
పాశురం 12
విష్ణుచిత్తుల వారి ఇంట ఉద్భవించిన తల్లి మనందరికీ కూడా దివ్యమైనటువంటి మధుర భక్తి మార్గాన్ని ఉపదేశించినటువంటి ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాశురాలలో 12వ పాశురాన్ని ఈరోజు ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం.
కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్
ఈదివ్యమైన పాశురములలో ఆ గోపకాంతని మేల్కొల్పుతున్నది. ఇది కూడా ఇక్కడ గోపకాంత అన్నప్పుడు దివ్యమైనటువంటి భగవత్ భావనా భూమికలో తాదాత్మ్య స్థితిలో ఉంటూ బహిర్ముఖత్వము లేని ఆచార్యుని ఆశ్రయించినటువంటి శిష్యులు తమకు దివ్యమైన భక్తి మార్గాన్ని నిర్దేశించమని ప్రార్ధిస్తున్న భావమే ఇందులో కూడా దర్శిస్తూ ఉన్నారు.
కనైత్తిళం కట్రెరుమై - ఇక్కడ మొట్టమొదట కనైత్తు అనే మాట మొదలవుతున్నది. అంటే అరచి అని అర్థం. గేదెలు అరుస్తున్నాయి అని. ఇది కూడా తెల్లవారుఝామున ఉన్న వాతావరణాన్ని చూపిస్తుంది. ఎలాంటి గేదెలు అంటే
ఇళంగత్తు ఎరుమై - అంటే లేగదూడలు కలిగినటువంటి గేదెలు. అవి దూడలకోసం అరుస్తున్నాయి. ఆ అరుస్తూ ఉండగా; పైగా
ఇరంగి - ఆ దూడల పట్ల జాలి, వాత్సల్య భావం కలుగుతూ ఉన్నది. దగ్గరలో ఆ దూడలు లేవు. కనుక దూరంగా ఉన్న దూడల కోసం వాత్సల్య భావంతో జాలి కలిగి అరుస్తున్నటువంటి ఆ గేదెలయొక్క పోడుగులలో నుంచి తమంత తాముగా పాలు స్రవిస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర - అంటే ఆ దూడలను తలంచుకుంటున్నాయి. దగ్గరలేని దూడలని వాత్సల్య భావంతో తలంచుకోవడం వల్ల ఆ పొదుగులో క్షీరము తమంత తాము స్రవిస్తున్నాయి. ములై వళియే - అంటే ఆ పొదుగుల యొక్క శిరములనుంచి; నిన్రు - నిండుగా ఎడతెగకుండా; పాల్ శోర - పాలు కారుతూ ఉన్నాయి. ఆ కారణం చేత ఆ ప్రాంతమంతా తడిసిపోయింది పాలతో.
ననైత్తిలమ్ శేరాక్కుమ్ - ఆ పాలతో తడిసిన మట్టి ఒక చిత్రమైన బురదగా మారింది. అలాగ ఎవరియొక్క గేదెలు యొక్క పాలు బురదగా మారాయో ఆ గేదెల యజమానియైనటువంటి ఒక మహానుభావుడున్నాడు, గోపకుడు. ఆ గేదెల యజమానియొక్క చెల్లెలా! నిద్రలే అన్నారిక్కడ. ఇక్కడ చిత్రమైన సంబోధన ఉంది. ఓ గోపికా నిద్రలే అనే భావమైనా ఈ గోపిక ఎవరు? ఒక గోపకునియొక్క చెల్లెలు. ఆ గోపకుడు ఎవరు? అంటే అతని దగ్గర ఆవులు, గేదెలు ఎన్నో ఉన్నాయి. ఆ గేదెల పాలు తమంత తాము స్రవించి ఆ భాగమంతా బురదతో ఉన్నది. ఇక్కడ ఎలాంటి భావము అంటే పొద్దున్నే ఇక్కడ ఈ గోపకాంతలు శ్రీవ్రతం చేద్దాం అని చెప్పి స్నానానికి బయలుదేరారు. వెళుతూ ఈ గోపికను కూడా నిద్రలేపడానికి ఆమె ఇంటికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికల్లా ఆ యింటి భాగమంతా ఎలా కనిపించింది అంటే ముందున్న మట్టి భాగమంతా బురద బురదగా ఉంది. ఆ బురద ఎక్కడిది? అక్కడునటువంటి గేదెలు, ఆవులు, వాటి యొక్క పాలవల్ల వచ్చిన బురద. నీటివల్ల వచ్చిన బురద కాదు. ఆ పాలు ఎలా కింద పడిపోయినయ్యి అంటే అవి తమంత తాము స్రవించాయి. ఇప్పుడు ఈ క్రింది భాగమంతా తేమతేమగా ఉంది నీ ఇంటికి వచ్చేటప్పటికీ. పైభాగం కూడా తడితడిగానే ఉన్నది. ఆకాశంలోంచి మంచు పడుతోందిట.
