*జనానికి దేశభక్తి నూరిపోసి, దేశద్రోహుల (నల్లకుబేరుల) సేవలో తరిస్తున్న మోడీ గారూ.. ప్రజలకు సమాధానం చెప్పండి!!*
యావత్ భారతం ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా డిసెంబర్ 31న ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 50 రోజులు ఓపిక పట్టండి... అద్భుతాలనందిస్తానని డంబాసారాలు పలికి చివరికి ప్రజలకు అబద్ధాలనే నూతన సంవత్సర కానుకగా అందించారు.
మోడీ గారు ఈ దిగువ ప్రశ్నలకు సమాధానం కావాలి: ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల నల్లధనాన్ని రూపుమాపారు? మీరు గురి చూసి కొట్టిన దెబ్బకు ఎన్ని అవినీతి తిమింగలాలు చిక్కాయి? విదేశాల్లో ఉన్న 93శాతం నల్లధనాన్ని దేశానికి రప్పిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు చేపట్టిన చర్యలేమిటి? ఈ నోట్ల రద్దు ద్వారా ఏ విధంగా ఆ సొమ్ము స్వదేశానికి రప్పిస్తారు? పోనీ దేశంలో ఉన్న 7శాతం నల్లధనాన్నైనా రూపుమాపగలిగారా? ఇప్పటికి ఎంత మొత్తాన్ని జనం ఖాతాల్లో జమ చేశారు? ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ప్రశ్నలకు ప్రధాని ప్రసంగంలో సమాధానం లేదు. కానీ ఈ యాభైరోజుల అనుభవం ఏం చెపుతోంది. ప్రధాని పలుకులన్నీ పచ్చి అబదాలనే చెపుతోంది.
జనానికి దేశభక్తి నూరిపోసి వారు మాత్రం దేశద్రోహుల (నల్లకుబేరుల) సేవలో తరించిపోయారు. లేదంటే కరెన్సీ కొరతతో కనీస అవసరాలకు నోచుకోక జనం అల్లాడుతుంటే.. లక్షల కోట్ల రూపాయల కొత్త కరెన్సీ బ్యాంకులకు చేరకుండా డైరెక్ట్గా ఆర్బిఐ నుండి నల్లకుబేరుల ఇనప్పెట్టెల్లోకి ఎలా చేరింది? ఇది అబద్ధమని చెప్పగలరా? అయితే లక్షల కోట్ల రూపాయల కొత్త నోట్లతో అడ్డంగా దొరికిపోయిన బడాబాబుల ఉదంతాలకు ఏం సమాధాన మిస్తారు? ఇదేనా ఏలినవారి దేశభక్తి?
జనానికి దేశభక్తి నూరిపోసి వారు మాత్రం దేశద్రోహుల (నల్లకుబేరుల) సేవలో తరించిపోయారు. లేదంటే కరెన్సీ కొరతతో కనీస అవసరాలకు నోచుకోక జనం అల్లాడుతుంటే.. లక్షల కోట్ల రూపాయల కొత్త కరెన్సీ బ్యాంకులకు చేరకుండా డైరెక్ట్గా ఆర్బిఐ నుండి నల్లకుబేరుల ఇనప్పెట్టెల్లోకి ఎలా చేరింది? ఇది అబద్ధమని చెప్పగలరా? అయితే లక్షల కోట్ల రూపాయల కొత్త నోట్లతో అడ్డంగా దొరికిపోయిన బడాబాబుల ఉదంతాలకు ఏం సమాధాన మిస్తారు? ఇదేనా ఏలినవారి దేశభక్తి?
గడువు ముగిసే నాటికి బ్యాంకులకు చేరిన సొమ్ము సుమారు 15లక్షల కోట్లు. ఇందులో తిరిగి జనానికిచ్చింది కేవలం 6 లక్షల కోట్లు మాత్రమే. మిగతా సొమ్ము బ్యాంకుల్లోనే ఉంది. ఇది ప్రభుత్వానిదీ కాదు, బ్యాంకుల సొత్తూ కాదు. జనం కష్టార్జితం. ఎంత సేపటికీ ఈ సొమ్మును ప్రయివేటు బ్యాంకులకు, ఫైనాన్స్ కంపెనీలకు, కార్పొరేట్లకు ఎలా ధారాదత్తం చేయాలన్న యావే తప్ప ప్రజలకు ఒరగబెట్టేదేమీ లేదని క్రమేణా రూఢ అవుతున్నది. ఇక జనం దగ్గర అరా కొరా రూ.500, 1000 నోట్లు ఉంటే జైలు శిక్ష..! కానీ అదే నల్లకుబేరులకు మాత్రం మార్చి 31 వరకు రిజర్వుబ్యాంకులో జమ చేసుకునే అవకాశం..!! ఎంత గొప్ప దేశభక్తి..!! ఇదంతా మాటలతో జనాన్ని మభ్యపెట్టి కార్పొరేట్లకు దోచిపెట్టడం కాక మరేమిటి? ప్రధాని ప్రసంగం తరువాత ప్రజల్లో ఉన్న ఈ అనుమానాలన్నీ బలమైన అభిప్రాయాలుగా స్థిరపడుతున్నాయి.
రైతు రుణాలపై రెండు నెలల వడ్డీ మాఫీ అని, పట్టణ గృహరుణాలపై 3 నుంచి 4 శాతం వడ్డీ రాయితీ అనీ, గర్భిణీల వైద్యఖర్చులకు 6 వేల రూపాయలనీ మసిపూసి మారేడు కాయ ప్రయత్నమే చేసారు.
రైతు రుణాలపై రెండు నెలల వడ్డీ మాఫీ అని, పట్టణ గృహరుణాలపై 3 నుంచి 4 శాతం వడ్డీ రాయితీ అనీ, గర్భిణీల వైద్యఖర్చులకు 6 వేల రూపాయలనీ మసిపూసి మారేడు కాయ ప్రయత్నమే చేసారు.
తన నిర్ణయానికి ప్రాణాలను బలిపెట్టిన వందలాదిమందికి కనీసం నివాళి కాదు కదా, సానుభూతి కూడా ప్రకటించలేదు. 50 రోజులు ఓపిక పట్టండి అంతా సర్దుకుంటుందని చెప్పిన హామీ కూడా నిలబెట్టుకోలేదు.
No comments:
Post a Comment