ఇంజనీరింగ్ కళాశాలల్లో భారీగా మిగిలిపోయిన సీట్లు
29-06-2016 06:55:26
- 18 వేల సీట్లుకు భర్తీ అయ్యింది 11 వేలే!
- దెబ్బకొట్టిన డీమ్డ్
- యూనివర్సిటీలు
- ఆగని వలసలు
- గుంటూరు(విద్య): జిల్లాలో ఈ ఏడాది ఇంజనీరింగ్ కళాశాలల్లో భారీగా సీట్లు మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని 47 ఇంజనీరరింగ్కళాశాలల్లో 18 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 47 ఇంజనీరింగ్ కళాశాలల్లో భర్తీ అయిన సీట్లు సంఖ్య 11 వేలు మాత్రమే. దాదాపు ఏడు వేల సీట్లు మిగిలిపోయే అవకాశం ఉందని ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన నాయకులు చెబుతున్నారు. ఇతర రాషా్ట్రలకు వలసలు తగ్గకపోవడం, డీమ్డ్ యూనివర్సిటీల్లో ఈ ఏడాది భారీగా సీట్లును పెంచడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో ఎంసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు 20 వేలకు పైగా ఉన్నారు. వారిలో ఐఐటీ, నిట్, ఇతర డీమ్డ్ యూనివర్శిటీల్లో దాదాపు రెండువేల మంది చేరే అవకాశం ఉందని భావించారు.
ఈ ఏడాది అనూహ్యంగా జిల్లాలోని కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు డిమాండ్ ఉన్న బ్రాంచీల్లో భారీగా సీట్ల సంఖ్యను పెంచారు. ఫలితంగా అనేక మంది విద్యార్థులకు అక్కడ చేరారు. ఓ డీమ్డ్ యూనివర్శిటీలో సీఎస్ఈ బ్రాంచిలో దాదాపు 200 మందికిపైగా చేరినట్లు సమాచారం. ఫలితంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు మిగిలిపోతున్నాయని ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నారు. కేవలం ఫీజు రీ ఇంబర్స్మెంట్ కోసం కొన్ని కళాశాలల్లో విద్యార్థులు చేరుతున్నారని, కొద్దిగా డబ్బు ఉన్నవారు డీమ్డ్ వర్సిటీ వైపు చూస్తున్నారని ఓ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన వివరించారు.
రెండో కౌన్సెలింగ్ పై ఆశలు
ప్రభుత్వం రెండో కౌన్సెలింగ్కు నోటిఫికేషన జారీ చేస్తే కొన్ని కళాశాలల్లో సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనేక కళాశాలలు రెండో కౌన్సెలింగ్పై ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి, రాషా్ట్రల నుంచి సైతం విద్యార్థులను దిగుమతి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పేరున్న కళాశాలల్లో మాత్రం పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన కళాశాలల పరిస్థితి ఏమిటనేది ఆందోళనకరంగా ఉంది.
No comments:
Post a Comment