్కృతం నుండి పలు భాషలు ఉద్భవించాయి అనేది జగమెరిగిన సత్యం. తమిళం కూడా అందులోనుండి వచ్చిందే.
భగవద్గీత తమిళ భాష లో లేనప్పుడు వారు ఆ గ్రంధాన్ని తమిళం లోకి తర్జుమా చేసుకొని చదవి , ఆ గ్రంధము యొక్క విశిష్టతను గ్రహించి, ఆ ప్రతిపాదనను బలపరచాలి కానీ, ఇలా మా భాషలో లేదు, మాకు అక్కర్లేదు, మేము ఒప్పుకోము అని అజ్ఞానులుగా మిగిలిపోతామా?
పుట్టిన వారికి మరణము తప్పదు.
మరణించిన వారికి జన్మము తప్పదు.
అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.
భగవద్గీత లోని ఈ ఒక్క శ్లోకమును విని, ఇది మరణము సంభవించిన లేక గతించిన వారి ఇళ్ళలో పారాయణము చేయదగు, వినదగు గ్రంథమని చాలా మందిలో ఒక అపోహ ఉన్నది. ఇది అంత మాత్రము వాస్తవము కాదు. భగవద్గీతను అన్ని వేళల, అన్ని సందర్భాలలో పటించదగు విఘ్నాన భాండాగారము.
ఒక గ్రంధం పైన ఉన్న చిత్రమును బట్టో, ఆ గ్రంధము యొక్క పేరును బట్టో, అందులోని ఒక శ్లోకమును వినో, ఆ పుస్తకము ఎటువంటిదనేది ఒక నిర్ణయానికి వచ్చుట, ఆ అఘ్ఞానం తో వ్యతిరేఖతను ప్రదర్శించుట మన అఘ్ఞానాన్ని మనమే అందరికి తెలియపరచుకున్న వారము అవుతాము.ఆ గ్రంధం లోతులకు వెళ్లి, మన మిడి మిడి ఘ్నానముతో కాక, సరైన అర్ధాలను తెలుసుకొని చదివినపుడే, అందులో ఉన్న విషయములను గ్రహించగలము. అలా చదివి అంతరార్ధాన్ని గ్రహించి, మార్గదర్శకతను పొందిన వారిలో ఎందరో యోగులు, తాత్వికులు ఉన్నారు. మహాత్మా గాంధీ తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్పూర్తిని పొందారు. గాంధీ మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు బ్రిటిష్ వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్పూర్తిని ఇచ్చింది.
భగవద్గీత జాతీయ గ్రంధం గానే కాకుండా, అంతర్జాతీయ గ్రంధం గాను ఏనాడో ఆదరణను పొందింది. కొన్ని యూరోపియన్ దేశాలలో, భగవద్గీతను ప్రతీ రోజు నాటకాలుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నాటకాలను ప్రదర్శించేవారు ముస్లింలు. ప్రపంచంలో అన్నో గ్రంధాలు ఉండగా భగవద్గీతనే ఎంచుకొని, ప్రదర్శించడానికి కారణం అది ఒక మత గ్రంధం కాదని, అది కేవలం ఒక విజ్ఞాన గ్రంథమని, ప్రజలు విజ్ఞానవంతులు అయితే దేశం పురోగతిని సాదిస్తుందని వారు గ్రహించడమే.
మేము భారతీయులం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం లో పుట్టం. మా దేశం లో ఎన్నో మతాలు, కులాలు, జాతులు, సంస్కృతులు ఉన్న, వాటన్నింటిని గౌరవిస్తూ, ఆదరిస్తూ , సోదర భావంతో జీవిస్తున్నాం అని గర్వం గా చెప్పుకొనే మనం, ఈ రోజు లేని పోనీ అపోహలతో, మన మిడి మిడి ఘ్ఞానం తో, అవగాహనా లోపంతో, మానవ జీవన గమ్యాన్ని, గమనాన్ని, వసుదైక కుటుంబం అనే భావనను భోధించిన భగవద్గీతను, జాతీయ గ్రంధం గా అంగీకరించడానికి ఆలోచిస్తున్నాం, కులమంటూ, మతమంటూ, భాషంటూ అభ్యంతరాలు పెడుతున్నాం. మన ఉన్నతికి మనమే పెద్ద అడ్డంకిగా మారుతున్నాం.
గజిబిజి బ్రతుకులు, హాదావిడి జీవితాలు, సాంకేతికంగా అభివృద్ధి సాదించిన, విజ్ఞాన పరం గా వెనుకబడే ఉన్నాం. మంచేదో, చెడేదో తెలియక, స్వార్ధం పెరిగిపోయి, అడుగడుగునా అన్యాయం, అమానుషత్వం పెచ్చుమీరిన ఈ సమాజాన్ని సక్రమమైన మార్గం లో నడిపించడానికి, ప్రజలలో పేరుకుపోయిన అఘ్నానాన్ని తొలగినచడానికి, నీతి, న్యాయం, ధర్మం, శాంతి అనేవి పెంపొందించి, ప్రజలందరిని వెలుగు దిశగా నడిపించడానికి, విశ్వమంతటా విజ్ఞానపు వెలుగులు వెల్లివిరియాలనే తపనతో, చాలా మంది విఘ్నులు భగవద్గీతను జాతీయ గ్రంధం గా ఆమోదించాలనే ప్రతిపాదనను బలపరుస్తున్నారు.
ఇకనైన, అపోహలను వీడదాం, భగవద్గీత – విశ్వ మానవ కళ్యాణ రాత అని గ్రహిద్దాం.