నేడు సంపూర్ణ చంద్రగ్రహణం !
నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దీనిని వీక్షించవచ్చని భూ అధ్యయన శాస్త్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. మధ్యాహ్నం 2.45గంటలకు మొదలయ్యే గ్రహణం సాయంత్రం 6.05గంటల వరకు కొనసాగనుంది. గ్రహణం పట్టే సమయానికి ఆరుగంటల ముందు ఆలయాలు మూసేయడం ఆనవాయితీగా వస్తోన్న సాంప్రదాయం. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు దేవాలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం 10 గంటల పాటు మూత పడనుంది. తిరుమల ఆలయంతో పాటు తిరుపతిలోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని సైతం టీటీడీ మూసివేయనుంది. తిరుపతి తిరుమలకు వచ్చే భక్తులు ఈ ఒక్క రోజు సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. చంద్రగ్రహణం గడియలు ముగియగానే ఆలయాన్ని తిరిగి ప్రారంభిచనున్నారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయాన్ని ఉదయం 10గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు మూసేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర అమ్మవారి ఆలయం ఉదయం 6.30గంటల నుంచి సాయంత్రం6.30వరకు మూతపడనుంది. అయితే, చంద్రగ్రహం సందర్భంగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment