బాధ్యతాయుతమైన జవాబుదారి సంస్థగా హెచ్ఎండిఎ
హెచ్ఎండిఎ పనితీరు ఆశాజనకంగా లేదు
హైదరాబాద్ మెట్రొపాలిటన్ డెవలప్మెంట్ అథారిటిని మరింత బాధ్యతాయుతమైన సంస్థగా, జవాబుదారి యంత్రాంగంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. సచివాలయంలో మంగళవారం ఆయన హెచ్ఎండిఎ పై సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండిఎ కమిషనర్ ప్రదీప్చంద్ర, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి ఎంజీ.గోపాల్, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎండిఎ నడుసున్న తీరు, ప్రస్తుత పని విధానం, భవిష్యత్లో తీసుకురావలిసిన మార్పులు, మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఉద్యోగుల్లో మరింత బాధ్యత పెంచడం తదితర అంశాలపై విస్త్రుతంగా చర్చించారు. హెచ్ఎండిఎ పనితీరు ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. హెచ్ఎండిఎను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రజల అవసరాలను తీర్చే విషయంలో మరింత క్రీయాశీలకంగా పనిచేసే విధంగా హెచ్ఎండిఎను తీర్చిదిద్దాలని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా చేయాలని, అనుమతులు, ఇతర పరిపాలనా వ్యవహరాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. వివిధ శాఖల నుండి హెచ్ఎండిఎకు డిప్యుటేషన్లపై వచ్చిన వారి పని విధానాన్ని కూడా సమీక్షించాలని, అవసరమైన మార్పులు, చేర్పులు కూడా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హెచ్ఎండిఎ చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, పారదర్శకతను పెంపొందించే విధంగా అవసరమయితే చట్టాన్ని కూడా మార్చాలని సిఎం చెప్పారు. దీనికి సంబంధించి ఏమి చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవినీతి రహితంగా పనులు చేయడం, పారదర్శకంగా వ్యవహరించడం, అలసత్వం వీడడం అనే లక్ష్యాలతో కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.
హెచ్ఎండిఎ కమిషనర్గా సీనియర్ ఐఎఎస్ అధికారిణి శాలిని మిశ్రాను నియమిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి, హెచ్ఎండిఎ పనితీరును సమీక్షించడానికి సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని కూడా సిఎం నిర్ణయించారు.
హెచ్ఎండిఎ నడుసున్న తీరు, ప్రస్తుత పని విధానం, భవిష్యత్లో తీసుకురావలిసిన మార్పులు, మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఉద్యోగుల్లో మరింత బాధ్యత పెంచడం తదితర అంశాలపై విస్త్రుతంగా చర్చించారు. హెచ్ఎండిఎ పనితీరు ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. హెచ్ఎండిఎను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రజల అవసరాలను తీర్చే విషయంలో మరింత క్రీయాశీలకంగా పనిచేసే విధంగా హెచ్ఎండిఎను తీర్చిదిద్దాలని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా చేయాలని, అనుమతులు, ఇతర పరిపాలనా వ్యవహరాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. వివిధ శాఖల నుండి హెచ్ఎండిఎకు డిప్యుటేషన్లపై వచ్చిన వారి పని విధానాన్ని కూడా సమీక్షించాలని, అవసరమైన మార్పులు, చేర్పులు కూడా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హెచ్ఎండిఎ చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, పారదర్శకతను పెంపొందించే విధంగా అవసరమయితే చట్టాన్ని కూడా మార్చాలని సిఎం చెప్పారు. దీనికి సంబంధించి ఏమి చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవినీతి రహితంగా పనులు చేయడం, పారదర్శకంగా వ్యవహరించడం, అలసత్వం వీడడం అనే లక్ష్యాలతో కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.
హెచ్ఎండిఎ కమిషనర్గా సీనియర్ ఐఎఎస్ అధికారిణి శాలిని మిశ్రాను నియమిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి, హెచ్ఎండిఎ పనితీరును సమీక్షించడానికి సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని కూడా సిఎం నిర్ణయించారు.
No comments:
Post a Comment