చిత్తూరు రక్త చరిత్ర
***************
గంగనపల్లె....దాదాపు గత 25 సంవత్సరాల నుండి చిత్తూరు పట్టణ రాజకీయాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తున్న ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం బలిజనాయుడు సామాజిక వర్గానిదే ఆధిపత్యం.కఠారి మోహన్, అనురాధ ల స్వస్థలం.ఒకప్పుడు చిత్తూరు పట్టణానికి శివార్లలో గ్రామంగా ఉండేది.
***************
గంగనపల్లె....దాదాపు గత 25 సంవత్సరాల నుండి చిత్తూరు పట్టణ రాజకీయాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తున్న ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం బలిజనాయుడు సామాజిక వర్గానిదే ఆధిపత్యం.కఠారి మోహన్, అనురాధ ల స్వస్థలం.ఒకప్పుడు చిత్తూరు పట్టణానికి శివార్లలో గ్రామంగా ఉండేది.
1911 సంవత్సరం వరకు చిత్తూరు పట్టణం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లోని ఉత్తర ఆర్కాట్ జిల్లా కేంద్రంగా ఉండేది. 1850 ప్రాంతంలో జిల్లా దక్షిణప్రాంతం లో ప్లేగు వ్యాధి ప్రబలడంతో దాదాపు 100 తెలుగు బలిజనాయుడు కుటుంబాలు వలసవచ్చి జిల్లా ఎగువ ప్రాంతంలో స్థిరపడ్డాయట. అదే కాలక్రమేణ గంగనపల్లె గ్రామంగా రూపుదిద్దుకుంది.ఈ కుటుంబాలు అనేక సంవత్సరాలు గా ఐకమత్యం తో కలిసికట్టుగా సాగాయంటారు. కాలక్రమేణ దాదాపు అన్ని కుటుంబాల మధ్య దగ్గరో దూరమో ఏదోరకమయిన బంధుత్వం ఏర్పడుతూ వచ్చింది. గ్రామంలో తమలో తమకు ఎన్ని వివాదాలు వచ్చినా బయట సామాజికవ్యక్తులను జోక్యం చేసుకోనివ్వరని, బయట వ్యక్తుల తో వివాదాలు వస్తే తమలో తమకు ఎంత వైరం ఉన్నా కలిసికట్టుగా ఎదుర్కొంటారని అప్పట్లో చిత్తూరు పట్టణంలో చెప్పుకునే వారు. 1970 ల్లో గంగనపల్లె గ్రామం చిత్తూరు మునిసిపాలిటి లో విలీనం తర్వాత పట్టణ రాజకీయాలలో వీరి ఉనికి ప్రారంభమైంది.
అలానే... చిత్తూరు పట్టణంలో 1979 లో సి.కే బాబు అలియాస్ సి.కే జయచంద్రా రెడ్డి అనే రౌడీ షీటర్ హవా ప్రారంభమైంది.తదనంతరం ఈయన మాజీ ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి గారికి ప్రధాన అనుచరుడయ్యాడు .దాదాపు 10 సంవత్సరాలు చిత్తూరు పట్టణాన్ని హత్యలతో గడగడలాడించాడని అంటారు. 1989 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ టికెట్ దొరకక
ఇండిపెండెంట్ గా నిలబడి పోలింగ్ బూత్ ల ఆక్రమణ, రిగ్గింగ్ తో ఏకంగా ఏం.యల్.ఏ గా గెలిచి ఆతర్వాత కాంగ్రెస్ లో తిరిగి చేరిపోయాడట. ఇక్కడ నుంచి అతనికి అడ్డులేకుండా పోయిందని వినికిడి.
ఇండిపెండెంట్ గా నిలబడి పోలింగ్ బూత్ ల ఆక్రమణ, రిగ్గింగ్ తో ఏకంగా ఏం.యల్.ఏ గా గెలిచి ఆతర్వాత కాంగ్రెస్ లో తిరిగి చేరిపోయాడట. ఇక్కడ నుంచి అతనికి అడ్డులేకుండా పోయిందని వినికిడి.
అదే సమయం లో పుంగనూరు పట్టణ బలిజ సామాజిక వర్గానికి చెందిన ఒక స్కూల్ టీచర్ ఉద్యోగ రీత్యా చిత్తూరు లోని గంగనపల్లె కి నివాసరీత్యా రావడం జరిగిందట. ఓకే సామాజిక వర్గం కావడంతో తక్కువ సమయంలో వీరి కుటుంబం స్థానిక కుటుంబాలతో సన్నిహితమయింది.వీరి కుమారుడు దుర్గా ప్రసాద్ విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాడు.1992 చిత్తూరు పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల ఎలక్షన్స్ లో అప్పటి ఎమ్మెల్యే సి.కే జయచంద్రా రెడ్డి అలియాస్ సి.కే బాబు అనుచరుడు ప్రసాద్ రెడ్డి పై విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఓటమిని జీర్ణించుకోని ప్రసాద్ రెడ్డి వర్గం దుర్గా ప్రసాద్ ని హత్య చేసిందంటారు. ఇది సీ.కే.బాబు పరోక్ష అండతోనే జరిగిందని అంటారు. అప్పట్లో ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇందుకు ప్రతీకారం గా సరిగ్గా ఆరు నెలల తిరక్కముందే ఇదే హత్య కేసులో న్యాయస్థానానికి హాజరవుతున్న సమయంలోనే ప్రసాద్ రెడ్డి హత్యకు గురయ్యాడు. గంగనపల్లె వాస్తవ్యలే ఈ ప్రతీకార
హత్య కు పాల్పడి సీ.కే జజయచంద్రా రెడ్డి అలియాస్ సీ.కే.బాబు ఆధిపత్యానికి సవాల్ విసిరారంటారు.
ఇందుకు ప్రతీకారం గా సరిగ్గా ఆరు నెలల తిరక్కముందే ఇదే హత్య కేసులో న్యాయస్థానానికి హాజరవుతున్న సమయంలోనే ప్రసాద్ రెడ్డి హత్యకు గురయ్యాడు. గంగనపల్లె వాస్తవ్యలే ఈ ప్రతీకార
హత్య కు పాల్పడి సీ.కే జజయచంద్రా రెడ్డి అలియాస్ సీ.కే.బాబు ఆధిపత్యానికి సవాల్ విసిరారంటారు.
సరిగ్గా ఇదే సమయంలో 1994 ఎలక్షన్స్ లో తెలుగు దేశం పార్టీ బలిజ సామాజిక వర్గానికి చెందిన కఠారి మోహన్ దగ్గర బంధువు ఏ.యస్.మనోహర్ నాయుడు ని ఏం.యల్. ఏ అభ్యర్థి గా రంగంలో దించడంతో అప్పటి వరకూ కాంగ్రెస్ లో ఉన్న కఠారి మోహన్ సహా గంగనపల్లె బలిజనాయుడు సామాజిక వర్గం మొత్తం వెన్నంటి నిలిచింది. దీంతో ఏకఛత్రాధిపత్యంగా ఉన్న సీ.కే జయచంద్రా రెడ్డి వర్గానికి బలమైన ప్రత్యర్ధి వర్గం తయారైంది. తదనంతరం 1999 లో కింగ్ ఫిషర్ విజయ్ మాల్య వ్యాపార భాగస్వామి , కర్ణాటక రాజకీయాలలో కింగ్ మేకర్ గా పేరున్న చిత్తూరు వాస్తవ్యులు
అతి పెద్ద వ్యాపారవేత్త అయిన డీ.కే.ఆదికేశవులు నాయుడు ని తెలుగుదేశం చిత్తూరు ఎంపీ గా రంగంలోదించడం ,ఆయన విజయం సాధించడంతో
బలిజనాయుడు సామాజిక వర్గం పట్టు పెరిగిపోయింది. ఈ క్రమంలో దాదాపు 10 సంవత్సరాలు సీ.కే. జయచంద్రా రెడ్డి అలియాస్ సీ.కే.బాబు వర్గం ప్రభావం తగ్గిపోయంది.
