జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం
Updated : 12/18/2014 9:59:18 AM
శ్రీహరికోట: జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీంతో మనుషులను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో ముందడుగు వేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ప్రయోగం ప్రారంభమైన వెంటనే రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. 3,735 కిలోల వ్యోమగాముల గదిని 126.15 కి.మీ ఎత్తులో మార్క్-3 ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోకి మానవులను పంపే క్రమంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్షంలోకి ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే విజయవంతంగా మానవులను పంపించాయి. నేడు ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగ విజయవంతంతో అంతరిక్షంలోకి మానవులను పంపే దిశగా భారత్ గణనీయమైన పురోభివృద్ధిని సాధించింది. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ వ్యయం రూ.155 కోట్లు.
No comments:
Post a Comment