అన్నమయ్య సంకీర్తనలకి విశ్లేషణలు రాసేంత గొప్ప వాడిని కాను నేను,,కానీ గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారు పాడిన " ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన " అనే అన్నమాచార్యుని కీర్తన విన్నప్పుదల్లా దీని గురించి రాయాలి అని అనిపిస్తూ ఉంటుంది.
ఈ కీర్తన చదవండి...!!! " ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన నితడే అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె|| మదిజలధులనొకదైవము వెదకిన మత్య్సావతారంబితడుయ్ అదివోపాతాళమందు వెదకితే ఆదికుర్మమీ విష్ణుడు పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి చెదఱక కొండల గుహలవెదకితే శ్రీనరసింహుబున్నాడు|| తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది బలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడు. తలపున శివుడును పార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు.|| పొంచి అసురకాంతలతో వెదకిన బుద్ధావతారంబైనాడు మించిన కాలము కడపట వెదకిన మిదటి కల్క్యావతారము అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీ వేంకట విభుడు|| " అన్నమయ్యకి ఎక్కడ వెతికినా " హరే సర్వవ్యాపకుడు " అని అనిపిస్తోందట.ఎక్కడ వెతుకుతున్నా అతని రూపమే గోచరిస్తోంది అని చాలా చక్కగా దశావతారాలను ఉదహరించి రాశాడు ఈ కీర్తనని... కాసేపు ఈ భక్తి భావాన్ని పక్కన పెడితే ఈ కీర్తన మళ్ళీ చదవండి. " లోకంలో ఎంతో విభిన్నంగా కనిపించే ప్రతీదానిలోనూ ఏకత్వాన్ని దర్శించమని చెప్పట్లేదూ అన్నమయ్య? జగత్తులో నిండి ఉన్నది అంతా ఒకటే,ఒకే చైతన్యం దీనినంతా నడిపిస్తోంది అనే భావన కలగచేసేలా ఉంది ఈ పాట. " " హరి సర్వాత్మకుడు ఆదిమ పురుషుడు హరి సర్వాత్మకుడు ఆదిమ పురుషుడు పొరి నెరుగు వారి పుణ్యముగాన " అనే కీర్తనలో అన్నమయ్య ఇలా అంటాడు. " నేలయు మిన్నును నిజ వెకుంఠము పోలించి చూడని పురుషుల వెలితి. మనసులోననే మాధవుడున్నాడు కనుగొనని వారి కడమింతే తనువే విష్ణుని తత్వసాధనము వొనరగ శ్రీపతి యున్నాడు గాన " అని అంటాడు. మన శరీరం విష్ణువు యొక్క తత్వం తెలుసుకునే ఓ సాధనం అట. ఇంతకీ ఏమిటా విష్ణువు తత్వం? అంటే ఇదిగో అన్నమయ్య చెప్పాడుగా ఇలా ప్రపంచంలో ప్రతీ వస్తువుని,సంఘటనీ సమదృష్టితో చూడమని. ఎంత అందంగా కనిపిస్తుందో ఈ జగత్తు అంతా ఇటువంటి భావనలు మనం కలిగిఉంటే??? ప్రతీ మనిషినీ దైవస్వరూపంగా భావిస్తే అప్పుడు అవతలి వ్యక్తిని మోసం చెయ్యబుద్ధవదు,మాటలతో హింసించాలని ఉండదు.మనకి విశ్వజనీయ ప్రేమ తత్వం అలవడుతుంది... అసలీలోకమే గొప్ప ఆనందంతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది... ఆ తత్వాన్నే సాధన చెయ్యాలని అంటున్నాడు అన్నమయ్య.... |
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Monday, 15 December 2014
ప్రతీ మనిషినీ దైవస్వరూపంగా భావిస్తే అప్పుడు అవతలి వ్యక్తిని మోసం చెయ్యబుద్ధవదు,మాటలతో హింసించాలని ఉండదు.మనకి విశ్వజనీయ ప్రేమ తత్వం అలవడుతుంది...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment