"ఈ చిత్రం నరేంద్ర మోడీ గారు ప్రధాని కాంగనే వాళ్ల అమ్మ ఆశీర్వాదం తీసుకున్నప్పటిది." కొన్ని కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగ చూసే ఉంటరు.మోడీ మరియు వాళ్ల అమ్మ కాకుండా మరో మహిళ పళ్లెం పట్టుకొని నిలబడ్డది చూస్తున్నారు కదా!ఆమె ప్రధాని తమ్ముడు ప్రహ్లాద్ మోడీ బిడ్డ,"నికుంజ్ బెన్".
దురదృష్టవశాత్తు ఆమె గతవారం దీర్ఘకాలంగా ఉన్న గుండెపోటు బాధతో చనిపోయింది. ప్రధాని జి-20 దేశాల సమావేశంలో చైనాలో ఉన్నపుడు ఆమె అనారోగ్యం గురించి తెలిసింది.మన దేశానికొచ్చిన తరువాత వాళ్ల తమ్మునికి ఫోన్ చేసి నికుంజ్ ఆరోగ్యం ఎట్లా ఉందని అడిగితే, చనిపోయిందని చెప్పాడట. ప్రధాని పని ఒత్తిడి వలన ఆమె అంత్యక్రియలక్కూడ పోలేక పోయారు.
ప్రభుత్వ పెద్దలక్కూడ ఈ సంఘటన తెలవక,కాశ్మీర్ సమావేశంలో ప్రధాని చెమ్మగిల్లిన కళ్లను చూసి,నికుంజ్ బెన్ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్నారట.
నికుంజ్ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కిరాయి ఇంట్లోనే ఉంటారు. టైలరింగ్ చేసుకుంటూ,ట్యూషన్లు చేప్పుకుంటు భర్తకు సహకరించేది ఆమె.అనారోగ్యంతో ఉన్నా, పేదరికాన్ని భరిస్తు బతికేది తప్ప, ప్రధాని తమ్ముని బిడ్డననీ ఎక్కడ చేప్పుకోలేదామె.
అధికార దుర్వినియోగానికి ముందుండే ఛోటామోటా నేతలున్న ఈ సమయంలో ఇంత విచారకరమైన బాధను పంటి బిగువున బిగపట్టి,ఒక్క పూట కూడ తమ్మున్ని పరామర్శించలేక, అనేక సమావేశాలకు పాల్గొంటున్నారు ప్రధాని మోడీ. దీన్ని చూస్తే ఆయనకు దేశ అభివృద్ధి పట్ల గల నిబద్ధత, కఠోరశ్రమ మరియు అంకితభావం తెలిసి పోతుంది. దేశంలో శాంతి సామరస్యాలు నెలకొల్పడానికి, అనేక సమస్యల్ని పరిష్కరించడానికీ ఆ మహానుభావునికి ఆయురారోగ్యాలు మరింత శక్తిని ఇవ్వుమని దేవున్ని ప్రార్థించడం తప్ప మనం ఏం చేయగలం ..!?
భారత్ మాతా కి జై
భారత్ మాతా కి జై
No comments:
Post a Comment