ఏమిటీ అనాగరికం...?
జర్నలిస్టుపై కర్రలు, మారణాయుధాలతో దాడి. అదీ పోలీస్ స్టేషన్ ఎదురుగానే దారుణకాండ. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు అవినీతి బాగోతంపై ఒక మాస పత్రికలో వార్తలు రాసిన నాయుడు నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుపై ఆదివారం అమానుషంగా దాడికి పాల్పడ్డారు. పోలీస్స్టేషన్ ఎదురుగా తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న నాగార్జునరెడ్డిని కారుతో ఢీకొట్టారు. కింద పడిపోయిన అతడిపై తీవ్రంగా దాడిచేశారు. అందరూ చూస్తుండగానే కర్రలతో ఇష్టానుసారం బాదారు.
నాగార్జున రెడ్డి గతంలో విశాలాంధ్ర విలేకరిగా పనిచేశారు. ఇప్పుడు ప్రీలాన్స్ జర్నలిస్టుగా ఒక మాస పత్రికలో ఎమ్మెల్యే ఆమంచి కుటుంబీకుల అవినీతిపై వార్తలు రాశారు. పేదల పేరుతో ఎమ్మెల్యే కుటుంబీకులు రుణాలు తీసుకున్నారనే ఆరోపణలకు సంబంధించి రాసిన ఆ పత్రికలను పంచుతున్న క్రమంలోనే ఈ దాడి జరిగింది.
జర్నలిస్టుపై కర్రలు, మారణాయుధాలతో దాడి. అదీ పోలీస్ స్టేషన్ ఎదురుగానే దారుణకాండ. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు అవినీతి బాగోతంపై ఒక మాస పత్రికలో వార్తలు రాసిన నాయుడు నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుపై ఆదివారం అమానుషంగా దాడికి పాల్పడ్డారు. పోలీస్స్టేషన్ ఎదురుగా తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న నాగార్జునరెడ్డిని కారుతో ఢీకొట్టారు. కింద పడిపోయిన అతడిపై తీవ్రంగా దాడిచేశారు. అందరూ చూస్తుండగానే కర్రలతో ఇష్టానుసారం బాదారు.
నాగార్జున రెడ్డి గతంలో విశాలాంధ్ర విలేకరిగా పనిచేశారు. ఇప్పుడు ప్రీలాన్స్ జర్నలిస్టుగా ఒక మాస పత్రికలో ఎమ్మెల్యే ఆమంచి కుటుంబీకుల అవినీతిపై వార్తలు రాశారు. పేదల పేరుతో ఎమ్మెల్యే కుటుంబీకులు రుణాలు తీసుకున్నారనే ఆరోపణలకు సంబంధించి రాసిన ఆ పత్రికలను పంచుతున్న క్రమంలోనే ఈ దాడి జరిగింది.
ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు స్వాములు తన అనుచరులతో కలిసి విలేకరిపై దాడికి పాల్పడ్డారు. ప్రజలందరూ చూస్తుండగానే టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా కర్రలతో విశక్షణారహితంగా విలేకరిపై దాడిచేశారు.
రాష్ట్రంలో విలేకరులపై దాడులు కొనసాగుతుండటం దారుణం. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఇలా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు విలేకరులను దుర్భాషలాడిన ఘటనలున్నాయి. ఒక దారుణమైన పరిస్థితి ఏమంటే... విలేకరులను దుర్భాషలాడటం, దాడులు చేయడమే కాదు...తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. చీరాలలో దాడికి గురైన విలేకరి నాగార్జున రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదుచేయించారు.
విలేకరులపై దాడుల సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదు. విలేకరులపై దాడులను నిరోధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప గారు, డీజీపీ ఎన్ సాంబశివరావు గారు చీరాల విలేకరి నాగార్జున రెడ్డి మీద దాడిపై స్పందించాలి. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు, అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలి.
రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులకు సంబంధించి చర్చించేందుకు హోంమంత్రి నేతృత్వంలోని హైపవర్ కమిటీని తక్షణమే సమావేశ పరచాలి. జర్నలిస్టుల భద్రతపై చర్చించాలి.
రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు
చీరాలలో జర్నలిస్టుల నాగార్జున రెడ్డిపై జరిగిన దాడిని ఏపీ జర్నలిస్టుల ఫొరం(ఏపీజేఎఫ్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములుతోపాటు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాపిత ఆందోళనలకు పిలుపునిస్తోంది. జర్నలిస్టులందరూ ఈ ఆందోళనల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి.
చీరాలలో జర్నలిస్టుల నాగార్జున రెడ్డిపై జరిగిన దాడిని ఏపీ జర్నలిస్టుల ఫొరం(ఏపీజేఎఫ్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములుతోపాటు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాపిత ఆందోళనలకు పిలుపునిస్తోంది. జర్నలిస్టులందరూ ఈ ఆందోళనల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి.
చెవులు కృష్ణాంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు
మారెళ్ల వంశీకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మారెళ్ల వంశీకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
No comments:
Post a Comment