దీనిని గ్రహించిన సీ.కే.బాబు 2004 ఎన్నికల ముందు చిన్న గొడవ లో జోక్యం చేసుకొని ఒక సాధారణ ఇంజనీరింగ్ విద్యార్థి ని పెట్రోలు పోసి తగలబెట్టడంతో చిత్తూరు పట్టణం ఉలిక్కిపడింది. ప్రజల్లో తన పట్ల భయాందోళనలు తిరిగి పెంచి తన పట్టు సాధించాలని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటారు. ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం ఉల్లుబికినా అప్పటి ప్రతిపక్ష నేత రాజశేఖర రెడ్డి తన ప్రధాన అనుచరున్ని వెనకేసురావడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసిందంటారు.
అతి పెద్ద వ్యాపారవేత్త అయిన డీ.కే.ఆదికేశవులు నాయుడు ని తెలుగుదేశం చిత్తూరు ఎంపీ గా రంగంలోదించడం ,ఆయన విజయం సాధించడంతో
బలిజనాయుడు సామాజిక వర్గం పట్టు పెరిగిపోయింది. ఈ క్రమంలో దాదాపు 10 సంవత్సరాలు సీ.కే. జయచంద్రా రెడ్డి అలియాస్ సీ.కే.బాబు వర్గం ప్రభావం తగ్గిపోయంది.
దీనిని గ్రహించిన సీ.కే.బాబు 2004 ఎన్నికల ముందు చిన్న గొడవ లో జోక్యం చేసుకొని ఒక సాధారణ ఇంజనీరింగ్ విద్యార్థి ని పెట్రోలు పోసి తగలబెట్టడంతో చిత్తూరు పట్టణం ఉలిక్కిపడింది. ప్రజల్లో తన పట్ల భయాందోళనలు తిరిగి పెంచి తన పట్టు సాధించాలని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటారు. ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం ఉల్లుబికినా అప్పటి ప్రతిపక్ష నేత రాజశేఖర రెడ్డి తన ప్రధాన అనుచరున్ని వెనకేసురావడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసిందంటారు.
ఈ సంఘటన తో సీ.కే.బాబు అలియాస్ సీ.కే జయచంద్రా రెడ్డి 2004 ఎన్నికల్లో పరాజయం పాలయ్యాడు. అయితే రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రి కావడంతో ఇతనికి ఎదురులేకుండా పోయిందంటారు.
తుపాకులతో అధికారులను బెదిరించి పనులు జరుపుకునేవాడంటారు. అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి కి అతి దగ్గర వ్యక్తి కావడంతో పోలీసులు మిన్నుకుండేవారని ఆరోపణలు వచ్చాయి.పట్టణంలో తిరిగి గూండా రాజ్యం ప్రారంభం అయిందని గుసగుసలు ప్రారంభమయ్యాయి.
2005 లో మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో సీ.కే.బాబు అనుచరుడు పురుషోత్తం రెడ్డి కి , కఠారి మోహన్ కి మధ్య జరిగిన వాగ్వివాదంతో తిరిగి వాతావరణం వేడెక్కింది. అదే రోజు సాయంత్రం కఠారి మోహన్ పై దుండగులు దాడి చేశారు.కారు లోవస్తున్న ఆయన ను నరికి చనిపోయారని భావించి వెళ్లిపోయారు.దీని సూత్రధారి సీ .కే జయచంద్రా రెడ్డి అని పట్టణమంతా చెప్పుకున్నారు .విషయం తెలిసిన వెంటనే కఠారి మోహన్ అనుచరులు ఆయనను రాయవెల్లూరు సి.యం.సి కి తరలించారు. సమాచారాన్ని అందుకున్న డీ.కే.ఆదికేశవులు నాయుడు, అక్కడ కఠారి మోహన్ కి రక్షణ ఉండదని భావించి ప్రథమచికిత్స అనంతరం తన సొంత హెలికాప్టర్ లో బెంగళూరు కి తరలించాడట.
తుపాకులతో అధికారులను బెదిరించి పనులు జరుపుకునేవాడంటారు. అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి కి అతి దగ్గర వ్యక్తి కావడంతో పోలీసులు మిన్నుకుండేవారని ఆరోపణలు వచ్చాయి.పట్టణంలో తిరిగి గూండా రాజ్యం ప్రారంభం అయిందని గుసగుసలు ప్రారంభమయ్యాయి.
2005 లో మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో సీ.కే.బాబు అనుచరుడు పురుషోత్తం రెడ్డి కి , కఠారి మోహన్ కి మధ్య జరిగిన వాగ్వివాదంతో తిరిగి వాతావరణం వేడెక్కింది. అదే రోజు సాయంత్రం కఠారి మోహన్ పై దుండగులు దాడి చేశారు.కారు లోవస్తున్న ఆయన ను నరికి చనిపోయారని భావించి వెళ్లిపోయారు.దీని సూత్రధారి సీ .కే జయచంద్రా రెడ్డి అని పట్టణమంతా చెప్పుకున్నారు .విషయం తెలిసిన వెంటనే కఠారి మోహన్ అనుచరులు ఆయనను రాయవెల్లూరు సి.యం.సి కి తరలించారు. సమాచారాన్ని అందుకున్న డీ.కే.ఆదికేశవులు నాయుడు, అక్కడ కఠారి మోహన్ కి రక్షణ ఉండదని భావించి ప్రథమచికిత్స అనంతరం తన సొంత హెలికాప్టర్ లో బెంగళూరు కి తరలించాడట.
ఈ నేపథ్యంలో నే గంగనపల్లె వాస్తవ్యుడు చెన్నై పోర్టు లో మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కఠారి మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మేనమామ కు మద్దతుగా బెంగళూరు చేరుకున్నాడంటారు.
దాదాపు రెండు సంవత్సరాలు అనంతరం
2007 సంవత్సరం లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న సీ.కే.బాబు పై
ఒక బృందం తుపాకులతో మెరుపుదాడి కి దిగి బెంగళూరు హైవే దిశగా మాయమయింది. ఈ ఘటనలో సీ.కే.బాబు అలియాస్ సీ.కే జయచంద్రా రెడ్డి గాయాలతో తప్పించున్నాడు. అప్పటి ముఖ్య మంత్రి కి అనుంగు శిష్యుడు పై దాడికావడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. ఆఘమేఘాలపై దర్యాప్తు జరిపిన తర్వాత కఠారి మోహన్ ను నిందితుడు గా తేల్చారు. అయితే బెంగళూరు వెళ్లి అరెస్టు చేయలేని పరిస్థితి. కర్నాటక లో డీ.కే.ఆదికేశవులు నాయుడు ప్రాబల్యం వల్ల అక్కడ బెంగుళూరు పోలీసులు సహకరించలేదని వినికిడి. కఠారి మోహన్ ఎక్కడున్నాడన్న
సమాచారం పిసరంత కూడా లభ్యం కాలేదు. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని తిరుగుతున్నాడని పట్టణంలో వదంతులు వ్యాపించాయి.