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి - పనిత్తెలై వీళ అన్నప్పుడు పైనుంచి పడుతున్న మంచుతో తల తడిసిపోతూ ఉన్నది. అందుకు ముందు మంచు పడకుండా ఉండడం కోసం అని; ద్వారం దగ్గరకు కదిలాము. నిన్ వాశల్ కడైపట్రి. ద్వారం వద్దకు రాగానే కింద మట్టియొక్క తేమ ఉన్నది. పైన మంచుయొక్క తేమ ఉన్నది. ఆ కారణం చేత క్రింద కాలుపడి జారిపడిపోకుండాను, పైన మంచుపడి తడిసిపోకుండానూ ఆ ద్వారం దగ్గరికి చేరి పైన ఉన్నటువంటి దూలము, కమ్మి అంటారు ఆ దూలాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాము మేము. నిలబడి ఆ నారాయణుని గానం చేస్తూ నిన్ను లేపుతున్నాము. ఇంకా నిద్రలేవవేమి? ఆమె పరంపర, ఆమె ఇంటియొక్క సంసారం ఎటువంటిది అంటే గొప్ప సంపన్నమైన, సంస్కారవంతమైన కుటుంబములో ఆమె పుట్టింది. ఆ సంపద ఎంత అంటే గొప్ప గో సంపద ఉంది వాళ్ళ దగ్గర. గోవులు తమంత తాము స్రవిస్తున్నాయి. ఇందులో ఉన్న భావాన్ని పరిశీలించాలి. ఇక్కడ దూరంగా ఉన్న దూడాలని తలంచుకుంటే ఆవులో వాత్సల్య భావం పొంగి ఆ మాతృవాత్సల్యంతో క్షీరం తమంత తాము స్రవించింది. దీనిలో భావం ఏమిటంటే వాత్సల్యం కలిగినప్పుడు హృదయం నిండుగా ఉన్నటువంటి ఆ అమృత భావన పైకి పొంగి వ్యక్తమవుతున్నది. అలాగ శిష్యులు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆచార్యుడు కరుణతో వారిని తలంచుకోగానే ఆయన హృదయం నిండా ఉన్న భగవదనుభూతి భగవత్ జ్ఞానము అనే క్షీరము వెలికి వస్తోంది. చక్కటి భావన ఇది. సాధారణంగా అనుభూతి కలిగినటువంటి వారు, సాధన చేసినటువంటి వారు, సిద్ధి పొందిన వారు, జ్ఞానులైన భక్తులు అనుభూతితో నిండిపోతారు. అలా నిండి పోయినటువంటి వారికి శిష్యులపై వాత్సల్యం కలిగితే అనుభూతి, ఆ జ్ఞానం ఉపదేశంగా వెలికి వస్తుంది. ఇక్కడ వాత్సల్య భావం అంటే దూడ, ఆవుకి ఉన్నటువంటి ఆ ప్రేమ బాంధవ్యాన్ని మనం వాత్సల్యం అనచ్చు. పెద్ద వాళ్ళకి పిల్లల పట్ల ఉన్న ప్రేమని వాత్సల్యం అని అంటారు. అలా గురువులకి కూడా శిష్యులపట్ల వాత్సల్యం ఉంటుంది. లేకపోతే ఏం చూసి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు వాళ్ళు? ఇచ్చే దక్షిణలు చూసి కాదు. వాళ్ళ యోగ్యతలు చూసి వీళ్ళ మనసు కరిగి చెప్పాలి. ఈ దివ్యమైన ఆచార్య స్వరూపమైనటువంటి ఆళ్వార్ రూపిణియైన గోపిక ఉన్న ఇల్లు అటువంటి భగవదనుభూతితో తడిసిపోయింది. ఆ ఇంటి పరంపర అంతే. అందుకే ఇంటి యజమానికి చెల్లెలా అన్నప్పుడు ఆ అనుభూతి అటువంటిది. ఆ యింటినిండా ఉన్నది. భగవదనుభూతితో తేమ అయింది. పైనుంచి పడుతున్న మంచు కూడా తెల్లని తేమ. చల్లదనమూ, తేమ, రెండూ ఉన్నాయి. అందులో భాగం. ఇదేమిటంటే పైనుంచి పడుతున్న మంచు అన్నప్పుడు ఇక్కడ శాస్త్రములనుంచి బ్రహ్మ జ్ఞానులయొక్క అనుభూతులలోనుంచి కురుస్తున్న