భారత్ వస్తా.. మోదీని కలుస్తా: జుకెర్ బెర్గ్
PTI | Updated: October 01, 2014 11:46 (IST)
న్యూఢిల్లీ : సోషల్ నెట్ వర్కింగ్ మార్కెట్లో నెంబర్ 2 స్థానంలో ఉన్న భారతదేశానికి తాను ఈనెలలో వస్తానని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బెర్గ్ చెప్పారు. అలా వచ్చినప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తానన్నారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 9, 10 తేదీల్లో నిర్వహించే మొట్టమొదటి ఇంటర్ నెట్.ఆర్గ్ సదస్సులో పాల్గొనేందుకు జుకెర్ బెర్గ్ వస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోని కొంతమంది కీలక మంత్రులను కూడా ఆయన కలుస్తారు. ఆమెరికాలో బాగా పేరున్న సీఈవోలలో జుకెర్ బెర్గ్ ది మూడోస్థానం. మొదటి రెండు స్థానాల్లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, రెండోస్థానంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు. వీళ్లలో సత్యనాదెళ్ల ఇప్పటికే భారత్ వచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇంటర్ నెట్ ను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఇంటర్ నెట్.ఆర్గ్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అసలు అది అందుబాటులో లేని 500 కోట్లమందికి దాన్ని అందించాలన్నది సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో ఫేస్ బుక్, ఎరిక్సన్, మీడియా టెక్, నోకియా, ఒపెరా, క్వాల్ కామ్, శామ్ సంగ్ లాంటి దిగ్గజ సంస్థలు పాల్గొంటాయి.
No comments:
Post a Comment