మీరు ఇక్కడ ఉన్నారు: హోం తెలంగాణకథ
'మాకివ్వాల్సిన వాటా ఇస్తే పరిస్థితి మెరుగు'
Sakshi | Updated: October 16, 2014 21:37 (IST)

హైదరాబాద్: తెలంగాణలో తాజా విద్యుత్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హుదూద్ తుపాను వల్ల సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో కరెంట్ కొరత ఏర్పడిందని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. గత ఏడాది కంటే ఈఏడాది 32 శాతం డిమాండ్ పెరిగిందన్నారు. పంటలను కాపాడేందుకు జలవిద్యుత్ మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం కృష్ణపట్నం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందన్నారు. వచ్చే ఏడాది మే నెల నుంచి విద్యుత్ ఇచ్చేందుకు మరిన్ని సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. రూ.310 కోట్లతో ఇప్పటికే 539 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఛత్తీస్ గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిందని కేసీఆర్ తెలిపారు.
'మాకివ్వాల్సిన వాటా ఇస్తే పరిస్థితి మెరుగు'
Sakshi | Updated: October 16, 2014 21:37 (IST)
హైదరాబాద్: తెలంగాణలో తాజా విద్యుత్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హుదూద్ తుపాను వల్ల సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో కరెంట్ కొరత ఏర్పడిందని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. గత ఏడాది కంటే ఈఏడాది 32 శాతం డిమాండ్ పెరిగిందన్నారు. పంటలను కాపాడేందుకు జలవిద్యుత్ మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం కృష్ణపట్నం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందన్నారు. వచ్చే ఏడాది మే నెల నుంచి విద్యుత్ ఇచ్చేందుకు మరిన్ని సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. రూ.310 కోట్లతో ఇప్పటికే 539 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఛత్తీస్ గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిందని కేసీఆర్ తెలిపారు.
No comments:
Post a Comment