ఎన్ఆర్ఐలు తోడ్పడాలి!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అమెరికా పర్యటన నేపధ్యంగా డెల్లాస్ లో కృష్ణా జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంలో ప్రవాసాంధ్రులు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. అలాగే కొత్త రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు పెట్టేందుకు మంచి అవకాశముందని, ప్రవాసాంధ్రులకు ఇది సరైన తరుణమని బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అబ్బురపడేలా కొత్త రాజధానిని నిర్మిస్తున్నామని దీనికి ప్రవాసాంధ్రులు తగిన సహకారం అందించాలని కోరారు. ఇక విజయవాడను రాజధానిగా నిర్మిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాలికా బద్ధంగా ముందుకు సాగుతున్నారని కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా పరిశ్రమలు ఏర్పాటు చేయదలచుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతను అందిస్తుందని మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు.
No comments:
Post a Comment