చైర్మన్గా బాబు?
29-11-2016 02:47:30
- నగదు సంక్షోభంపై సీఎంల కమిటీ
- సభ్యులు శివరాజ్సింగ్, నితీశ్,
- నారాయణస్వామి, మాణిక్ సర్కార్
- కాంగ్రెస్, సీపీఎం, జేడీయూ
- సీఎంలకు చోటు ఇచ్చిన మోదీ
- కాదని... ఆపై ఔనన్న చంద్రబాబు!
న్యూఢిల్లీ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన సమస్యలను తొలగించడమే కాకుండా ప్రజలకు సత్వరంగా నగదు అందించడానికి, నగదు రహిత లావాదేవీల కోసం అవలంబించాల్సిన పద్ధతులను సూచించడానికి కేంద్రం ముఖ్యమంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్గా వ్యవహరించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం మధ్యాహ్నం చంద్రబాబుకు ఫోన్చేసి కమిటీకి నాయకత్వంపై ఆయన సమ్మతిని తీసుకున్నారు. కమిటీలో సభ్యులుగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పుదుచ్చేరి సీఎం పి.నారాయణస్వామి, బిహార్ సీఎం నితీశ్ కుమార్, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్లు ఉంటారని విశ్వసనీయవర్గాల సమాచారం.
కమిటీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన ఒకటి, రెండు రోజుల్లో రావచ్చని అంటున్నారు. కమిటీ విధి విధానాలు, గడువుతో పాటు కమిటీ సమావేశాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రకటన ద్వారా కేంద్రం తెలియ జేయనుంది. నల్లధనాన్ని రూపు మాపడానికి పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబునే ఈ కమిటీ చైర్మన్గా నియమించడం సబబుగా ఉంటుందని కేంద్రం భావించినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైతే అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కూడా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా క్రోడీకరించగల సామర్థ్యం చంద్రబాబుకే ఉందని ప్రధాని మోదీ భావించారని, అందుకే కమిటీకి చైౖర్మన్గా చంద్రబాబును నియమించారని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
No comments:
Post a Comment