
MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
SOCIAL ACTIVIST AND VOLUNTEER
HYDERABAD
Subhashini Thota |
అన్నమయ్య సంకీర్తనలకి విశ్లేషణలు రాసేంత గొప్ప వాడిని కాను నేను,,కానీ గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారు పాడిన " ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన " అనే అన్నమాచార్యుని కీర్తన విన్నప్పుదల్లా దీని గురించి రాయాలి అని అనిపిస్తూ ఉంటుంది.
ఈ కీర్తన చదవండి...!!! " ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన నితడే అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె|| మదిజలధులనొకదైవము వెదకిన మత్య్సావతారంబితడుయ్ అదివోపాతాళమందు వెదకితే ఆదికుర్మమీ విష్ణుడు పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి చెదఱక కొండల గుహలవెదకితే శ్రీనరసింహుబున్నాడు|| తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది బలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడు. తలపున శివుడును పార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు.|| పొంచి అసురకాంతలతో వెదకిన బుద్ధావతారంబైనాడు మించిన కాలము కడపట వెదకిన మిదటి కల్క్యావతారము అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీ వేంకట విభుడు|| " అన్నమయ్యకి ఎక్కడ వెతికినా " హరే సర్వవ్యాపకుడు " అని అనిపిస్తోందట.ఎక్కడ వెతుకుతున్నా అతని రూపమే గోచరిస్తోంది అని చాలా చక్కగా దశావతారాలను ఉదహరించి రాశాడు ఈ కీర్తనని... కాసేపు ఈ భక్తి భావాన్ని పక్కన పెడితే ఈ కీర్తన మళ్ళీ చదవండి. " లోకంలో ఎంతో విభిన్నంగా కనిపించే ప్రతీదానిలోనూ ఏకత్వాన్ని దర్శించమని చెప్పట్లేదూ అన్నమయ్య? జగత్తులో నిండి ఉన్నది అంతా ఒకటే,ఒకే చైతన్యం దీనినంతా నడిపిస్తోంది అనే భావన కలగచేసేలా ఉంది ఈ పాట. " " హరి సర్వాత్మకుడు ఆదిమ పురుషుడు హరి సర్వాత్మకుడు ఆదిమ పురుషుడు పొరి నెరుగు వారి పుణ్యముగాన " అనే కీర్తనలో అన్నమయ్య ఇలా అంటాడు. " నేలయు మిన్నును నిజ వెకుంఠము పోలించి చూడని పురుషుల వెలితి. మనసులోననే మాధవుడున్నాడు కనుగొనని వారి కడమింతే తనువే విష్ణుని తత్వసాధనము వొనరగ శ్రీపతి యున్నాడు గాన " అని అంటాడు. మన శరీరం విష్ణువు యొక్క తత్వం తెలుసుకునే ఓ సాధనం అట. ఇంతకీ ఏమిటా విష్ణువు తత్వం? అంటే ఇదిగో అన్నమయ్య చెప్పాడుగా ఇలా ప్రపంచంలో ప్రతీ వస్తువుని,సంఘటనీ సమదృష్టితో చూడమని. ఎంత అందంగా కనిపిస్తుందో ఈ జగత్తు అంతా ఇటువంటి భావనలు మనం కలిగిఉంటే??? ప్రతీ మనిషినీ దైవస్వరూపంగా భావిస్తే అప్పుడు అవతలి వ్యక్తిని మోసం చెయ్యబుద్ధవదు,మాటలతో హింసించాలని ఉండదు.మనకి విశ్వజనీయ ప్రేమ తత్వం అలవడుతుంది... అసలీలోకమే గొప్ప ఆనందంతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది... ఆ తత్వాన్నే సాధన చెయ్యాలని అంటున్నాడు అన్నమయ్య.... |
దేవుడా!!!
ఈ అనంత శూన్యంలోనుంచి అమేయమైన విశ్వాన్ని సృష్టించావు…విశ్వం బోసిపోయిందని తలచి భూమి అనే వనంలో మనిషనే విత్తనాన్ని నాటావు…ప్రాణమనే నీరును పోసి బుద్ది, ఙ్ఞానం, ప్రేమ, విశ్వాసం అనే ఎరువుల్ని వేసి..పుడమిని అందమైన తోటగా మారుద్దాం అనుకొన్నావు.. కానీ స్వామీ..నీ లెక్క తప్పింది.. అహంకారం, స్వార్థం, కామం, కుళ్ళు, అసహనత, మోహం, క్రోదం, ఆవేశం అనే చీడ పురుగులు పంటనాశించి..మీ తోటను నాశనం చేస్తున్నాయి..మంచితనం, దర్మం అనే పురుగుల మందుకు కూడా లొంగనత వెర్రి తలలు వేస్తున్నాయి.. తండ్రీ నీ పంటను రక్షించుకోమనటం లేదు. ఈ మొక్కలకు చీడలనుంచి కాపాడుకొనే శక్తిని ప్రసాదించు. నీ మహిమజూపుము దేవా!! అహంకారంతో కూడిన మనసుకు ఒదిగి ఉండటంలో ఉన్న గొప్పదనం ఏమిటో తెలియజేయి స్వార్థంతో నిండిన మనసుకు దానంలో ఉన్న ఆనందం ఏమిటో చెప్పు కామంతో కాలిపోయే తనువుకు ఆత్మీక స్థితి నేర్పు కుళ్ళుతో ఉడికిపోయే వారికి అభినందించడంలో ఉన్న హుందా చూపు అసహనతతో కూడీన జీవితం ఎంత వ్యర్థమో తెలుసుకునేలా చేయి మోహం ఉన్న చోటే భాధలు కాపురం చేస్తాయన్న నిజం తెలియజేయి క్రోధం తో రగిలిపోయే మనసులలో శాంతిని నింపు ఆవేశం బదులు ఆలోచన ఇవ్వు |