బోధ అనేటటువంటి ఆర్ద్రమైన జ్ఞానవృష్టి అది. అటువంటి జ్ఞానరూపమైన, భక్తిరూపమైన వృష్టి పైనుంచి కురుస్తున్నది. ఇతను భగవదనుభూతి కలిగినటువంటి మహాత్ముడు అనేటటువంటి పేరు జగత్తులో వ్యాప్తి చెందిపోయింది. పైగా అటువంటి నిన్ను మేము మేల్కొల్పుతున్నాం. మా మేలుకొలుపు విని దయచేసి రావమ్మా! అని అంటూ ఉన్నారు. ఇక్కడ రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు కోపగించుకోని అన్నారు. రామచంద్రమూర్తికి కోపం ఉందా? అంటే జితక్రోధుడు. ఆయనకు కోపం లేదు. కానీ జగద్రక్షణ కోసం ఆయన చూపించినటువంటి ధర్మాగ్రహం ఉన్నదే అది కూడా మనస్సుకు ఆహ్లాదం. భగవత్ కథ మనస్సుకు ఆహ్లాదం. పైగా రామచంద్రుడు, ఆయనను చూసినా ఆయనను తలన్చుకున్నా మనస్సు పరవశిస్తుంది. అందుకు
మనత్తుక్కినియానై - మనస్సును పరవశింపజేసే ఆ రామచంద్రుని గానం చేస్తూ ఉన్నాం. మేల్కొను తల్లీ! అని ప్రార్థిస్తున్నది ఇక్కడ ఆండాళ్ళమ్మ.
విష్ణుచిత్తుల వారి ఇంట ఉద్భవించిన తల్లి మనందరికీ కూడా దివ్యమైనటువంటి మధుర భక్తి మార్గాన్ని ఉపదేశించినటువంటి ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాశురాలలో 12వ పాశురాన్ని ఈరోజు ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం.
కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్
ఈదివ్యమైన పాశురములలో ఆ గోపకాంతని మేల్కొల్పుతున్నది. ఇది కూడా ఇక్కడ గోపకాంత అన్నప్పుడు దివ్యమైనటువంటి భగవత్ భావనా భూమికలో తాదాత్మ్య స్థితిలో ఉంటూ బహిర్ముఖత్వము లేని ఆచార్యుని ఆశ్రయించినటువంటి శిష్యులు తమకు దివ్యమైన భక్తి మార్గాన్ని నిర్దేశించమని ప్రార్ధిస్తున్న భావమే ఇందులో కూడా దర్శిస్తూ ఉన్నారు.
కనైత్తిళం కట్రెరుమై - ఇక్కడ మొట్టమొదట కనైత్తు అనే మాట మొదలవుతున్నది. అంటే అరచి అని అర్థం. గేదెలు అరుస్తున్నాయి అని. ఇది కూడా తెల్లవారుఝామున ఉన్న వాతావరణాన్ని చూపిస్తుంది. ఎలాంటి గేదెలు అంటే
ఇళంగత్తు ఎరుమై - అంటే లేగదూడలు కలిగినటువంటి గేదెలు. అవి దూడలకోసం అరుస్తున్నాయి. ఆ అరుస్తూ ఉండగా; పైగా
ఇరంగి - ఆ దూడల పట్ల జాలి, వాత్సల్య భావం కలుగుతూ ఉన్నది. దగ్గరలో ఆ దూడలు లేవు. కనుక దూరంగా ఉన్న దూడల కోసం వాత్సల్య భావంతో జాలి కలిగి అరుస్తున్నటువంటి ఆ గేదెలయొక్క పోడుగులలో నుంచి తమంత తాముగా పాలు స్రవిస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర - అంటే ఆ దూడలను తలంచుకుంటున్నాయి. దగ్గరలేని దూడలని వాత్సల్య భావంతో తలంచుకోవడం వల్ల ఆ పొదుగులో క్షీరము తమంత తాము స్రవిస్తున్నాయి. ములై వళియే - అంటే ఆ పొదుగుల యొక్క శిరములనుంచి; నిన్రు - నిండుగా ఎడతెగకుండా; పాల్ శోర - పాలు కారుతూ ఉన్నాయి. ఆ కారణం చేత ఆ ప్రాంతమంతా తడిసిపోయింది పాలతో.
