ఏంటో జీవితం ...
ఇంత విచిత్రం .....
ఎప్పుడు నవ్వుతామో ..ఎప్పుడు ఏడుస్తామో ఎవరికీ తెలియదు ...
అంతా మిధ్యే.... అంతా మాయే అంటారు కొందరు...
హహః అది నిజమనుకుంటే మనము మాయలో ఉన్నట్లే ...
మనం చేసే పనులే మన భవిష్యత్ అని కొంతమందే ఒప్పుకుంటారు ....
కొన్ని సార్లు మాత్రం మాయని నమ్మక తప్పదేమో ....
అన్నీ తనే అనుకున్న వ్యక్తి మనల్ని బద్ధశత్రువులా చూసినప్పుడు ..
ఏ తప్పు చెయ్యకపోయినా అన్యాయంగా బలైనప్పుడు....
ప్రతిసారి ఓటమి మనల్ని స్వాగతిస్తున్నప్పుడు...
కొన్ని అబద్ధాలను నిజాలుగా నమ్మాల్సివచ్చినపుడు .....
ఎవ్వరు కావాలని తప్పు చెయ్యరు ...
ఎవ్వరు బాహాటంగా మాటలనరు...
అలా అని అందరం మంచి వాళ్ళమా కాదు ...కానేకాదు ....
నటించేవాళ్ళు కొందరైతే ..నమ్మించేవారు ఇంకొందరు ....
బ్రతికునీడ్చే వారు కొందరైతే ...బ్రతకనేర్చిన వారు ఇంకొందరు....
ప్రతి మనసుకు తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో...
కాని అవసరాలు మనిషిని మనీ వైపు నడిపిస్తున్నాయి ...
అది ఇచ్చేవాడు దేవుడు ..పుచ్చుకునేవాడు దేవుడే ....
మరి మనుషులు ఎవరు ?
కదా ...మన అవసరం తీర్చేది ఏదైనా దైవంతో సమానమైతే ,,,వాళ్ళు దేవుళ్ళే ...
దైవత్వం అంటే మనలోని చెడుని చంపేదిగా ఉండాలని పెద్దలు చెప్పినట్టు గుర్తు ...
కాని స్వార్ధాన్ని పెంచేదిగా ఉంటుంది ఇపుడు ......
అవును ...ఇప్పుడు ఎక్కడ నిజాయితీ లేదు ..ఎక్కడ నిజానికి విలువలేదు ..
మనం నమ్మేదే మంచి ..మనకు నచ్చనిదే చెడు .........
ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ...ఒక్కటే ....ఒక్కటి మాత్రమే
స్వార్ధాన్ని తెగ నరుకుదాం ...మానవత్వపు విలువల్ని పెంచి ...
అవసరాన్ని అవకాశంగా కాకుండా ఆవేదనగా తీసుకుందాం మనుషులలో సంతోషాన్ని నింపి ...
ముందడుగు మనతోనే మొదలు ..............మిత్రులారా !!
ఇంత విచిత్రం .....
ఎప్పుడు నవ్వుతామో ..ఎప్పుడు ఏడుస్తామో ఎవరికీ తెలియదు ...
అంతా మిధ్యే.... అంతా మాయే అంటారు కొందరు...
హహః అది నిజమనుకుంటే మనము మాయలో ఉన్నట్లే ...
మనం చేసే పనులే మన భవిష్యత్ అని కొంతమందే ఒప్పుకుంటారు ....
కొన్ని సార్లు మాత్రం మాయని నమ్మక తప్పదేమో ....
అన్నీ తనే అనుకున్న వ్యక్తి మనల్ని బద్ధశత్రువులా చూసినప్పుడు ..
ఏ తప్పు చెయ్యకపోయినా అన్యాయంగా బలైనప్పుడు....
ప్రతిసారి ఓటమి మనల్ని స్వాగతిస్తున్నప్పుడు...
కొన్ని అబద్ధాలను నిజాలుగా నమ్మాల్సివచ్చినపుడు .....
ఎవ్వరు కావాలని తప్పు చెయ్యరు ...
ఎవ్వరు బాహాటంగా మాటలనరు...
అలా అని అందరం మంచి వాళ్ళమా కాదు ...కానేకాదు ....
నటించేవాళ్ళు కొందరైతే ..నమ్మించేవారు ఇంకొందరు ....
బ్రతికునీడ్చే వారు కొందరైతే ...బ్రతకనేర్చిన వారు ఇంకొందరు....
ప్రతి మనసుకు తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో...
కాని అవసరాలు మనిషిని మనీ వైపు నడిపిస్తున్నాయి ...
అది ఇచ్చేవాడు దేవుడు ..పుచ్చుకునేవాడు దేవుడే ....
మరి మనుషులు ఎవరు ?
కదా ...మన అవసరం తీర్చేది ఏదైనా దైవంతో సమానమైతే ,,,వాళ్ళు దేవుళ్ళే ...
దైవత్వం అంటే మనలోని చెడుని చంపేదిగా ఉండాలని పెద్దలు చెప్పినట్టు గుర్తు ...
కాని స్వార్ధాన్ని పెంచేదిగా ఉంటుంది ఇపుడు ......
అవును ...ఇప్పుడు ఎక్కడ నిజాయితీ లేదు ..ఎక్కడ నిజానికి విలువలేదు ..
మనం నమ్మేదే మంచి ..మనకు నచ్చనిదే చెడు .........
ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ...ఒక్కటే ....ఒక్కటి మాత్రమే
స్వార్ధాన్ని తెగ నరుకుదాం ...మానవత్వపు విలువల్ని పెంచి ...
అవసరాన్ని అవకాశంగా కాకుండా ఆవేదనగా తీసుకుందాం మనుషులలో సంతోషాన్ని నింపి ...
ముందడుగు మనతోనే మొదలు ..............మిత్రులారా !!
-----------------------------
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment