రాష్ట్రం లో అసలు ప్రతిపక్షం ఉందా...?
ఉంటె పనిచేస్తుందా అని అనుమానం వొస్తుంది ....
ఉంటె పనిచేస్తుందా అని అనుమానం వొస్తుంది ....
1984 లో అనుకుంటా, ఎన్టీఆర్ గారిని తప్పించి నాదేండ్ల భాస్కర్ గారిని కేంద్రప్రభుత్వం ముఖ్యమంత్రి చేస్తే, ప్రజల వద్దకు వెళ్లి, ప్రజల మద్దతు కూడగట్టి, ఒక ఉప్పెనలా లేచి, నెల రోజుల్లో నాదెండ్ల గారి నడ్డి విరిచి. తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు మన ఎన్టీఆర్...
ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రజావ్యతిరేక విధానాలతో రైతుల నోట్లో మన్నుకోడుతూ, రైతులను భయ బ్రాంతులు చేస్తూ, రైతుల భూములను ప్రభుత్వమే లాక్కుంటుంటే, రైతుల పక్షాన నిలిచి మొత్తం రాష్ట్ర రైతులందరినీ ఏకం చేసి రైతుల హక్కులకోసం పోరాటం చేస్తూ, గాండ్రిoచాల్సిన ప్రధాన ప్రతిపక్షం YCP పార్టీ, పాలు తాగే పసికునలా మ్యావ్ మ్యావ్ అని ములన కూర్చొవడం భరించలేక పోతున్నా ...
ఇంతకు ముందు లేని భూముల గురించి పోరాటం చేసి, పేదలకు మిగులు భూములు పంచాలని ప్రభుత్వం పై తిరుగుబాటు చేసి, ఊరూరు ఎక్కడ బడితే అక్కడ ఎర్రజెండాలు పాతిన కామ్రేడ్ లు, ఇప్పుడు రైతుల సొంత ఆస్తులు లాక్కొంటున్న నేడు అవే జెండాలు విసురుకుంటూ కాలం వేలబుచ్చుతుండడం చూసి అసలు శ్రామిక కర్షక రైతుల పక్షపాత వామపక్ష పార్టీ అంటూ ఒకటి రాష్ట్రం లో ఉందా అని అనుమానమోస్తుంది...
రాష్ట్రానికి TDP, YCP అధికార, ప్రతిపక్షాలు గా ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ...
No comments:
Post a Comment