పేదవాడికి కార్డు ఇవ్వడం తప్పా?: హరీష్రావు
Updated : 10/20/2014 1:24:58 PM

మెదక్ : ప్రతి పేదవాడికి ఆహార భద్రత కార్డు ఇవ్వడం తప్పా అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. ఇవాళ సంగారెడ్డిలో మంత్రి హరీష్రావు మీడియాతో మాట్లాడారు. కొత్త కార్డులు ఇస్తే నష్టమేంటని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. రూ. 1000లు పింఛను ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని అడిగారు. ఏ ఒక్క పేదవాడు కూడా ఆహార భద్రత కార్డు లేకుండా ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. స్పష్టమైన నిబంధనలతోనే సర్వే చేయిస్తున్నామని తెలిపారు. ఆహార భద్రత కార్డులు ఇవ్వడం నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment