UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 10 July 2015


 
ధౌమ్య హితోక్తులు -- 10

31. రాజుతో సమానముగా తన వస్త్రాలంకారములుండ కూడదు
ఈ సూత్రములను తన BOSS కు సేవ చేయునపుడు గుర్తుంచుకొనిన ఆ సేవకునికి తిరుగు లేదు.'అతి సర్వత్ర వర్జ్యేత్' అన్న విషయాన్ని ఎంత విపులముగా చెప్పినాడో చూడండి. BOSS ఏ బట్టలు వేసినా, తాను తన మహిళా సహచరుల కోసమే విచిత్ర విపరీత వస్త్ర ధారణ చేసుకొని వస్తాడు. BOSS వద్ద వెకిలి వేషాలు నిష్కారణమైన హాస్యము మొదలగునవి చేస్తాడు. ఇది లేని ఎబ్బెట్టు తనానికి దారి తీయుటయేకాక మనిషిని అందరిదృష్టి లోను ఆపై అధికారి దృష్టిలోను పూర్తిగా దిగజార్చుతుంది.

32. రాజునకతి సమీపములో గానీ అతి దూరములో గానీ యుండకూడదు. అసలు రాజుకెదురుగా కూర్చుండ కూడదు.
దూరమో దగ్గరో సాధారణ సభ లో తన స్థానములోనే తాను కూర్చోవలెనని ముందుగానే చెప్పుకొన్నాము. ఇక ప్రత్యేక సభలలో అతిధులందరికీ స్థానములు నిర్దేశించి యుండబడవు కాబట్టి ఒక ఆహ్వానితునిగా ఎప్పుడూ దూరము దగ్గర కాకుండా మధ్యేమార్గముననుసరించుట మంచిది.రాజు చూపులకు అందుబాటులో వుంటాడు వక్తల సంభాషణలను చక్కగా వినగలుగుతాడు. మరీ రాజుకు ఎదురుగా కూర్చుంటే రాజు భావోద్వేగానికి బలీయ్యే అవకాశము వుండవచ్చు. కాబట్టి ఎప్పటికీ మధ్యేమార్గము మంచి మార్గము.

33. ఒకే విషయము పై విరుద్ధమైన అనేక సలహాలు ఇవ్వనివాడే రాజుకు ప్రీతీ పాత్రుడు కాగలడు
ఇది రాజుసేవలో వున్నంత కాలమేకాదు జీవితమంతాకూడా గుర్తుంచుకొవలసిన విషయము.
అన్నీ తెలుసను ఆత్రము వీడుము
అదివుందనుకొని అడుసు తొక్కకుము
బుద్ధికి పదునది పూర్తిగ పెట్టుము
కత్తి పదునుకే కాయ తెగునది
నోటికి తోచిన మాట చెప్పకుము
మాట మంత్రమని మరువకుమెప్పుడు
మాట యొక్కటే మనుగడ కూర్చును
అది గమనించిన అంతయు జయమే

34. సమ్మానమునకు అతిగా పొంగి పోరాదు. రేపెట్లు ఉంటుందో తెలియదు కదా
సమ్మానమునకు అతిగా పొంగి పోరాదు. రేపెట్లు ఉంటుందో తెలియదు కదా
రాజాశ్రయమ్మున దూషణ భూషణ తిరస్కారములను ఆశీస్సులుగానే తలువవలసివుంటుంది. ఈ రోజు సన్మానమౌతే రేపు అవమానము జరుగవచ్చు.ఈ విషయములో భర్తృహరి సుభాషితము ఏమంటున్నదో చూస్తాము:
నమ్రత్వేనోన్నమంతః పరగుణ కథనైః స్వాన్గుణాన్య్ఖాపయంతః
స్వార్థాన్సంపాదయంతో వితత పృథుతరారంభ యత్నాః పరార్థే ।
క్షాంత్యైవాక్షేప రూక్షాక్షర ముఖర ముఖా న్దుర్జనా న్దుఃఖయంతః
సంతః సాశ్చర్యచర్యా జగతి బహుమతాః కస్య నాభ్యర్చనీయాః ॥ 60

తాత్పర్యము: అణుకువ గల వారగుటచేత సత్పురుషులు ఔన్నత్యమును పొందుచున్నారు. ఇతరుల గుణములను కీర్తించుట చేతనే తమ సద్గుణములను వెల్లడించు చుందురు. పరుల కార్యముల సాఫల్యతకై ప్రయత్నము చేయుచూ తమ పనులను కూడా నెరవేర్చుకుందురు.

35. రాజు ఏదయినా బాధ్యత నొసంగినపుడు కడు జాగరూకతతో మెలగవలెను. తన సర్వస్వము ఒడ్డి యయినా రాచ కార్యమును జయప్రదము చేయవలెను

ఈ సందర్భములో తిక్కనగారి ఈ మాట చదవండి

ఎండకు వాన కోర్చి తన-యిల్లు ప్రవాసపుఁజోటు నాక యా
కొండు నలంగుదున్‌ నిదుర-కుం దఱి దప్పెడు డప్పి వుట్టె నొ
క్కండన యెట్లొకో యనక - కార్యము ముట్టినచోట నేలినా
తం డొకచాయ చూపినను - దత్పరతం బని సేయు టొ ప్పగున్‌.
తిక్కనగారు చెప్పినపిదప నేను చెప్పేదేముంటుంది. అదే అనుసరణీయము.
36. ఎటువంటి లంచములకు గానీ ఆశ్రిత పక్షపాతమునకు గానీ తావివ్వరాదు.దొంగతనము చేసిన వాడు కారావాసమో మరణ శిక్షయో ఎప్పటికయినా రాజు కనుగొంటే అనుభవించక తప్పదు.
ధౌమ్యులవారు చెప్పిన పై మాట భర్తృహరి కాలానికే ఎంత మారిపోయందో ఈ సుభాషితాన్ని చదివితే మనకర్థమౌతుంది.

జాతిర్యాతు రసాతలం గుణ గణైస్తత్రాప్యధో గచ్ఛతాత్‌
శీలం శైల తటాత్పతత్వభిజనః సందహ్యతాం వహ్నినా ।
శౌర్యే వైరిణి వజ్రమాశు నిపతత్వర్థో-స్తు నః కేవలం
యేనైకేన వినా గుణస్తృణ లవ ప్రాయాః సమస్తా ఇమే ॥ 31

జాతి పాతాళమునకృంగి పోవుగాక, గుణగణమ్ములు గూడు వీడు గాక, శీలసంపద అడుగంటిపోవుగాక, పిడుగుపాటున శౌర్యమ్ము పిగులుగాక, గడ్డిపోచలు అవి ధనము గలిగెనేని .
ఇకనైనా గుణశీలములని గుర్తించి గౌరవించి నడుచుకొంటే మన పురాతన వైభవాన్ని పునః ప్రతిష్ఠ చేయగలుగుతాము

ఈ రీతిగా మీ మనసులను సంపూర్ణ నియంత్రణలో నుంచుకొని ఈ 13వ సంవత్సరమును గడిపినారంటే మీరు తదనంతరము మీ దేశానికి వచ్చి హాయిగా తిరుగవచ్చును అని ధౌమ్యుడు చెప్పి వారి వద్ద శెలవు తీసుకొని, అనుకొన్న ప్రకారము పరివారముతోగూడి ద్రుపదుని కడకు ఎగినాడు.

స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాం
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం లొకాస్సమస్తా స్సుఖినోభవంతు

స్వస్తి
 

No comments:

Post a Comment