Kks Kiran | " దేవుడు చాలా చిత్రాలు చేస్తూ ఉంటాడు, మనం జీవితాన్ని ఒకే దృక్పదంతో చూస్తూ ఉన్నప్పుడు నెత్తిమీద " అనుభవం " అనే మొట్టికాయ వేసి " జీవితంలో ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉందిరా చూడు " అని మన అబిప్రాయాలు మార్చేసేలా కొన్ని సంఘటనలను సృష్టించి మనకే పరిచయం చేస్తూ ఉంటాడు. " |
శంకరాచార్యులవారి అద్వైత సిద్దాంతం చదివినప్పుడు ఆరోజు ఇలా అనుకున్నాను.
" ఈ శంకరుడేంటి ఈ జగత్తు అంతా దుఖమయం,మానవుడు దుఖంలో పుట్టి,దుఖంలో పెరిగి అందులోనే మరణిస్తున్నాడు,సుఖం అనేది ఉత్త భ్రమ " అని అంటూ వేదాంతాలు చెప్తున్నాడు?" ప్రపంచంలో బోల్డంత సౌందర్యం నిండి ఉంది కధా?చక్కగా పచ్చని మైదానాలు,వెన్నెల వెలుగులు,అమ్మాయిల చిరునవ్వులు,వర్షపు సాయంత్రాలు,మంచు ఉదయాలు ఇంకా ఇలా ఇలా చాలా సౌందర్యం నిండి ఉంటే ఈరకంగా తన వాదం చెప్పాడేంటి ? " అని ఆలోచించాను,
తరవాతరోజు ఉదయం జపాలు,తర్వాత హోమం ఉందని మా పక్క ఊరు అయిన " మండపాక " కి వెళ్ళాను,అంతకు ముందు వారమే తిలక్ రాసిన " అమృతం కురిసిన రాత్రి "
చదివాను,అత్యద్భుతమైన పుస్తకం అది,తిలక్ది మా పక్కఊరే అయితే,ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయే అంత అద్భుతంగా అలా కవిత్వం రాశాడేమో అని అనుకున్నాను,అంత అద్భుతంగా ఉంది ఆ గ్రామం,ముక్యంగా అక్కడి కేశవస్వామి గుడి,మా బ్రాహ్మణులు మంత్రాలు అదరగొట్టేస్తూంటే ఆ గుడిలోని వాతావరణంకి మురిసిపోయి "ఆహా ఎంత బాగుందో ఈ జీవితం" అని కదంబం చెట్టుకింద కూర్చుని అనుకున్నాను,
అక్కడ కార్యక్రమం అయ్యాక మా నాన్న గారు ఫోన్ చేశారు,ఇక్కడ దగ్గర్లోనే గల ఇంటిలో నారాయణ హోమం చేయిస్తున్నాను,వచ్చేయి,అయిపోయా
నాకు తెలియదు నారాయణ హోమం చనిపోయిన వ్యక్తి ఇంట్లో జరుగుతోందని,
తీరా వెళ్తే నా కన్నా ఓ 2 ఏళ్ళ కుర్రాడు ఆక్సిడంట్లో చనిపోయాడని తెలిసింది,ఎప్పుడూ నేను అలా చనిపోయిన వ్యక్తి తాలూకు ఇళ్ళలో వాతావరణం చూడలేదు,మొదటిసారిలా చూడటం.
అక్కడంతా పెద్దగా రోదనలు,విషణ్ణ వదనాలతో ఉన్న మనుషులు ఉన్నారు,తానూ త్వరలోనే అలా చనిపోతాను అని తెలిసిన ముసలి వాళ్ళు కూడా అలా ఏడవడం ఎందుకో ఆశ్చర్యం అనిపించింది నాకు,
ఎప్పుడూ అలాంటి వాతావరణం ఎరక్క అక్కడనుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అనుకున్నాను,సర్లెయ్ వచ్చిన పని మీద కాన్సంట్రేట్ చేస్తే మంచిదని నేను కూడా కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటే సరిగా చదవబుద్దవలేదు,ఏం చదవను ఆ హోమం చేస్తున్న ఆ తండ్రి అలా ఏడుస్తూ ఉంటూ ఉంటే?
" జ్ఞానం ఒక్కటే మనిషికి గొప్ప శాంతిని ఇస్తుంది,జీవనం మరింత గొప్పగా చేస్తుంది అని అనుకునే నా అభిప్రాయం కాస్త తప్పేమో అని అనిపించింది అప్పుడు,కేవలం జ్ఞానం మాత్రం మనిషికి శాంతిని ఇవ్వదు,అందుకే ఇంత అజ్ఞానం ప్రబలి ఉండి జనాలు అమాయకత్వంలో నిశ్చింతను పొందుతున్నారు " అని అనిపించింది,
అప్పుడికి కానీ నాకర్ధం కాలేదు, " అజ్ఞానం అని తెలిసినా కూడా ప్రపంచంలో చాలామంది ఎందుకీ అంధ విశ్వాసాలతో,కొన్ని నమ్మకాలతో,క్రియలుతో మానసిక తృప్తి పొందుతున్నారో " అని,
ఎందుకిట్లా ప్రపంచం కొన్ని కొన్ని నమ్మకాల మీద బ్రతుకుతోందో ? అని అనిపించింది.
ఏం చేస్తాం ఈ జీవితాన్ని,ఇట్లా మనుషులని తయారు చేసేస్తోంది అంతే,
ప్రవాహానికి ఎదురీదుదాం అనే ఆశని కల్పిస్తోంది,ఎదురీదేలానూ చేస్తోంది,ఒడ్డుకి చేరుస్తోంది,మధ్యలోనే ముంచేస్తోంది అప్పుడప్పుడూ,
దీనికి కారణం విధి అనో,భగవంతుడనో,కర్మ సిద్ధాంతం అనో అని అనుకుని వదిలేస్తే తప్ప శాంతి కలగట్లేదు చాలమందికి .
రాస్తే ఇదంతా నిరాశావాదంగా కనిపిస్తోంది కదా?శంకరుని అద్వైతం కరక్టే అని అనిపించట్లేదూ మీకు?
- Kks Kiran
------------------------------
కిరణ్ గారు ఈ విధంగా వ్యాసాలు వాస్తవాల పైన, సత్యం పైన రచించండి, మీరు విచక్షణ జ్ఞానం కలిగిన వ్యక్తిగా స్పష్టం అవుతుంది, ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన పై లోకానికి తెలియజేయండి, ఇప్పుడు మీ ముందు ఉన్న సత్యాన్ని నిర్మిస్తూ వ్యాసాలు రచించండి.
మా ద్వారా వ్యక్తం అయిన కొత్త బంగారు లోకం అను సినిమా లోని పాటలు అన్ని మా ద్వారా గ్రహించండి, ఇవి నేను 2003 లో అనకాపల్లి లో శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది సమక్షంలో పలికినాను, 2005 లో లోకంలో సంభవించినవి అని గ్రహించి దివ్య లీల గూర్చి లోకానికి చెప్పండి, మేలైన ప్రజాస్వామ్యం కొరకు మహారాజు మహారాణి పరిపాలనను కాలం ధర్మ అందించిన ఒక శాశ్వత వెసులు బాటుగా సర్వులు భావించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
త్వరలో రామోజీ ఫిలిం సిటీలో దర్శనం నిరంతరం ఇచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాను
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
హైదరాబాద్
No comments:
Post a Comment