గణితశాస్త్ర చరిత్రలో మహోన్నతుడు రామానుజన్
- నేడు జాతీయ గణితోత్సవం
- పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఆదేశాలు
ఎన్జీవోస్కాలనీ : గణితశాస్త్ర చరిత్రలో మహోన్నతమైన వ్యక్తి శ్రీనివాస రామానుజన్. 20వ శతాబ్దపు గొప్ప గణిత శాస్త్రవేత్త. 1887 డిసెంబర్ 22 న రామానుజన్ జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్క రించుకొని జాతీయ గణిత దినోత్సవంగా అధికారికంగా నిర్వహించుకుంటున్నాము. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మేళాలను నిర్వహించి విద్యార్థులకు గణితశాస్త్ర ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించాల్సి ఉంది. పాఠశాలలో ఈ సందర్భంగా గణిత కృత్యాలు, ప్రాజెక్టులు, క్రీడలు, ఫ జిల్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. వ్యాసరచన, వకృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించాలి. ఈ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ఆదేశాలను జారీ చేసింది.
గణితంపై అవగాహన కల్పించాలి..
సోమయ్య, డైట్ లెక్చరర్ (గణితశాస్త్ర బోధకుడు)
గణిత శాస్త్ర స్వభావాన్ని, భావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. గణితంతోని విద్యా ప్రమాణాలను విద్యార్థులలో పెంపొందించే విధంగా సంసిద్ధతను ఉపాద్యాయులు కలిగి ఉండాలి. ఫార్మీటివ్ అసెస్మెంటుకు సంబందించి, నూతన సమస్యల తయారీ, రాతపని, ప్రాజెక్టు పనులపై దృష్టి కేంద్రీకరించాలి. గణిత ప్రయోగశాలను ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేయాలి. కృత్యాలు, ప్రాజెక్టుల నిర్వహణలో విద్యార్థులకు మార్గ నిర్దేశం చేయాలి. నిరంతర, సమగ్ర మూల్యాంకనా విధానాలకు అనుగుణంగా గణిత పాఠ్యాంశాలను బోధించాలి
.
No comments:
Post a Comment