UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 20 October 2014

ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్ర మీడియా తెలంగాణను ప్రశాంతంగా బతకనివ్వదలుచుకోలేదు. ఆత్మగౌరవంతో పరిపాలనను చేసుకోనివ్వదలుచుకోలేదు. నిష్ఠూరంగా ఉన్నా ఇది నిజం. అదే ఈనాడు రాతల్లో వెల్లడైంది. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణకు విద్యుత్ రాకుండా అడ్డుకుంటారు.

దాహం పేరుతో ఈనాడు ద్రోహం

Updated : 10/20/2014 2:51:34 AM
Views : 3384

eenadu cheating


ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్ర మీడియా తెలంగాణను ప్రశాంతంగా బతకనివ్వదలుచుకోలేదు. ఆత్మగౌరవంతో పరిపాలనను చేసుకోనివ్వదలుచుకోలేదు. నిష్ఠూరంగా ఉన్నా ఇది నిజం. అదే ఈనాడు రాతల్లో వెల్లడైంది. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణకు విద్యుత్ రాకుండా అడ్డుకుంటారు. పీపీఏలు చెల్లవంటారు. శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేయాలని ఆంధ్ర నీటిపారుదల మంత్రి పిలుపునిస్తారు. ఈనాడు దినపత్రిక వెంటనే ఆయన పాటకు పల్లవి కడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తే శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటుతుందని, తాగునీటికి కటకట ఏర్పడుతుందని తెగ బాధపడిపోతుంది. 

వీరందరి ఆంతర్యం ఒక్కటే.. తెలంగాణ ముందటపడొద్దు. తెలంగాణకు శ్రీశైలం నుంచి ఇప్పుడు వస్తున్న 700 మెగావాట్ల విద్యుత్తు కూడా ఆగిపోవాలి. ఇక్కడ రైతులు అల్లాడిపోవాలి. పొలాలు ఎండిపోవాలి. రైతులు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయాలి. ఆ వార్తలను పేజీల నిండా కుమ్మేయాలి. తెలంగాణ ప్రభుత్వం విఫలమయిందని ప్రచారం చేయాలి. ఇదీ అసలు కుట్ర..

-తెలంగాణ కరెంటుపై మరో కుట్ర
-జలవిద్యుత్ ఆపాలని కథనాలు
-మంచినీళ్లకు సమస్య అంటూ సాకులు
-ఆంధ్రకు నీళ్లివ్వాలనేదే ఈనాడు తపన
-తెలంగాణ రైతులేమైనా పట్టనితనం
-109 టీఎంసీలు నిండుగా ఉన్నా గోబెల్స్ ప్రచారాలు
-770 అడుగుల దాకా ఖాళీ చేసినపుడు చంద్రబాబు హీరో
-రైతుకోసం విద్యుత్ ఉత్పత్తి చేస్తే నష్టమంటూ భాష్యం
-ఇప్పటికే కోటా మించి తరలించుకున్న ఆంధ్ర
-సోమశిల, కండలేరు, వెలిగోడుల్లో నీళ్లు ఫుల్లు
-రెండో పంటకోసం ముందస్తు జాగ్రత్తలు

ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్ర మీడియా తెలంగాణను ప్రశాంతంగా బతకనివ్వదలుచుకోలేదు. ఆత్మగౌరవంతో పరిపాలనను చేసుకోనివ్వదలుచుకోలేదు. నిష్ఠూరంగా ఉన్నా ఇది నిజం. అదే ఈనాడు రాతల్లో వెల్లడైంది. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణకు విద్యుత్ రాకుండా అడ్డుకుంటారు. పీపీఏలు చెల్లవంటారు. శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేయాలని ఆంధ్ర నీటిపారుదల మంత్రి పిలుపునిస్తారు. ఈనాడు దినపత్రిక వెంటనే ఆయన పాటకు పల్లవి కడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తే శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటుతుందని, తాగునీటికి కటకట ఏర్పడుతుందని తెగ బాధపడిపోతుంది.

