భగవద్గీత
111 శృంగేరీ పీఠము జగద్గురు విద్యారణ్యుల కర్మఫలానుభవము (సద్గురు శివానందమూర్తి గారి గీతా ప్రసంగములనుండి)- (భగవద్గీత 4.21 వ్యాఖ్య కొనసాగింపు) 14వశతాబ్దములో శృంగేరీ పీఠమును అధిష్ఠించిన వారు జగద్గురు విద్యారణ్యులు (12వ పీఠాధిపతి). వారు హరిహర రాయలు బుక్కరాయల చేత విజయనగర సామ్రాజ్య స్థాపనను ప్రోత్సహించినవారు. నేటికీ శృంగేరీ పీఠాధిపతులను "సర్వతంత్ర స్వతంత్రాది రాజధానీ, విద్యానగర మహారాజధానీ, కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య శ్రీ శృంగేరీ జగద్గురు మహాసంస్థానంగా వ్యవహరిస్తారు. విద్యారణుల పూర్వాశ్రమ నామం "సాయణ మాధవాచార్యులు". వారి కర్మానుభవమును గీతాబోధకు ఉదాహరణముగా సద్గురువులు ఇచ్చారు. మాధవాచార్యులు వేదవేదాంగములు చదివిన మహా పండితుడు. యజ్ఞములు, యంత్ర తంత్ర రహస్యములు, అనుష్ఠానములు బాగా తెలిసిన వారు. పెద్దసంసారముతో, దారిద్ర్యముతో బాధ పడుతున్నారు. లక్ష్మీహోమము చేసి లక్ష్మీ కటాక్షము పొంది దారిద్ర్యమును బాపుకోవాలని సంకల్పము కలిగినది. అనుకున్నట్టుగా యథావిధిగా హోమము పూర్తిచేశారు. లక్ష్మి ప్రసన్నము కాలేదు. పరిస్థితి ఆలానే ఉన్నది. ఏదైనా పొరపాటు జరిగినదేమోనని తిరిగి హోమము చేసినారు. పరిస్థితిలో మార్పురాలేదు. పట్టువిడువక అలానే ఏడుహోమములు పూర్తిచేశారు. అయినా లక్ష్మి ప్రసన్నము కాలేదు. ఆయనకు విపరీతమైన దుఃఖము, క్రోధము కలిగినవి. లక్ష్మీదేవికి బుద్ధిగరపాలని ఆవిడకి శక్తిలేకుండా చేసే అభిచార హోమము చేయడం మొదలు పెట్టాడు. మంత్రములతో ఆహుతులు సమర్పించేసమయానికి లక్ష్మి ప్రత్యక్షమైనది. ఆయనకు ఏడు హోమములు చేసినా ఫలం ఎందుకు రాలేదో వివరించినది. నీదారిద్ర్యానికి కారణం నీ పూర్వజన్మల కర్మ ఫలమే అని చెప్పింది. ఏడుకొండలంత పాపఫలం ఉండేది. ఒకొక హోమంతో ఒక కొండంత పాపఫలం దహింపబడినది."ఎనిమిదవ పర్యాయం సరియైన హోమంచేస్తే నీకు లక్ష్మి ప్రసన్నమయేది. కాని అభిచారహోమం సంకల్పించి కొత్త పాపాన్ని మూటగట్టుకున్నావు" అని మందలించింది. కాని దయా స్వరూపిణి అవడం వలన కనక వర్షం కురిసింది. మాధవాచార్యులకు అపరిమితమైన వైరాగ్యం ఆవరించినది. నేను ఆధనాన్ని స్వీకరించను..మానసికంగా నేను సన్యసింఛాను. అందుచేత భార్యా పుత్రులుకూడా నాకు ఇప్పుడు ఏమీకారు - అని ఆధనాన్ని భూమిలో నిక్షిప్తం చేశారు. ఆ ధనం హరిహర, బుక్కలకు సామ్రాజ్య స్థాపనకు ఉపయోగించినదని చెబుతారు. ###
--------------------------
|
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Friday, 26 December 2014
మానసికంగా నేను సన్యసింఛాను. అందుచేత భార్యా పుత్రులుకూడా నాకు ఇప్పుడు ఏమీకారు - అని ఆధనాన్ని భూమిలో నిక్షిప్తం చేశారు. ఆ ధనం హరిహర, బుక్కలకు సామ్రాజ్య స్థాపనకు ఉపయోగించినదని చెబుతారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment