బ్లాక్ మనీ నిరోధానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు. నేటి (నవంబర్ 8) అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్ల ముద్రణ రద్దు చేస్తున్నట్టు మోదీ వెల్లడించారు. బ్లాక్ మనీ నిరోధానికి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ తెలిపారు.
మోదీ సంచలన నిర్ణయాలు..
* రూ.500, రూ.1000 నోట్లు రద్దు
* ఈ అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్ల ముద్రణ రద్దు
* డిసెంబర్ 31వ తేదీలోగా 500, 1000 నోట్లు మార్చుకునే అవకాశం
* మీ దగ్గరున్న రూ.500, రూ1000 నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేయాలి
* రేపు, ఎల్లుండి(నవంబర్ 9,10) ఏటీఎంలు బంద్
* రోజుకి 10వేలకు మించి విత్ డ్రా చేయకూడదు
* వారానికి 20వేలకు మించి విత్ డ్రా చేయకూడదు
* బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి
* నల్లధనం అరికట్టేందుకు మోదీ సర్కార్ సంచలన నిర్ణయం
* త్వరలో రూ.2వేల నోట్లు చలామణిలోకి వస్తాయి
* ఏటీఎం నుంచి రోజుకి రూ.2వేలు మాత్రమే విత్ డ్రా చేయగలం
* నవంబర్ 11వ తేదీ వరకు అన్ని పెట్రోల్ బంకుల్లో రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయి
* నవంబర్ 11వ తేదీ వరకు వైద్య సేవలకు, రైల్వే టికెట్లకు రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయి
* డిసెంబర్ 31వ తేదీలోగా జమ చేయనివారు ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయొచ్చు
* త్వరలో కొత్త రూ.500, రూ2000 నోట్లు చలామనిలోకి వస్తాయి
* ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలపై ఎలాంటి షరతులు లేవు
* దుర్మార్గుల చేతుల్లోని రూ.500, రూ.1000 నోట్లు ఇక చిత్తు కాగితాల్లా మారతాయి.
No comments:
Post a Comment