Eenadu-Srisailam


వీరందరి ఆంతర్యం ఒక్కటే.. తెలంగాణ ముందటపడొద్దు. తెలంగాణకు శ్రీశైలం నుంచి ఇప్పుడు వస్తున్న 700 మెగావాట్ల విద్యుత్తు కూడా ఆగిపోవాలి. ఇక్కడ రైతులు అల్లాడిపోవాలి. పొలాలు ఎండిపోవాలి. రైతులు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయాలి. ఆ వార్తలను పేజీల నిండా కుమ్మేయాలి. తెలంగాణ ప్రభుత్వం విఫలమయిందని ప్రచారం చేయాలి. ఇదీ అసలు కుట్ర..

హైదరాబాద్, అక్టోబర్ 19 (టీ మీడియా): ఈనాడు దినపత్రిక శ్రీశైలంపై మరోసారి గోబెల్స్ అవతారం ఎత్తింది. విషాన్ని చక్కెరపూతతో అందించడంలో ఆ పత్రికది అందెవేసిన చేయి. అందుకే చాలా పొందిగ్గా అందంగా అడుగంటిన శ్రీశైలం అంటూ ఆదివారం సంచికలో ఓ విషకథనాన్ని వండి వడ్డించింది. శ్రీశైలం ప్రాజెక్టు మీద తెలంగాణ భారీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నదని, ఆ దెబ్బకు మొత్తం నీళ్లన్నీ అయిపోయి రేపు మంచినీళ్లకు కటకట వస్తుందనేది దాని సారాంశం.

Srisailam-Yedamagat


పాపం మంచినీళ్లే ఉండవట అనుకునేలాగ అవసరమున్న అంకెలను మాత్రమే అందులో పేర్చారు. కానీ..ఇంత పెద్ద శ్రీశైలంలో తెలంగాణ ఒక్కటంటే ఒక్క టీఎంసీ నీరు కూడా వాడుకోకుండా చేశారని, ఆ నీళ్లు వెళ్లడం అంటూ జరిగితే ఆంధ్రకే వెళతాయని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ మాటకొస్తే ప్రతి ప్రాజెక్టుకు ఏఏ సమయాల్లో ఎంత నీటి మట్టం ఉంచాలో నిబంధనలున్నాయని, ఆ నిబంధనలు పాటిస్తూనే ఇక్కడ ఉత్పత్తి జరుగుతుందని కూడా ఎక్కడా చెప్పలేదు.

రిజర్వాయర్ అడుగంటుతున్నదా?


నిజంగానే శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటిందా? వాస్తవానికి అడుగంటలేదు. ఆదివారం రిజర్వాయర్ నీటిమట్టం 861 అడుగులు. మొత్తం 109 టీఎంసీల నీరు ఉంది. 834 అడుగుల వరకు విద్యుత్ ఉత్పత్తికి నీటిని తీసుకోవచ్చునని 1996 జూన్‌లో జీవో 69 జారీ అయింది. అది జారీ చేసింది కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. అప్పుడు అది వారి అవసరం కాబట్టి ఇచ్చారు.

అంటే తెలంగాణ ఇంకా బోలెడంత నీటిని వాడుకోవచ్చు. పోనీ.. నీటి మట్టాలు కాపాడడంలో అంత పవిత్రత పాటిస్తున్నారా? అంటే అదీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలంలో నీటి లెవెల్స్‌ను ఆంధ్రులు అస్సలు లెక్క చేయలేదు. కృష్ణా డెల్టాకు అవసరమయినప్పుడు శ్రీశైలం రిజర్వాయరు గేట్లే ఎత్తిపారేసే వారు. అలా 770 అడుగుల దాకా ఖాళీచేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడెప్పుడూ ఈనాడుకు బాధ కలుగలేదు. మంచినీళ్లు, కన్నీళ్లు గుర్తుకు రాలేదు.

Jalapishachi


అంతెందుకు?.. నాగార్జునసాగర్ నీటి మట్టాన్నే 470 అడుగుల దాకా ఖాళీచేసిన ఘన చరిత్ర కూడా ఈ ఆంధ్ర నాయకత్వానికి ఉంది. పైగా చంద్రబాబునాయుడు రిజర్వాయర్లు ఖాళీ చేసయినా కడుపునింపిన హీరో అవుతాడు. రిజర్వాయర్లు ఖాళీ చేసి పంటలు కాపాడిన మొనగాడు అవుతాడు. మొదటిపేజీ వార్త అవుతాడు. అదే కేసీఆర్ తెలంగాణ రైతులకోసం విద్యుత్ ఉత్పత్తి చేస్తే మాత్రం నేరం, ఘోరం. ఈనాడు తన వక్రబుద్ధిని దాచుకోవడం లేదు.

హక్కు లేమిటి? లెక్క లేమిటి?


శ్రీశైలం ఎగువన ఎడమకాలువ, కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాల ద్వారా 97 టీఎంసీల నీటిని వినియోగించుకునే అధికారం, హక్కు తెలంగాణకు ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయరు పూర్తయిన మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణ ఒక్క టీఎంసీ నీటిని వినియోగించుకోలేని దుస్థితిలో ఉంది. వాడుకోగల వ్యవస్థ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అంటే శ్రీశైలం నీటిని తీసుకునే అవకాశం మొత్తం ఆంధ్రావారికే ఉంది.

పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్, హంద్రీనీవా కాలువల ద్వారా రాయలసీమకే ఉంది. న్యాయంగా శ్రీశైలంలో కుడికాలువ ద్వారా 19 టీఎంసీలు, తెలుగు గంగ ద్వారా 15 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకునే హక్కు రాయలసీమకు ఉంది. తెలుగు గంగ నీటిలో కూడాఆంధ్ర వాటా 5 టీఎంసీలే. మిగిలిన పది టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర వాటాల్లోంచి ఇవ్వాల్సినవే. కానీ ఈ రెండు మాసాల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 54 టీఎంసీల నీటిని తరలించినట్టు ఆంధ్ర ప్రభుత్వమే వెల్లడించింది. ఇవి బయటికి చెప్పే లెక్కలు మాత్రమే. వాస్తవానికి ఎన్ని టీఎంసీలు తరలించారో ఎవరికీ తెలియదు.

ఆ రిజర్వాయర్లలో నీరెక్కడిది?..


ఈసారి వర్షాలు లేవు. రాయలసీమలో అసలే లేవు. కాలం కాకపోయినా, పెన్నా నది పొంగకపోయినా నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టులో 45.23 టీఎంసీల నీరు ఉంది. అదే జిల్లాలోని కండలేరులో పోయిన ఏడాది కంటే ఎక్కువగా 22.43 టీఎంసీల నీరు ఉంది. వెలిగోడురిజర్వాయరులో 10.6 టీఎంసీల నీరు ఉంది. ఈ నీరంతా ఎక్కడిది? కర్నూలు, కడప జిల్లాల్లోని అనేక రిజర్వాయర్లను కుడికాలువకు, తెలుగు గంగకు సంధానించి ఉన్నారు.ఏ కేటాయింపుల ప్రకారం ఆ ప్రాజెక్టులకు నీరు తరలించుకుపోయారు? ఈనాడుఏరోజూ పొరబాటున కూడా ఆ ప్రశ్న వేయదు. కానీ తెలంగాణలో రైతాంగంకోసం విద్యుత్ ఉత్పత్తి చేస్తే మాత్రం ఒకటే కన్నీళ్లు. కాలువ కడితే ఆ ప్రాజెక్టు నిండి ఉండేది.

ఆ నీరంతా ఎటు పోతున్నది?


పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలంనుంచి కేవలం 30 వరద రోజుల్లో మాత్రమే నీటిని తీసుకోవాలనే నిబంధన ఉంది. అసలిప్పుడు వరదే లేదు. మరి! నీళ్లు ఎలా అడుగుతున్నారో ఆంధ్ర పాలకులకే తెలియాలి. వరద జలాలపై ఆధారపడి ఏర్పాటు చేసిన పోతిరెడ్డిపాడు ద్వారా రోజూ అనధికారికంగా 15 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతున్నారని టీ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. ఇక అసలైన మాయా మశ్చీంద్ర శ్రీశైలంనుంచి సాగర్‌కు విడుదల అవుతున్న నీటి లెక్కల్లో కనిపిస్తుంది. శ్రీశైలం నుంచినీరు విడుదల చేసే క్రమంలో చూపించే లెక్కలకు, నాగార్జునసాగర్‌కు చేరుతున్న నీటికి పొంతనే ఉండడం లేదు.

ఈ తేడా ఏకంగా 50 వేల క్యూసెక్కులకు పైనే ఉంటోంది. సాగర్ పేరు చెప్పి ఆ నీరు కూడాపోతిరెడ్డిపాడు ద్వారా సీమకు తరలిస్తున్నారన్నది ఆరోపణ. ఇటీవలి వర్షాల సమయంలో శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. వారం రోజుల కిందట కూడా పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 15 వేల క్యూసెక్కులు వెళ్లాయని, అంతకు ముందు రోజుకు 32 వేల క్యూసెక్కుల వరకు వెళ్లినట్లు తెలంగాణ ఇంజినీర్లు చెబుతున్నారు.


srisailam


మరి సాగర్ ఉత్పత్తి ఆపరెందుకు?


సరే.. శ్రీశైలంలో ఉత్పత్తి చేస్తే కొరత వస్తుందని మాట వరసకు అనుకుందాం. మరి ఇదే సూత్రం నాగార్జున సాగర్‌కు వర్తిస్తుంది కదా. మరి అక్కడ ఉత్పత్తి ఆపమని అడగరెందుకు? అసలు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే నీళ్లు తెలంగాణకు రావు. నాగార్జునసాగర్‌కు పోతాయి. నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి చేస్తే కృష్ణా డెల్టాకు పోతాయి.

ఆంధ్ర మంత్రులు నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని ఎందుకు అడగరు? కృష్ణా డెల్టాకు నీరు అవసరమయితే దేనినయినా ఆమోదిస్తారా? తెలంగాణకు విద్యుత్ అవసరమయితే, హక్కు, అవకాశం ఉండీ ఉత్పత్తి చేసుకోకూడదా? అనేది తెలంగాణవాదుల ప్రశ్న. ఇపుడు ఏపీ కోరినట్లుగా శ్రీశైలం కుడి, ఎడమల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే రోజుకు 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి తెలంగాణకు రావలసిన విద్యుత్తు కూడా నిలిచిపోతుంది. ఇప్పటికే ఆంధ్ర పరిధిలోకి వచ్చే 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన శ్రీశైలం కుడి కాలువ విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేశారు. అది ఉత్పత్తి చేస్తే అందులో 54శాతం వాటా తెలంగాణకు వచ్చేది.

అష్టకష్టాల పాలవుతున్న తెలంగాణ..


అసలే తెలంగాణ రైతాంగం కరెంట్ కష్టాలు ఎదుర్కొంటున్నది. విద్యుత్ తేవడానికి గ్రిడ్ లేక సర్కారు సతమతమవుతున్నది. మునుపెన్నడూ లేనంత స్థాయిలో గరిష్ఠంగా యూనిట్‌కు రూ. 8.90 పెట్టి విద్యుత్ కొనుగోలు చేసింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 20 నుంచి 30 మిలియన్ యూనిట్‌ల అదనపు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది.ఈ సమయంలో శ్రీశైలంవిద్యుత్ ఉత్పత్తి ఆసరాగా ఉన్నది.

