Devarakonda Subrahmanyam |
వైకుంఠ ఏకాదశి విశేషాలు
ఓం నమో నారాయణాయ
ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి #వైకుంఠ_ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. 01-01-2014, గురువారం, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధఏకాదశి నాడు పాలసముద్రంలో యోగనిద్రలో గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి తో కలిసి గరుడవాహనం మీద వైకుంఠానికి రాగా వైకుంఠ ఉత్తరద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహా విష్ణువును పూజించారని పురాణ కధనం.
ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు 33 కోట్లమంది దేవతలతో వైకుంఠం నుండి భూమికి దిగివస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు.
కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని 'ముర ' అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండే వాడు. వాడు దేవతలను గాలిస్తూ వచ్చాడు. అప్పుడు దేవతలు వైకుంఠం విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణువు వారి దీనస్థితిని చూడలేక భూమికి దిగివచ్చి మురాసురుణ్ణి అంతం సంహరించాడు. ఆ సంహారం ఈ ఏకాదశి నాడే జరిగింది. విష్ణు వైకుంఠం నుండి భూమికి దిగివచ్చిన రోజు కనుక దీనిని వైకుంఠ ఏకాదశి అన్నారు.
ఈ రోజున విష్ణుముర్తి ఆలయాలు, ఆయన అవతారాలకు సంబంధించిన ఆలయాల్లో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనిని స్వర్గ ద్వారం అంటారు. ఈ ద్వార వెళ్ళి పరమాత్మను దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుంది.
"ఉత్తరద్వార దర్శనం" గురించి తాత్వికంగా చెప్పుకోవలసి వస్తే ఉత్తరం అంటే పైభాగం అని, తరువాత వచ్చేది అని అర్ధాలు ఉన్నాయి. ఇప్పుడున్న జీవన విధానం నుంచి ఉన్నత స్థితికి, భౌతికజీవనం నుంచి ఆధ్యాత్మిక జీవనానికి ఇది నాంది పలుకుతుంది.
మన శరీరంలో #ఆరుచక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుండి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఊర్ధ్వముఖంగా (పైకి) ప్రయాణింపజేసి ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి, బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలోఐక్యమవడమే ఉత్తరద్వార దర్శనం అని చెప్పవచ్చు.
మన ధర్మ శాస్త్రాలు, పురాణాల ప్రకారం ఏకాదశి నాడు అన్నంలో పాపాలు ఉంటుందని, అందువల్ల ఆ రోజు ఉపవసించాలాని తెలుస్తున్నది.
#జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య ఉండే దూరము, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిష్యం తెలియపరుస్తోంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది.
దశమి నాడు ఉదయమే లేచి శిరస్నానం చేసి, #ఏకాదశి వ్రతం చేస్తున్నానని పరమాత్మ ముందు చెప్పుకుని, పూజ చేసి,భోజనం చేసి, ఆ రాత్రికి ఉపవసించాలి.ఫలహారం తీసుకోవచ్చు. ఏకాదశి నాడు తలకు ఎటువంటి నూనెలు,ష్యాంపులు పెట్టకుండా కేవలం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి.విష్ణు పూజ చేయాలి. ఉపవాసం చేయాలి. ఆ రాత్రి విష్ణు నామాలతో జాగరణ చేసి మరునాడు అంటే ద్వాదశి నాడు ఉదయం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి. అభ్యంగన స్నానం ఏకాదశి,ద్వాదశి తిధులలో నిషిద్ధం. స్నానం తరువాత విష్ణు పూజ చేసి, ఉదయం ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, పారణ(భోజనం)చేయాలి.ఆ రాత్రికి కేవలం ఫలహారం మాత్రమే తీసుకోవాలి.
ఏకదశి ఉపవాసం వలన ఆరోగ్యం లభిస్తుంది. వివాహం జరిగిన వారందరూ తప్పకుండా ఉపవాసం చేయాలి. బ్రహ్మచారులకు, రోగులకు, 80 ఏళ్ళకు పైన వయసున్నవారు ఉపవసించవలసిన అవసరం లేదు. శ్రీ మహా విష్ణువును ఆరాధించినా చాలు.
ఇందులో చాలా అరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇదంతా మన ఆరోగ్యం కోసం ఆ పరమాత్మ చేసిన శాసనం. ఆచరిద్దాం. తరిద్దాం. ఆనందిద్దాం. మనశ్శంతిని, తద్వార పరమగతిని పొందుదాం.