దాదాపు రెండు సంవత్సరాలు అనంతరం
2007 సంవత్సరం లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న సీ.కే.బాబు పై
ఒక బృందం తుపాకులతో మెరుపుదాడి కి దిగి బెంగళూరు హైవే దిశగా మాయమయింది. ఈ ఘటనలో సీ.కే.బాబు అలియాస్ సీ.కే జయచంద్రా రెడ్డి గాయాలతో తప్పించున్నాడు. అప్పటి ముఖ్య మంత్రి కి అనుంగు శిష్యుడు పై దాడికావడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. ఆఘమేఘాలపై దర్యాప్తు జరిపిన తర్వాత కఠారి మోహన్ ను నిందితుడు గా తేల్చారు. అయితే బెంగళూరు వెళ్లి అరెస్టు చేయలేని పరిస్థితి. కర్నాటక లో డీ.కే.ఆదికేశవులు నాయుడు ప్రాబల్యం వల్ల అక్కడ బెంగుళూరు పోలీసులు సహకరించలేదని వినికిడి. కఠారి మోహన్ ఎక్కడున్నాడన్న
సమాచారం పిసరంత కూడా లభ్యం కాలేదు. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని తిరుగుతున్నాడని పట్టణంలో వదంతులు వ్యాపించాయి.
క్రమంగా ఈ వివాదం రాయలసీమ లోని రెండు ప్రధాన సామాజిక వర్గాల గొడవ గా మారిపోయిందనే వాదనలు వినిపించాయి.
ఆరు నెలలు తిరక్కముందే రెండోసారి
కఠారి మోహన్ వర్గం మందుపాతరలు అమర్చి సీ.కే జయచంద్రా రెడ్డి అలియాస్ సీ.కే.బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేసింది. ఈసారి కూడా సీ.కే.బాబు తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. రాయలసీమ ఫాక్షన్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జిలిటెన్ ( మందుపాతరలు) వినియోగించడం ప్రథమం కావడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు లోతుగా దర్యాప్తు సాగించారు. అప్పుడే చింటూ పేరు వెలుగులోకి వచ్చింది. చెన్నై లో మెరైన్ ఇంజనీర్ గా పనిచేసినప్పుడు ఎల్.టి.టి.ఈ తో ఏమయినా సంబంధాలున్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరిగిందని లేకుంటే ఇంత పెద్ద మొత్తంలో మందుపాతరలు సేకరించడం కష్టమని పేపర్లు లో కథనాలు వచ్చాయి. అందువల్లనే ఈ కేసులో చింటూ
ని ప్రధాన ముద్దాయి గా చేర్చారని వినికిడి.
చిన్నతనం లో తన చదువు కోసం మేనమామ కఠారి మోహన్ సాయపడ్డాడని ఆ కృతజ్ఞతతో మేనమామ కు అండగాఈ దాడుల్లో పాల్గోన్నాడని పోలీసులు దర్యాప్తు లో తేల్చినట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.ఈ సంఘటనలతో సీ.కే.బాబు తన గృహానికే పరిమితమైపోయాడు. అప్పడే మున్సిపల్ కౌన్సిల్ ఉప ఎన్నికల్లో కఠారి అనురాధ అత్యంత ఒత్తిళ్లు నడుమ భారీ విజయం సాధించింది. 2009 ఎన్నికల ముందు కఠారి బృందం వ్యూహాత్మకంగా పోలీసులకు లోంగిపోయింది. అయితే అత్యంత పెద్దవ్యక్తుల స్థాయిలో రాజీ జరిగినందున వీరు నరెండర్
అయ్యారని కథనం.తిరిగి కఠారి మోహన్ రాజకీయాలలో క్రియాశీలం అయ్యారు.