ఇక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలనికోరడం ఎందుకు? రాష్ర్టాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశంలు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి ఏనాడైన శ్రద్ధపెట్టాయా? దేశంలోనే మొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటు చేతుల్లో పెట్టి గబ్బుపట్టించిన ఘనాపాఠీ చంద్రబాబునాయుడు. ఆకంపెనీలన్నీ ఆంధ్రాలోనే పెట్టించారు. ఇప్పుడు ఆ కంపెనీల నుంచి విద్యుత్ రాకుండా అవరోధాలు కల్పిస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ విద్యుత్ అవసరాలనుపట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు తగుదుమమ్మా అంటూ వీధుల్లో అల్లరి చేస్తున్నారు.

కృష్ణపట్నం మాటేమిటి?...


పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం పరిధిలో ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగినా అందులో తెలంగాణకు 54 శాతం వాటా ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. అందులో 54శాతం ఇవ్వాల్సి వస్తుందనే దానిని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించకుండా ఆపి ఉంచింది.

సముద్రంలోకి పోయే వేల క్యూసెక్కుల మాటేమిటి?


గమ్మత్తైన విషయం ఏమంటే .. తెలంగాణవారు పులిచింతల నిర్మాణాన్ని వ్యతిరేకించినపుడో లేదా పోతిరెడ్డిపాడుతో నీటిని మళ్లించడం అన్యాయమని వాదించినపుడో ఆంధ్రావాళ్లకి లక్షల కొద్దీ క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోవడం గుర్తుకు వస్తుంది. ఆంధ్రా మీడియా కూడా కృష్ణానది హోరెత్తుతూ సువిశాల సముద్రంలోకి పరుగులు పెడుతున్న కథనాలతో సినిమా చూపిస్తుంది.

మనం సాగర్ ఎడమకాల్వకు నీరివ్వక పోవడం గురించో లేదా శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి గురించో వాదిస్తే మాత్రం వారికి హఠాత్తుగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ కట్టిన విషయం గుర్తుకు వస్తుంది. చాలీచాలని వర్షపాతం గుర్తుకు వస్తుంది. బక్కచిక్కిన కృష్ణమ్మ గుర్తుకు వస్తుంది. అడుగంటిన శ్రీశైలం డ్యాము కనిపిస్తుంది. నీళ్లు లేక ఎండిపోయిన సాగర్ గర్భం కనిపిస్తుంది. అనేక దశాబ్దాలుగా సీమాంధ్ర మీడియా ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నది. ఇవాళ కూడా అంతే.. అక్కడి ప్రభుత్వం రేపు చేయబోయే డిమాండ్‌కు ఈ రోజే ఈనాడు ముందస్తు సద్దులు కట్టింది.

అప్పుడు రెండు గట్లూ ఆంధ్రవేనన్నారు..


అసలు ఈనాడు బుద్ధి రాష్ట్ర విభజన సమయంలోనే బయటపడింది. ఆకుకు పోకకు అందని ఓ మ్యాపు పట్టుకుని శ్రీశైలం కుడి ఎడమ రెండు గట్లూ సీమాంధ్రవే అంటూ ఓ కథనం ప్రచురించింది. ఈగల పెంట మాదే.. దోమల పెంట మాదే.. మొత్తం శ్రీశైలమంతా మాదే అని తెగ సంబరపడింది. అయితే రిజర్వ్ పారెస్టు అనేక జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. ప్రామాణికం రెవెన్యూ రికార్డులే తప్ప అటవీశాఖ రికార్డులు కావని నమస్తే తెలంగాణ ఆనాడు ఈనాడు ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు నిజాం కాలంనాటి రికార్డులను, తాజా రికార్డులను కూడా బయటపెట్టింది. దాంతో ఈనాడు నాలిక్కరుచుకుంది.

No comments:

Post a Comment