ఓం నమో లక్ష్మీనారాయణాయ
ఓం నమో నారాయణాయ
ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి #వైకుంఠ_ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. 01-01-2014, గురువారం, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధఏకాదశి నాడు పాలసముద్రంలో యోగనిద్రలో గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి తో కలిసి గరుడవాహనం మీద వైకుంఠానికి రాగా వైకుంఠ ఉత్తరద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహా విష్ణువును పూజించారని పురాణ కధనం.
ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు 33 కోట్లమంది దేవతలతో వైకుంఠం నుండి భూమికి దిగివస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు.
కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని 'ముర ' అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండే వాడు. వాడు దేవతలను గాలిస్తూ వచ్చాడు. అప్పుడు దేవతలు వైకుంఠం విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణువు వారి దీనస్థితిని చూడలేక భూమికి దిగివచ్చి మురాసురుణ్ణి అంతం సంహరించాడు. ఆ సంహారం ఈ ఏకాదశి నాడే జరిగింది. విష్ణు వైకుంఠం నుండి భూమికి దిగివచ్చిన రోజు కనుక దీనిని వైకుంఠ ఏకాదశి అన్నారు.
ఈ రోజున విష్ణుముర్తి ఆలయాలు, ఆయన అవతారాలకు సంబంధించిన ఆలయాల్లో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనిని స్వర్గ ద్వారం అంటారు. ఈ ద్వార వెళ్ళి పరమాత్మను దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుంది.
"ఉత్తరద్వార దర్శనం" గురించి తాత్వికంగా చెప్పుకోవలసి వస్తే ఉత్తరం అంటే పైభాగం అని, తరువాత వచ్చేది అని అర్ధాలు ఉన్నాయి. ఇప్పుడున్న జీవన విధానం నుంచి ఉన్నత స్థితికి, భౌతికజీవనం నుంచి ఆధ్యాత్మిక జీవనానికి ఇది నాంది పలుకుతుంది.
మన శరీరంలో #ఆరుచక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుండి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఊర్ధ్వముఖంగా (పైకి) ప్రయాణింపజేసి ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి, బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలోఐక్యమవడమే ఉత్తరద్వార దర్శనం అని చెప్పవచ్చు.
మన ధర్మ శాస్త్రాలు, పురాణాల ప్రకారం ఏకాదశి నాడు అన్నంలో పాపాలు ఉంటుందని, అందువల్ల ఆ రోజు ఉపవసించాలాని తెలుస్తున్నది.
#జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య ఉండే దూరము, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిష్యం తెలియపరుస్తోంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది.
దశమి నాడు ఉదయమే లేచి శిరస్నానం చేసి, #ఏకాదశి వ్రతం చేస్తున్నానని పరమాత్మ ముందు చెప్పుకుని, పూజ చేసి,భోజనం చేసి, ఆ రాత్రికి ఉపవసించాలి.ఫలహారం తీసుకోవచ్చు. ఏకాదశి నాడు తలకు ఎటువంటి నూనెలు,ష్యాంపులు పెట్టకుండా కేవలం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి.విష్ణు పూజ చేయాలి. ఉపవాసం చేయాలి. ఆ రాత్రి విష్ణు నామాలతో జాగరణ చేసి మరునాడు అంటే ద్వాదశి నాడు ఉదయం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి. అభ్యంగన స్నానం ఏకాదశి,ద్వాదశి తిధులలో నిషిద్ధం. స్నానం తరువాత విష్ణు పూజ చేసి, ఉదయం ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, పారణ(భోజనం)చేయాలి.ఆ రాత్రికి కేవలం ఫలహారం మాత్రమే తీసుకోవాలి.
ఏకదశి ఉపవాసం వలన ఆరోగ్యం లభిస్తుంది. వివాహం జరిగిన వారందరూ తప్పకుండా ఉపవాసం చేయాలి. బ్రహ్మచారులకు, రోగులకు, 80 ఏళ్ళకు పైన వయసున్నవారు ఉపవసించవలసిన అవసరం లేదు. శ్రీ మహా విష్ణువును ఆరాధించినా చాలు.
ఇందులో చాలా అరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇదంతా మన ఆరోగ్యం కోసం ఆ పరమాత్మ చేసిన శాసనం. ఆచరిద్దాం. తరిద్దాం. ఆనందిద్దాం. మనశ్శంతిని, తద్వార పరమగతిని పొందుదాం.
ఓం నమో లక్ష్మీనారాయణాయ
No comments:
Post a Comment