UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 10 February 2017

తెలుగుల భావ దారిద్ర్యం:
భావ దారిద్ర్యం అనేది ఈ మధ్య తెలుగుల్లో లెక్కకు మిక్కిలిగా కొండవీటి చాంతాడులా నానాటికీ పెరిగిపోతూ ఆత్మ గౌరవం అన్నది లేశమైనా లేకుండా పోతోంది.మన భావ దారిద్ర్యానికి భావ దాస్యానికి మరో గుర్తు మన ప్రజా కార్యక్రమాలకు , కార్యాలయాలకుజాతీయ, ప్రాజెక్టులు , దేనికి పట్టిన జాత్వెయ నాయకుల పేర్లే. అక్కడక్కడా, పెద్దగా ప్రాముఖ్యం లేని వాటికి మాత్రమే అడపాదడపా తెలుగువారి పేర్లు పెట్టుకుంటాం. జాతీయ నాయకులన్నా నాకు అమిత గౌరవం ఉంది, కానీ మనకాపాటి నాయకులు లేరా అనే బాధ తప్పించి మరోటి కాదు. జాతీయ స్థాయి కెదిగిన మన తెలుగు నాయకులు ఎందరో ఉన్నా మనకు అలక్ష్యమే ఎక్కువ. ప్రతీ ఒక్క దానికీ గాంధీలు, నెహ్రూల పేర్లేనా? పీవీలు, ప్రకాశాలు, సంజీవ రెడ్డిలు, బూర్గుల, సురవరం, అల్లూరి , పట్టాభిలు, తెన్నేటి, పొట్టి శ్రీరాములు , దుర్గాబాయమ్మ వంటి వారి గొప్పదనం మన కళ్ళకు కనబడదా? ఎక్కడ చూసిన
ఇందిరా సాగరు, రాజీవ్ గాంధీ విమానాశ్రయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ, రాజీవ్ రహదారి, లాల్ బహదూర్ స్టేడియం, నెహ్రూ జూలాజికల్ పార్కు, ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు, రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం, రాజీవ్ పల్లెబాట, మహాత్మా గాంధీ బస్సు స్టేషను, పండిట్ నెహ్రూ బస్సు స్టేషను అని పేర్లు పెట్టుకున్నాం.
అదే మనవారి పేరు ఎక్కడా అంత ఎక్క్య్వ్స్గా లేక పోయినా జాతీయ నాయకుల పేర్లుపెట్టమంటే చంకలెగరేసుకుంటూ సరే సరే అనేవాళ్ళే!మన రాష్ట్రం లోని ప్రజల కొరకు పోరాడిన
అల్లూరి సీతారామరాజు పేరిట ఏమన్నా ఉన్నాయేమో గమనించారా ? కన్నెగంటి హనుమంతు, కొమరం భీము, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య.. దుగ్గిరాల, దువ్వూరి సుబ్బమ్మ అందరూ విస్మృత వీరులే, వీర వనితలే. కందుకూరి, చిలకమర్తి, గురజాడ, గిడుగు, సురవరం వంటివారు మనకు అసలు ఆనరు. బెంగాల్ లోని రవీంద్రుని పేరిట రవీంద్ర భారతి పెట్టిన మనవారికి వేమన, కవిత్రయం, పోతన, శ్రీనాథుడు గుర్తు అసలు రాలేదు. కమీసం లో కనీసం నన్నయ విశ్వవిద్యాలయం పెట్టడం సంతోషించదగ్గ విషయం. తమిళులు సుబ్రహ్మణ్య భారతి పేరిట విశ్వవిద్యాలయం పెట్టుకున్నారు. వాళ్ళ శిలప్పాదికారం గురించి, తిరుక్కురళ్ గురించి మామూలు తెలుగువాణ్ణైన నాకూ తెలిసింది. మరి మన కళాపూర్ణోదయం గురించి, వేదసమానమైన వేమన పద్యాల గురించి వాళ్ళకు తెలుసా? అసలుకు మనకే సరిగ్గా తెలీదు..ఇంక అందరికీ వారి గూర్చి ఏమి చెబుతాము. తమిళకవి సుబ్రహ్మణ్య భారతి గారి బొమ్మ , కొన్ని కవితలు మనకు సుపరిచితమే. తెలుగు గురించి ఆయన చెప్పిన తమిళ మాటలు మనకు వచ్చు కూడాను. మరి అలాగే ఉండే తెలుగు రాష్ట్రాని ఉత్తేజితం చేసిన గురజాడ వారి బొమ్మలు వాళ్ళకు తెలుసా? వాళ్ళకు తమవాడి గురించి చెప్పుకోడం తెలుసు, మనకు తెలవదు. మనవాళ్ళంటే మనలు మరీ చులకన, పైవాడంటే పరమ గౌరవం. మా కొద్దీ తెల్లదొరతనము” అని పాడిన గరిమెళ్ళ అవసానదశలో దుర్భరమైన జీవితం గడిపాడట. ప్రభుత్వం ఆయనకు సాయం చెయ్యలేదు. పూట గడవని దయనీయమైన స్థితిలో అడుక్కున్నాడట.ఇంక ప్రకాశం గారు ముఖ్యమంత్రివర్యులు అయినా అన్నానికి కష్టపడ్డారు.భగత్ సింగు, చంద్రశేఖరు ఆజాదు, నేతాజీ, గాంధీజీ, నెహ్రూ ల గురించి తెలీని తెలుగు వాడుండడు. అదే మన రాష్ట్ర సరిహద్దుల బయట మన అల్లూరి సీతారామరాజు గురించి ఎందరికి తెలుసు.ఇక కన్నెగంటి హనుమంతును గురించి, పుల్లరి సత్యాగ్రహం గురించైతే అసలు మనకే సరిగ్గా తెలీదు. చదువూ సంధ్యల్లేని ప్రజలతో చిన్నపాటి సైన్యాన్నే ఏర్పాటు చేసి, ఓ రెండేళ్ళ పాటు తెల్లవాడితో అల్లూరి స్థాయిలో సాయుధ పోరాటం చేసిన మొనగాడు భారత స్వాతంత్ర్య చరిత్రలో బోసు కాక మరొకరున్నారా? తానొక్కడే పోరాడడం కాదు, వందలాది మంది గిరిజనులతో చెయ్యీ చెయ్యీ కలిపి వాళ్ళ చేత పోరాటం చేయించాడు. రెండేళ్ళ పాటు తెల్లోణ్ణి అల్లాడించాడు. అదీ అల్లూరి గొప్పదనం. ఇదే అల్లూరి ఏ ఉత్తరదివారో అయ్యుంటే దేశం మొత్తం కళ్ళకద్దుకుని పూజించి ఉండేది కాదా? అప్పుడు మనమూ అల్లూరిని నెత్తినెట్టుకుని ఊరేగేవాళ్ళము. భావ దారిద్ర్యం మన వంటిలో ఉంది..వేరెవరో ఉత్తరం వారు మనలను చిన్న చూపు చూడటం లేదు..మనలను మనమే చిన్న చూపు చూసుకొని ఆత్మన్యూనత తో ఉత్తరం దక్షిణము అంటూ వారు వీరు అంటాము తప్ప మన గొప్పదనం తెలుసుకోము ఎందుకని ? అదే భావ దారిద్ర్యం భావ దాస్యములో మునిగి తేలడం అంటే.ఇప్పటికీ మన వారు మన నాయకులు కనీసములో కనీసం విదేశీ భావ దారిద్ర్యం వదలివేయాలి.

No comments:

Post a Comment