Saturday June 06th 2015
గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 'భవ్య క్రియేషన్స్ పతాకం పై నిర్మాత ఆనంద్ ప్రసాద్ ప్రొడక్షన్ నెంబర్6' వ చిత్రం ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్ లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి శ్రీదర్ సీపాన క్లాప్ ను ఇవ్వగా, నిర్మాత ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి మాట్లాడుతూ నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. నా మొదటి సినిమా అవకాశం ఆయనే ఇచ్చారు. ఆనంద్ ప్రసాద్, గోపీచంద్ లతో మరోసారి పని చేయడం ఆనందంగా ఉంది. ప్రసాద్ మూరెళ్ళ గారితో ఎప్పటినుండో వర్క్ చేయాలనుకున్నాను. ఈ సినిమాతో ఆయనతో వర్క్ చేసే అవకాశం వచ్చింది. శ్రీధర్ సీపాన మంచి స్టొరీ ఇచ్చారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ చిత్రమిది. జూలై మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. ఈ చిత్రం పిల్లా నువ్వులేని జీవితం, లౌక్యం సినిమాల కంటే పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ "శ్రీధర్ సీపాన లౌక్యం తరువాత మరో మంచి కథ చెప్పారు. నా కెరీర్ లో 'యజ్ఞం' లాంటి హిట్ ఇచ్చిన రవికుమార్ గారితో మరోసారి వర్క్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు
మా ద్వారా 2003 వ్యక్తం అయిన పాటలో ఇది ఒకటి పూర్తీ గా వ్యక్తం అయినది సూర్యుడు అయిన చల్లారి పోడా వాడిలో వేడికి వాడిలో వాడికి ఎన్నడూ అ ధాటి కనలేదు అని
No comments:
Post a Comment