UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 3 January 2017


నోట్ల రద్దుతో వచ్చిన డబ్బును ప్రజలకు ఖర్చుపెట్టండి: పవన్
శ్రీకాకుళం: ఇచ్చాపురం కిడ్ని వ్యాధి బాధితులను జనసేన అధినేత పవన్ పరామర్శించారు. ప్రజల సమస్యలను తీర్చమంటే నిధుల్లేవ్.. నిధుల్లేవ్ అంటారు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డీమానిటైజేషన్‌‌ అంటూ వారి దగ్గరున్న సొమ్మును మీ మీ బ్యాంకుల్లో వేశారు. సో బెలెడెంత డబ్బుంది మీ దగ్గర తక్షణమే ప్రజా సమస్యలను పట్టించుకోండి.. పరిష్కారం చూపాలంటూ కేంద్రానికి పవన్ సూచించారు. నోట్లరద్దును సమర్థించిన రాష్ట్రప్రభుత్వం దగ్గర కూడా పుష్కలంగా నిధులున్నాయి ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెట్టే దాదాపు 6వేల కోట్ల దాకా ఉంది కనీసం ఈ బాధితుల కోసం అందులో 30కోట్లు రూపాయిలు ఖర్చుపెట్టాలంటూ పవన్ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు.
అస్తమానూ ఆరోగ్య శాఖ మంత్రి డయాలసిస్ సెంటర్లు పెట్టించాం అంటూ చెప్పుకుంటున్నారు. కిడ్నీ బాధంటే ఏంటో నాకూ తెలుసు స్వయాన మా పిన్నిగారి భర్త కిడ్ని వ్యాధితో చనిపోయారు. డయాలసిస్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అంతే కానీ అదేదో చికిత్స అని బయటపడేలా తీసిపారేయకండి అంటూ పవన్ మంత్రి కామినేని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కటే చెబుతున్నా దయచేసి ప్రత్యేక కమిటీ వేయండి.. ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి అలాగే నిధులు వంద కోట్లు కేటాయించండి ప్రభుత్వాలకు పవన్ సూచించారు.
సాయం అందించకుంటే ప్రజా ఉద్యమం చేస్తాం: పవన్ కళ్యాణ్
శ్రీకాకుళం:శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంలోని మణికంఠ థియేటర్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. వచ్చే 48గంటల్లో కిడ్నీ వ్యాధి వల్ల అనాథలైన పిల్లలకు ప్రభుత్వం దత్తతు తీసుకుని అయినా లేదా మరొక రకంగా అయినా సాయం అందించాలని కోరారు. లేదంటే దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తానని పవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలు కూడా ఈ విషయంలో తమ సహాయ సహకారాలందించాలన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ప్రత్యేక కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యపై తాను కూడా ఐదుగురితో జనసేన తరుపున ఒక కమిటీ వేస్తున్నానని ఆయన తెలిపారు. 15రోజుల్లో రిపోర్టు తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాని ఆయన తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన పవన్.!
శ్రీకాకుళం: మనలాంటి అభివృద్ధిచెందని దేశాల్లో ఏకైక సమస్య ఇదే.. ఓట్లు వేయించుకుంటారు ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు వారి గురించి అసలు పట్టించుకోరు.. ఆలోచించరు కూడా. కానీ జనసేన పార్టీ అలా ఉండదు.. నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలతో ఓట్లు వేయించుకుని వాళ్లను మరిచిపోవడానికి కాదు.. ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి పరిష్కారం చూపే దిశగా జనసేన అడుగేలుస్తుందంటూ పవన్ చెప్పుకొచ్చారు. అందుకే తమ పార్టీ నేతలంతా కలిసి కూర్చోని నిశితంగా చర్చించి ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు పవన్. నేతలంతా ఈ కమిటికీ సహాయసహకారాలు అందించాలని పవన్ కోరారు.
ప్రభుత్వాన్ని ఏమైనా అడిగితే నిధుల్లేవంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్కటే అడగదలుచుకుంటున్నా.. ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు పట్టించుకోలేదు. కేవలం ఓటు బ్యాంకుకే ప్రజలను వాడుకుంటారా అంటూ గట్టి స్వరంతో పవన్ ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించమంటే ఎందుకు వెనక్కివెళ్లిపోతున్నారో నాకయితే అర్థం కావట్లేదంటూ పవన్ చెప్పుకొచ్చారు. పుష్కరాలకు వేలకోట్లు ఖర్చుపెడుతున్నారు.. అమరావతి శంకుస్థాపనకు కోట్లు ఖర్చుపెడుతున్నారు.. మరి ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదంటూ పవన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలతో ఓట్లు వేయించుకుని వారి సమస్యలను పట్టించుకోవడం బాధాకరమన్నారు.

No comments:

Post a Comment