ఆరు నెలలు తిరక్కముందే రెండోసారి
కఠారి మోహన్ వర్గం మందుపాతరలు అమర్చి సీ.కే జయచంద్రా రెడ్డి అలియాస్ సీ.కే.బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేసింది. ఈసారి కూడా సీ.కే.బాబు తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. రాయలసీమ ఫాక్షన్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జిలిటెన్ ( మందుపాతరలు) వినియోగించడం ప్రథమం కావడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు లోతుగా దర్యాప్తు సాగించారు. అప్పుడే చింటూ పేరు వెలుగులోకి వచ్చింది. చెన్నై లో మెరైన్ ఇంజనీర్ గా పనిచేసినప్పుడు ఎల్.టి.టి.ఈ తో ఏమయినా సంబంధాలున్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరిగిందని లేకుంటే ఇంత పెద్ద మొత్తంలో మందుపాతరలు సేకరించడం కష్టమని పేపర్లు లో కథనాలు వచ్చాయి. అందువల్లనే ఈ కేసులో చింటూ
ని ప్రధాన ముద్దాయి గా చేర్చారని వినికిడి.
చిన్నతనం లో తన చదువు కోసం మేనమామ కఠారి మోహన్ సాయపడ్డాడని ఆ కృతజ్ఞతతో మేనమామ కు అండగాఈ దాడుల్లో పాల్గోన్నాడని పోలీసులు దర్యాప్తు లో తేల్చినట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.ఈ సంఘటనలతో సీ.కే.బాబు తన గృహానికే పరిమితమైపోయాడు. అప్పడే మున్సిపల్ కౌన్సిల్ ఉప ఎన్నికల్లో కఠారి అనురాధ అత్యంత ఒత్తిళ్లు నడుమ భారీ విజయం సాధించింది. 2009 ఎన్నికల ముందు కఠారి బృందం వ్యూహాత్మకంగా పోలీసులకు లోంగిపోయింది. అయితే అత్యంత పెద్దవ్యక్తుల స్థాయిలో రాజీ జరిగినందున వీరు నరెండర్
అయ్యారని కథనం.తిరిగి కఠారి మోహన్ రాజకీయాలలో క్రియాశీలం అయ్యారు.
సీ.కే జయచంద్రా రెడ్డి భార్య మేయర్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది.
2014 లో కఠారి అనురాధ మేయర్ గా ఎన్నికైన తర్వాత కఠారి స్వబృందం లోనే తలెత్తిన అపనమ్మకాలు, వివాదాల తో వైషమ్యాలు ముదిరి కడకు అదే మేనల్లుడు చేతిలో అనూహ్యంగా హత్య కు గురయ్యారని పోలీసుల అభిప్రాయం. భర్త అజ్ఞాతం లో ఉన్నప్పుడు పోలీసుల బెదిరింపులు, ప్రత్యర్థుల ఆగడాలకు ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కొన్న కఠారి అనురాధ తుదకు ఈ విధంగా బలయ్యిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షరామామూలుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉదంతాన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలని ప్రయత్నిస్తుండగా.....
తరతరాలుగా ఐక్యంగా నిలిచిన "గంగనపల్లె"
జంట హత్యలకి మూగసాక్షిగా మిగిలిపోయింది...
2014 లో కఠారి అనురాధ మేయర్ గా ఎన్నికైన తర్వాత కఠారి స్వబృందం లోనే తలెత్తిన అపనమ్మకాలు, వివాదాల తో వైషమ్యాలు ముదిరి కడకు అదే మేనల్లుడు చేతిలో అనూహ్యంగా హత్య కు గురయ్యారని పోలీసుల అభిప్రాయం. భర్త అజ్ఞాతం లో ఉన్నప్పుడు పోలీసుల బెదిరింపులు, ప్రత్యర్థుల ఆగడాలకు ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కొన్న కఠారి అనురాధ తుదకు ఈ విధంగా బలయ్యిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షరామామూలుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉదంతాన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలని ప్రయత్నిస్తుండగా.....
తరతరాలుగా ఐక్యంగా నిలిచిన "గంగనపల్లె"
జంట హత్యలకి మూగసాక్షిగా మిగిలిపోయింది...
అభినందనలతో .....ఢిల్లీ కాపు బృందం
No comments:
Post a Comment