బంగారం పై వదంతులను నమ్మొద్దు
బంగారం పై కొన్ని తెలుగు ఛానళ్లు రకరకాల వదంతులు వ్యాపింపచేస్తున్నట్లు, తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టి కి వచ్చింది. నల్ల ధనం పై మోడీ తలపెట్టిన పోరాటాన్ని దెబ్బ తీసేందుకు కొందరు పనికట్టుకొని ఈ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టవలసిందిగా ప్రజలకు, ముఖ్యంగా యువతకు నేను పిలుపునిస్తున్నాను.
స్త్రీ ధనం, వారసత్వంగా లభించిన బంగారం, ఇప్పటికే మీ దగ్గరున్న బంగారం ఫై ఆందోళన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం/ ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. నవంబర్ 8, 2016 తర్వాత కిలోల కొద్దీ బంగారాన్ని నల్ల ధనం ఉపయోగించి కొన్న వారికే ఆందోళన ఉండాలి కానీ, మిగతా ఆడపడుచులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐ.టి. యాక్ట్ లో మొన్న చేసిన అమెండ్మెంట్ నల్ల ధనానికే పరిమితం. కొత్తగా బంగారం పై ఎలాంటి ఆంక్షలను మా ప్రభుత్వం విధించలేదు.
బంగారం పై కంగారు పడాల్సిన అవసరం లేదని ఆడపడుచులందరికీ నా విజ్ఞప్తి. ఎవరూ మీ ఇంటికి రారు. మీ బంగారాన్ని తాకరు. నిశ్చింతగా ఉండండి.
No comments:
Post a Comment