ననైత్తిలమ్ శేరాక్కుమ్ - ఆ పాలతో తడిసిన మట్టి ఒక చిత్రమైన బురదగా మారింది. అలాగ ఎవరియొక్క గేదెలు యొక్క పాలు బురదగా మారాయో ఆ గేదెల యజమానియైనటువంటి ఒక మహానుభావుడున్నాడు, గోపకుడు. ఆ గేదెల యజమానియొక్క చెల్లెలా! నిద్రలే అన్నారిక్కడ. ఇక్కడ చిత్రమైన సంబోధన ఉంది. ఓ గోపికా నిద్రలే అనే భావమైనా ఈ గోపిక ఎవరు? ఒక గోపకునియొక్క చెల్లెలు. ఆ గోపకుడు ఎవరు? అంటే అతని దగ్గర ఆవులు, గేదెలు ఎన్నో ఉన్నాయి. ఆ గేదెల పాలు తమంత తాము స్రవించి ఆ భాగమంతా బురదతో ఉన్నది. ఇక్కడ ఎలాంటి భావము అంటే పొద్దున్నే ఇక్కడ ఈ గోపకాంతలు శ్రీవ్రతం చేద్దాం అని చెప్పి స్నానానికి బయలుదేరారు. వెళుతూ ఈ గోపికను కూడా నిద్రలేపడానికి ఆమె ఇంటికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికల్లా ఆ యింటి భాగమంతా ఎలా కనిపించింది అంటే ముందున్న మట్టి భాగమంతా బురద బురదగా ఉంది. ఆ బురద ఎక్కడిది? అక్కడునటువంటి గేదెలు, ఆవులు, వాటి యొక్క పాలవల్ల వచ్చిన బురద. నీటివల్ల వచ్చిన బురద కాదు. ఆ పాలు ఎలా కింద పడిపోయినయ్యి అంటే అవి తమంత తాము స్రవించాయి. ఇప్పుడు ఈ క్రింది భాగమంతా తేమతేమగా ఉంది నీ ఇంటికి వచ్చేటప్పటికీ. పైభాగం కూడా తడితడిగానే ఉన్నది. ఆకాశంలోంచి మంచు పడుతోందిట.
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి - పనిత్తెలై వీళ అన్నప్పుడు పైనుంచి పడుతున్న మంచుతో తల తడిసిపోతూ ఉన్నది. అందుకు ముందు మంచు పడకుండా ఉండడం కోసం అని; ద్వారం దగ్గరకు కదిలాము. నిన్ వాశల్ కడైపట్రి. ద్వారం వద్దకు రాగానే కింద మట్టియొక్క తేమ ఉన్నది. పైన మంచుయొక్క తేమ ఉన్నది. ఆ కారణం చేత క్రింద కాలుపడి జారిపడిపోకుండాను, పైన మంచుపడి తడిసిపోకుండానూ ఆ ద్వారం దగ్గరికి చేరి పైన ఉన్నటువంటి దూలము, కమ్మి అంటారు ఆ దూలాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాము మేము. నిలబడి ఆ నారాయణుని గానం చేస్తూ నిన్ను లేపుతున్నాము. ఇంకా నిద్రలేవవేమి? ఆమె పరంపర, ఆమె ఇంటియొక్క సంసారం ఎటువంటిది అంటే గొప్ప సంపన్నమైన, సంస్కారవంతమైన కుటుంబములో ఆమె పుట్టింది. ఆ సంపద ఎంత అంటే గొప్ప గో సంపద ఉంది వాళ్ళ దగ్గర. గోవులు తమంత తాము స్రవిస్తున్నాయి. ఇందులో ఉన్న భావాన్ని పరిశీలించాలి. ఇక్కడ దూరంగా ఉన్న దూడాలని తలంచుకుంటే ఆవులో వాత్సల్య భావం పొంగి ఆ మాతృవాత్సల్యంతో క్షీరం తమంత తాము స్రవించింది. దీనిలో భావం ఏమిటంటే వాత్సల్యం కలిగినప్పుడు హృదయం నిండుగా ఉన్నటువంటి ఆ అమృత భావన పైకి పొంగి