UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 26 June 2016

స్వీయ అనుభవాల నేపథ్యంలో అజ్ఞానం ఆవరించకుండా సాధకులు తగు జాగ్రత్త వహించాలనేవారు రామకృష్ణ పరమహంస.
వేద వాంగ్మయాన్ని కంఠస్థం చేసి విద్యార్థి జ్ఞానామృతాన్ని పదిలపరచుకుంటాడు. ఆధ్యాత్మిక పరిభాషలో భగవత్తత్వాన్ని సమగ్రంగా తెలుసుకోవడం జ్ఞానమంటారు. ఒకసారి గ్రీకు తత్వవేత్త సోక్రటీసును అశరీరవాణి ‘మహాజ్ఞాన్‌’ అని సంబోధించింది. అందుకాయన పొంగిపోలేదు. కొందరు వేదాంతులు ఆయన్ను కలిసినప్పుడు సోక్రటీసు మహాశయుడు వినయంగా వారితో అన్నాడు. ‘నేను తెలుసుకున్నదేమైనా ఉంటే అది నాకు ఏమీ తెలియదనే సత్యాన్నే... అందరూ నన్ను మహాజ్ఞాని అంటారు. భగవంతుణ్ని తెలుసుకునే విషయంలో నేనూ అజ్ఞానినే!’
మనిషి విషయ పరిజ్ఞానాన్ని కూలంకషంగా అర్థం చేసుకోలేడు. దిగంతాల వద్ద భూమ్యాకాశాలు కలిసినట్లుగా కనిపించినా, యథార్థం వేరు! భూమ్యాకాశాలు రైలు పట్టాల్లాగా ఎన్నటికీ కలిసేవి కావు. అలా చూస్తున్న మానవ దృష్టి భ్రమతో కూడుకున్నది. పరిశోధనతో శాస్త్రవేత్తలు సత్యాన్ని వెలికి తీస్తుంటారు. వారి శోధన భౌతిక వస్తుజాలానికి పరిమితమవుతుంది. ‘ఆత్మవిచారణతో అద్వైత సత్యాన్ని ఆవిష్కరించుకున్న జ్ఞానికి చెప్పుకోదగ్గ కోరికలేవీ ఉండవు. అలా ఉండే పక్షంలో అతడికి, ఓ జంతువుకు తేడా ఏముంటుంది?’ అని ప్రశిస్తారు ఆధ్యాత్మిక తత్వవేత్త సదానంద యోగి.
జ్ఞాని తనలో ఉన్న ఆత్మతత్వాన్ని అందరిలోనూ సమంగా దర్శిస్తాడు. అందరి కష్టసుఖాలూ తనవిగా భావిస్తాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ ప్రముఖ బెంగాలీ సాహితీవేత్త. మానవతావాది. లేగదూడలకు కడుపు నిండా పాలు అందవనే భావంతో పాలు తాగే వారు కాదట! కష్టం కలుగుతుందనే భావనతో ఎద్దులు, గుర్రాలు పూన్చిన వాహనాలు ఎక్కేవారు కాదట!
ఒక సాధువు పౌర్ణమి రాత్రివేళ నయన మనోహరంగా ఆకాశంలో ధవళ కాంతులీనుతూ వెన్నెల కురిపిస్తున్న నిండు చందమామను చూశాడు. అపరిమితానందం పొందుతూ ఇలా అనుకున్నాడు. ‘ఆహా! పండువెన్నెలను ఈ రోజు మాత్రమే చక్కగా ఆస్వాదించగలుగుతున్నాను. మనిషి తనలో ఉండే ఆత్మను గుర్తించలేక ఆనందానికి దూరమవుతున్నాడు. మబ్బు చందమామకు అడ్డు వచ్చినప్పుడు చీకట్లు కమ్ముకున్నట్లు బుద్ధి, ఆత్మల మధ్యకు అజ్ఞానం వచ్చినప్పుడు ఆత్మ ఉనికి గ్రహించలేకున్నాడు. జ్ఞానానికి దూరమవుతున్నాడు!’
సాధనలక్ష్యం అజ్ఞాన నిర్మూలనమే. అయితే అందుకు సజ్జన సాంగత్యం, గురుశుశ్రూష, దైవకృప తోడ్పడతాయంటారు పండితులు. వేలాదిగా దివ్య పురుషుల ఆవిర్భావం వల్ల భరతభూమి కర్మభూమిగా పునీతమైంది. పాశ్చాత్య సాధకులను సైతం భారతదేశం ఆకర్షించి ఆత్మవెలుగు నింపుతోందంటే, అది సనాతన ధర్మ ఔన్నత్యమే!

No comments:

Post a Comment