కాపు సోదరులారా !
కొంచెం మనసు పెట్టి చదువుతారని ఆకాంక్షిస్తూ...
అసలు కాపు కులాలకు కావలసింది రిజర్వేషన్లా? లేక BC ల్లో చేర్చడమా?
ఈ నాటికి సామాన్య ప్రజలకు అర్ధం కానిది, సంక్లిష్టమైన అంశం రిజర్వేషన్లే.1953 లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం నియమించబడిన ఆలిండియా BC కమీషన్ , కాకా కాలేకర్ ఏమి రిపోర్ట్ ఇచ్చారో, 1979 లో నియమించబడిన B.P.మండల్ రిపోర్ట్ లో ఏముందో ఈదేశంలో 99% మందికి తెలీదు.
కారణం??
1) ప్రజలకు ఈ విషయాలపై పరిజ్ఞానం లేకపోవడం
2)కమీషన్ ప్రతులు అందుబాటులో లేకపోవడం
3)సామాన్య ప్రజల్లో నిరక్షరాస్యత
4)మన ప్రభుత్వ సారధులు అగ్రకులాలకు చెందినవారు కావడం
5)అసలు ప్రభుత్వ నేతలకు చిన్న కులాలకు న్యాయం చేయాలని తలంపు లేకపోవడం.
కొంచెం మనసు పెట్టి చదువుతారని ఆకాంక్షిస్తూ...
అసలు కాపు కులాలకు కావలసింది రిజర్వేషన్లా? లేక BC ల్లో చేర్చడమా?
ఈ నాటికి సామాన్య ప్రజలకు అర్ధం కానిది, సంక్లిష్టమైన అంశం రిజర్వేషన్లే.1953 లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం నియమించబడిన ఆలిండియా BC కమీషన్ , కాకా కాలేకర్ ఏమి రిపోర్ట్ ఇచ్చారో, 1979 లో నియమించబడిన B.P.మండల్ రిపోర్ట్ లో ఏముందో ఈదేశంలో 99% మందికి తెలీదు.
కారణం??
1) ప్రజలకు ఈ విషయాలపై పరిజ్ఞానం లేకపోవడం
2)కమీషన్ ప్రతులు అందుబాటులో లేకపోవడం
3)సామాన్య ప్రజల్లో నిరక్షరాస్యత
4)మన ప్రభుత్వ సారధులు అగ్రకులాలకు చెందినవారు కావడం
5)అసలు ప్రభుత్వ నేతలకు చిన్న కులాలకు న్యాయం చేయాలని తలంపు లేకపోవడం.
చిన్న కులాలు ఆర్ధిక, సామాజిక, విద్య, వైద్య, ఉద్యోగాలలో అభివృద్ది సాదిస్తే అగ్రకుల ఆధిపత్యం పోతుందనే భయం.
చిన్న కులాలు ఎదిగితే .. కుల సంకెళ్ళు విచ్చిన్నమై, కుల గోడలు కూలుతాయనే ప్రగాడ నమ్మకం.
పై కారణాలవల్ల కాపులకు రాజ్యాంగ పరంగా దక్కవలసిన హక్కులను నేటి పాలకులు కాలరాశారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని అత్యంత సంక్లిష్టమైన అంశంగా మార్చారు.
కాపులకు కావాల్సింది 1956 కి ముందు వున్న హక్కులైన రిజర్వేషన్లుకాని, చిన్న కులాలైన బలహీన వర్గాల సోదరుల భోజనంలో వాటా కాదు.
ఈ రోజు ముస్లిం సోదరులకు ఇచ్చింది రిజర్వేషన్లు కాని బలహీన వర్గాలకు కేటాయించిన దానిలో భాగంకాదు. మన కాపు సోదరులు డిమాండ్ చేస్తున్నది అదే. ఈ రోజు వంద ఉద్యోగాలలో 15%SC లకు, 5% ST లకు, 4% ముస్లింలకు, 25% BCలకు . మొత్తం 49% .
మన ప్రక్క రాష్ట్రాలలో కర్నాటకలో 72%, తమిళనాడులో 69%, కేరళ లో 64% రిజర్వేషన్ లు అమలులో వున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా రిజర్వేషన్ల శాతాన్ని పెంచి బలహీనవర్గాలకు న్యాయంచేకూరేలా కాపులకు 15% రిజర్వేషన్లు కల్పించాలి.
సంక్షేమ రాజ్యం అంటే బడుగు , బలహీన వర్గాల అభివృద్దే కనుక , ఈ రాష్ట్రంలో 30% కాపు ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో వున్నారు. కాపుల అభివృద్ది కూడా రాష్ట్రాభివృద్దిలో భాగమే.
ముస్లిం సోదరులకు ఏవిదంగా 4% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారో, అదే విదంగా కాపులకు 15% రిజర్వేషన్లను సెపరేట్ స్లాట్( F కేటగిరిగా) గా సత్వరం కేటాయించాలి. కాపు రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదింప చేసి పార్లమెంట్ లో పాస్ చేయించి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో తక్షణం చేర్చాలి.
కాపులకు కావాల్సింది తొలగించిన రిజర్వేషన్లుకాని , BC సోదరుల అభివృద్దిలో వాటా కాదు.
భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం రిజర్వేషన్లు అనుభవించి, తరువాత రిజర్వేషన్లు కోల్పోయిన ఏకైక జాతి కాపులు.
జనవరి 31 న ముద్రగడ ఆద్వర్యంలో అన్నవరం దగ్గరలో జరిగే కాపుమహాగర్జనకు హాజరు కావాల్సింగా కోరుకుంటూ.....
చిన్న కులాలు ఎదిగితే .. కుల సంకెళ్ళు విచ్చిన్నమై, కుల గోడలు కూలుతాయనే ప్రగాడ నమ్మకం.
పై కారణాలవల్ల కాపులకు రాజ్యాంగ పరంగా దక్కవలసిన హక్కులను నేటి పాలకులు కాలరాశారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని అత్యంత సంక్లిష్టమైన అంశంగా మార్చారు.
కాపులకు కావాల్సింది 1956 కి ముందు వున్న హక్కులైన రిజర్వేషన్లుకాని, చిన్న కులాలైన బలహీన వర్గాల సోదరుల భోజనంలో వాటా కాదు.
ఈ రోజు ముస్లిం సోదరులకు ఇచ్చింది రిజర్వేషన్లు కాని బలహీన వర్గాలకు కేటాయించిన దానిలో భాగంకాదు. మన కాపు సోదరులు డిమాండ్ చేస్తున్నది అదే. ఈ రోజు వంద ఉద్యోగాలలో 15%SC లకు, 5% ST లకు, 4% ముస్లింలకు, 25% BCలకు . మొత్తం 49% .
మన ప్రక్క రాష్ట్రాలలో కర్నాటకలో 72%, తమిళనాడులో 69%, కేరళ లో 64% రిజర్వేషన్ లు అమలులో వున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా రిజర్వేషన్ల శాతాన్ని పెంచి బలహీనవర్గాలకు న్యాయంచేకూరేలా కాపులకు 15% రిజర్వేషన్లు కల్పించాలి.
సంక్షేమ రాజ్యం అంటే బడుగు , బలహీన వర్గాల అభివృద్దే కనుక , ఈ రాష్ట్రంలో 30% కాపు ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో వున్నారు. కాపుల అభివృద్ది కూడా రాష్ట్రాభివృద్దిలో భాగమే.
ముస్లిం సోదరులకు ఏవిదంగా 4% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారో, అదే విదంగా కాపులకు 15% రిజర్వేషన్లను సెపరేట్ స్లాట్( F కేటగిరిగా) గా సత్వరం కేటాయించాలి. కాపు రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదింప చేసి పార్లమెంట్ లో పాస్ చేయించి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో తక్షణం చేర్చాలి.
కాపులకు కావాల్సింది తొలగించిన రిజర్వేషన్లుకాని , BC సోదరుల అభివృద్దిలో వాటా కాదు.
భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం రిజర్వేషన్లు అనుభవించి, తరువాత రిజర్వేషన్లు కోల్పోయిన ఏకైక జాతి కాపులు.
జనవరి 31 న ముద్రగడ ఆద్వర్యంలో అన్నవరం దగ్గరలో జరిగే కాపుమహాగర్జనకు హాజరు కావాల్సింగా కోరుకుంటూ.....
No comments:
Post a Comment