వ్యక్తమవుతున్నది. అలాగ శిష్యులు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆచార్యుడు కరుణతో వారిని తలంచుకోగానే ఆయన హృదయం నిండా ఉన్న భగవదనుభూతి భగవత్ జ్ఞానము అనే క్షీరము వెలికి వస్తోంది. చక్కటి భావన ఇది. సాధారణంగా అనుభూతి కలిగినటువంటి వారు, సాధన చేసినటువంటి వారు, సిద్ధి పొందిన వారు, జ్ఞానులైన భక్తులు అనుభూతితో నిండిపోతారు. అలా నిండి పోయినటువంటి వారికి శిష్యులపై వాత్సల్యం కలిగితే అనుభూతి, ఆ జ్ఞానం ఉపదేశంగా వెలికి వస్తుంది. ఇక్కడ వాత్సల్య భావం అంటే దూడ, ఆవుకి ఉన్నటువంటి ఆ ప్రేమ బాంధవ్యాన్ని మనం వాత్సల్యం అనచ్చు. పెద్ద వాళ్ళకి పిల్లల పట్ల ఉన్న ప్రేమని వాత్సల్యం అని అంటారు. అలా గురువులకి కూడా శిష్యులపట్ల వాత్సల్యం ఉంటుంది. లేకపోతే ఏం చూసి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు వాళ్ళు? ఇచ్చే దక్షిణలు చూసి కాదు. వాళ్ళ యోగ్యతలు చూసి వీళ్ళ మనసు కరిగి చెప్పాలి. ఈ దివ్యమైన ఆచార్య స్వరూపమైనటువంటి ఆళ్వార్ రూపిణియైన గోపిక ఉన్న ఇల్లు అటువంటి భగవదనుభూతితో తడిసిపోయింది. ఆ ఇంటి పరంపర అంతే. అందుకే ఇంటి యజమానికి చెల్లెలా అన్నప్పుడు ఆ అనుభూతి అటువంటిది. ఆ యింటినిండా ఉన్నది. భగవదనుభూతితో తేమ అయింది. పైనుంచి పడుతున్న మంచు కూడా తెల్లని తేమ. చల్లదనమూ, తేమ, రెండూ ఉన్నాయి. అందులో భాగం. ఇదేమిటంటే పైనుంచి పడుతున్న మంచు అన్నప్పుడు ఇక్కడ శాస్త్రములనుంచి బ్రహ్మ జ్ఞానులయొక్క అనుభూతులలోనుంచి కురుస్తున్న బోధ అనేటటువంటి ఆర్ద్రమైన జ్ఞానవృష్టి అది. అటువంటి జ్ఞానరూపమైన, భక్తిరూపమైన వృష్టి పైనుంచి కురుస్తున్నది. ఇతను భగవదనుభూతి కలిగినటువంటి మహాత్ముడు అనేటటువంటి పేరు జగత్తులో వ్యాప్తి చెందిపోయింది. పైగా అటువంటి నిన్ను మేము మేల్కొల్పుతున్నాం. మా మేలుకొలుపు విని దయచేసి రావమ్మా! అని అంటూ ఉన్నారు. ఇక్కడ రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు కోపగించుకోని అన్నారు. రామచంద్రమూర్తికి కోపం ఉందా? అంటే జితక్రోధుడు. ఆయనకు కోపం లేదు. కానీ జగద్రక్షణ కోసం ఆయన చూపించినటువంటి ధర్మాగ్రహం ఉన్నదే అది కూడా మనస్సుకు ఆహ్లాదం. భగవత్ కథ మనస్సుకు ఆహ్లాదం. పైగా రామచంద్రుడు, ఆయనను చూసినా ఆయనను తలన్చుకున్నా మనస్సు పరవశిస్తుంది. అందుకు
మనత్తుక్కినియానై - మనస్సును పరవశింపజేసే ఆ రామచంద్రుని గానం చేస్తూ ఉన్నాం. మేల్కొను తల్లీ! అని ప్రార్థిస్తున్నది ఇక్కడ ఆండాళ్ళమ్మ.
No comments:
Post a Comment