ఒక మిత్రుడు రావణుడు గొప్ప వాడు అని చెప్పారు. అవును రావణుడు అమిత మాతృ భక్తిపరుడు, శివదీక్షా తత్పరుడు , కార్యదీక్షా పరుడు .. వేద వేదాంగ నిపుణుడు, నాద శాస్త్రం తెలిసిన వైణికుడు కూడా . ఇన్ని గొప్పతనాలు ఉన్నా అతనిలోని చెడు లక్షణాలే ఆతని నాశనానికి దారి తీసాయి అన్నది ఎంత మాత్రం సత్య దూరం కాదు. పరుల సొమ్ము ఆశించడం, పరస్త్రీ వ్యామోహం, కట్టుకున్న ఇల్లాలు మండోదరి ధర్మం, హితం బోధించినా , తన తోడ బుట్టిన సోదరుడు విభీషణుడు చెవినిల్లు కట్టుకుని ధర్మ బోధ చేసినా తన అంతటి వారు లేరని వారి మాటలను శుష్క ప్రేలాపనలుగా కొట్టి వేసారు. ఎదుటి వారిని అత్యంత హీనంగా జమ కట్టడం , తన వల్ల కానిది లేదు అంటూ ఇతరులను నిందించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆతనిలోని చెడు లక్షణాలు అనేకమే.. వేద వేదాంగ నిపుణుడైనంత మాత్రాన, భక్తుడైనంత మాత్రాన ఆతను గొప్పవాడు కాలేడు. మన తెలుగు సినిమాలలో రావణుని చూసి అదే నిజం అనుకోకండి .
అదే శ్రీ రాముడు ఎందుకు ధర్మ మూర్తి అయ్యారో మనకు తెలిసిందే. రామో విగ్రహవాన్ ధర్మః అని ఎందుకు అంటాము.. ఆయన అణువణువూ.. ప్రతి ఒక్క చేత ధర్మాన్నే బోధిస్తుంది. రంగనాయకమ్మ, వోల్గా నవలలు చదివి సీతను ఎందుకు వదలి వేసారు అని ఎదురు ప్రశ్న వేయకండి.. దాని కారణం దానికి ఉంది.దీనికి బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ఇచ్చిన వివరణ చదివితే ఆ ప్రశ్నయే మీకు జన్మలో ఉదయించదు. దీనిని నడయాడే దేవుడు కంచి పరమాచార్య చదివి ఇంతటి అద్భుత వివరణ మరెక్కడా తాను వినలేదని మెచ్చుకున్నారు.. అపర బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు శ్రీ శాస్త్రి గారు.
No comments:
Post a Comment