ప్రకాష్ రాజ్ కు ఎదురైన అనుభవమే....
Sakshi | Updated: August 23, 2014 14:08 (IST)
మొన్న నటుడు ప్రకాష్ రాజ్ ఎదుర్కొన్న అనుభవమే... తాజాగా మరో మహిళకు ఎదురైంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో మనుషులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచు చోటుచేసుకుంటున్నాయి. సాయం చేయాలని అర్ధిస్తున్నా పట్టించుకోకుండా వినోదం చూస్తున్నట్లు సెల్ ఫోన్లలో ఆ సంఘటను బంధించటంలో కొందరు పోటీలు పడ్డారు. రోడ్డుమీద ఏం జరిగినా సాయం చేయడం మానేసి వీడియోలు తీసి ఫేస్ బుక్ లోను, యూట్యూబ్ లోను పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పదే పదే చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పట్టపగలు.. నడిరోడ్డుమీద తన భర్తపై దాడి చేస్తున్న ఇద్దరు యువకులను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. దంపతుల బైకును కారుతో ఢీకొట్టిన యువకులు, ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో పాటు ఆమె భర్తపై దాడికి దిగారు. తమకు సాయం చేయాలంటూ ఆ మహిళ అక్కడున్న వారిని ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. పైగా చోద్యం చూస్తూ. ఈ సంఘటనను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించటంలో నిమగ్నమైపోయారు.
దాంతో భర్తను రక్షించుకునేందుకు ఆ మహిళే రంగంలోకి దిగింది. అపరకాళిలా విరుచుకుపడి ...దాడికి దిగిన యువకులకు దేహశుద్ధి చేసింది. ఈ ఘటనను చూసిన ఓ హోం గార్డు తీరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో తీసినవాళ్లు దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో.. ఆ వీడియోను చూసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుమీద సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయినా... సామాజిక వెబ్ సైట్లలో ఆమెకు పెద్ద ఎత్తున సానుభూతితో పాటు అభినందలు తెలపటం విశేషం.
సరిగ్గా ప్రకాష్ రాజ్ కు కూడా ఇలాంటి అనుభవమే ఇంతకుముందు ఎదురైంది. దాని గురించి ఆయన ట్విట్టర్ లో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదం కన్నా ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు మరింత బాధించాయి. ప్రమాదాన్ని పట్టించుకోకుండా కొందరు యువకులు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసుకోవడంలో బిజీగా కనిపించారు. ఆ పరిస్థితి చూసి సిగ్గుతో తలవంచుకున్నాను. నా ప్రాణం మీద భయం కన్నా మానవత్వం లేకుండా ప్రవర్తించే అలాంటి మనుషులను చూసి భయమేసింది’ అంటూ ట్వీట్ చేశారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పట్టపగలు.. నడిరోడ్డుమీద తన భర్తపై దాడి చేస్తున్న ఇద్దరు యువకులను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. దంపతుల బైకును కారుతో ఢీకొట్టిన యువకులు, ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో పాటు ఆమె భర్తపై దాడికి దిగారు. తమకు సాయం చేయాలంటూ ఆ మహిళ అక్కడున్న వారిని ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. పైగా చోద్యం చూస్తూ. ఈ సంఘటనను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించటంలో నిమగ్నమైపోయారు.
దాంతో భర్తను రక్షించుకునేందుకు ఆ మహిళే రంగంలోకి దిగింది. అపరకాళిలా విరుచుకుపడి ...దాడికి దిగిన యువకులకు దేహశుద్ధి చేసింది. ఈ ఘటనను చూసిన ఓ హోం గార్డు తీరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో తీసినవాళ్లు దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో.. ఆ వీడియోను చూసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుమీద సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయినా... సామాజిక వెబ్ సైట్లలో ఆమెకు పెద్ద ఎత్తున సానుభూతితో పాటు అభినందలు తెలపటం విశేషం.
సరిగ్గా ప్రకాష్ రాజ్ కు కూడా ఇలాంటి అనుభవమే ఇంతకుముందు ఎదురైంది. దాని గురించి ఆయన ట్విట్టర్ లో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదం కన్నా ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు మరింత బాధించాయి. ప్రమాదాన్ని పట్టించుకోకుండా కొందరు యువకులు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసుకోవడంలో బిజీగా కనిపించారు. ఆ పరిస్థితి చూసి సిగ్గుతో తలవంచుకున్నాను. నా ప్రాణం మీద భయం కన్నా మానవత్వం లేకుండా ప్రవర్తించే అలాంటి మనుషులను చూసి భయమేసింది’ అంటూ ట్వీట్ చేశారు.
----------------------
స్వార్ధం మనుష్యులలో బాగా పెరిగి పోయినది, గొప్పతనమును సూటిగా పటించుకోవడం, కష్టాలను పటించుకోవడం లేదు, ఏది ఏమైనా ప్రతి మనిషి తన స్వార్ధం చూసుకొంటున్నాడు ----- అలంటి వాళ్ళలో నేను ఒక్కడిని ----- కాని నేను ఏమి చేసాను ఇప్పటికి ----- ఏమి చేస్తున్నాను ------ ఏమి చేద్దాం రండి అని ముందుకు పిలుస్తున్నాను ----- ఆలోచించండి, సూటి గా స్పందించండి, స్వార్ధం, కపటం వదలండి, మంచితన్నాని గోప్పతన్నాని పెంచుకోండి నిలుపికొండి .
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం {డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్]
హైదరాబాద్
No comments:
Post a Comment