- విద్యావ్యవస్థలో మార్పులకు నిపుణుల కమిటీ
నెల్లూరు (సాంస్కృతికం), ఏప్రిల్ 18 : రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేయదలుచుకుందని, అందుకు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేసిందని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం నెల్లూరులో ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమాఖ్య కూచిపూడి నాట్యవైభవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాలలోనూ రాణించేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకోసం ఈ నెల 24న నెల్లూరులో రాష్ట్రస్థాయి విద్యాసదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యాపరంగా, పర్యాటకపరంగా సంస్కృతి, సాంప్రదాయాలకు విలువనిచ్చేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రానికి ఏడు జాతీయ విద్యాసంస్థలు మంజూరయ్యాయని అందులో మూడింటికి భూమి పూజలు చేశామని మిగిలిన విద్యాసంస్థలకు స్థలాల పరిశీలన పూర్తి అయిందన్నారు. హైదరాబాద్ 30 ఎంసెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందన్నారు
No comments:
Post a Comment