ుచేలుడు కృష్ణునికి పెట్టలేదు పెట్టనిస్తే కదా! కృష్ణుడు. ఎన్నాళ్ళకు వచ్చావోయ్ కుచేలా? అంటూ కౌగలించుకున్నాడు. తీసుకుని వచ్చి కూర్చోపెట్టాడు. బంగారు పాత్ర తెచ్చి రుక్మిణీదేవిని నీళ్ళు పొయ్యమని కాళ్ళు కడిగాడు. ఆ నీళ్ళు తాను రుక్మిణీదేవికి పరివారము అందరికి తలమీద చల్లాడు
చందనము తీసుకుని వచ్చి వళ్ళంతా రాసాడు. అగరు ధూపము వేసాడు. కమ్మటి భోజనము పెట్టాడు. విసనకర్ర తీసుకుని వచ్చి విసిరాడు. మన గురువు సాందీప ముని గుర్తు ఉన్నాడా? మహానుభావుడయ్యా మన గురువు సా0దీపముని.
వేదపఠనము చేసినటు వంటి కుటుంబములో పుట్టిన సుశీల నీకు తగిన భార్య. ఎంత దరిద్రము వచ్చినా భర్తను నారాయణమూర్తి అని గౌరవించినది. నీకు భార్యతో పిల్లలతో సంబంధము లేదు. నీలో నువ్వు మురిసిపోతుంటావు. నాసంగతి నీకు తెలుసు. నీది ఎంత భక్తో నాకు తెలుసు. నేను ఎందుకు కర్మ చేస్తానో నీకు తెలుసు నీ గుండెలో ఏమున్నదో నాకు తెలుసు అంటూ మిత్రుని కౌగలించుకుని స్నేహితుని దగ్గరకు వెళుతున్నానని ఏదో తెచ్చిఉంటావు అని వెతకి వెతకి అటుకుల మూట విప్పుతుంటే కుచేలుడు సిగ్గుపడిపోయాడు. యితడు లక్ష్మీనాధుడు ఈ దిక్కుమాలిన అటుకులు పెట్టాలా ఏమిటి? అనుకున్నాడు. కృష్ణుడు గబగబా గుప్పెడు అటుకులు చేతిలోకి తీసుకుని పరమ సంతోషముతో నమిలి తినేసి ఏదీ మరొక్క పిడికెడు పోసుకుంటాను అని పోసుకుని తినపోతుంటే రుక్మిణీదేవి వచ్చి చెయ్యి పట్టుకుని ఒక్క పిడికెడు ఏమి ఇచ్చారో నాకు తెలుసు ఇంకొక్క పిడికెడు తింటే నన్ను కూడా ఇచ్చేస్తారు అన్నది. కుచేలుడు నాకు ఇది ఇమ్మని అడగలేదు. భాగవతములో ఎక్కడా కుచేలుడు తన దరిద్రము చెప్పలేదు. వెళ్ళిపోతూ అనుకున్నాడు. ఇంత ఉన్నవాడు నాకు ఏమీ ఇవ్వలేదే అని వెంటనే ఆనందముతో చిందులు వేసాడు. ఔనులే నాకు డబ్బిస్తే అనవసరపు వ్యామోహములలోపడి ఆయన పాదములు వదిలేస్తానని ఇవ్వకుండా నన్నుకాపాడాడు. కృష్ణా ! నన్ను ధన్యుని చేసావు అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇచ్చానని కృష్ణుడు చెప్పలేడు ఇవ్వమని కుచేలుడు అడగ లేదు. తన ఇంటికి వెళ్లేసరికి పూరిపాక స్థానములో పెద్ద హర్మ్యము కనపడింది. ఏ మహానుభావుని నిలయమో ఎవరు ఉంటారో. అందులోనుంచి బయటికి వస్తున్న దాసీజనము అన్ని ఆభరణములు పెట్టుకున్నారంటే యజమాని యజమాను రాళ్ళు ఎంత గొప్పవాళ్ళో అనుకున్నాడు.ఇంతలో ఒకావిడ వచ్చినాధా! నమస్కారము అన్నది తప్పమ్మా ! అలా అనకూడదు మీరెవరు? అన్నాడు. నేను మీ భార్యను అన్నది. వంటినిండా బంగారు ఆభరణములే సరిగంచు పట్టు చీర. ఎక్కడివి? అన్నాడు. ఎసమయములో కృష్ణుడు అటుకులు నోట్లో పోసుకున్నాడో ఆ సమయములో ఇక్కడ ఐశ్వర్యము వచ్చింది. ఐశ్వర్యము ఉన్నా కుచేలుని కృష్ణుడు రక్షించాడు. ఐశ్వర్యము ఉన్నా భక్తి పాడవకుండా వరము ఇచ్చి తనలో కలుపుకున్నాడు. ఇప్పటికి భేంట్ ద్వారక అని మనము వెళ్ళి దర్శనము చేస్తుంటాము. కుచేలుడు రక్షింపబడటానికి కారణము బ్రాహ్మణుడిగా బ్రాహ్మణ ధర్మము మాత్రమే అనుష్టించాడు.
చందనము తీసుకుని వచ్చి వళ్ళంతా రాసాడు. అగరు ధూపము వేసాడు. కమ్మటి భోజనము పెట్టాడు. విసనకర్ర తీసుకుని వచ్చి విసిరాడు. మన గురువు సాందీప ముని గుర్తు ఉన్నాడా? మహానుభావుడయ్యా మన గురువు సా0దీపముని.
వేదపఠనము చేసినటు వంటి కుటుంబములో పుట్టిన సుశీల నీకు తగిన భార్య. ఎంత దరిద్రము వచ్చినా భర్తను నారాయణమూర్తి అని గౌరవించినది. నీకు భార్యతో పిల్లలతో సంబంధము లేదు. నీలో నువ్వు మురిసిపోతుంటావు. నాసంగతి నీకు తెలుసు. నీది ఎంత భక్తో నాకు తెలుసు. నేను ఎందుకు కర్మ చేస్తానో నీకు తెలుసు నీ గుండెలో ఏమున్నదో నాకు తెలుసు అంటూ మిత్రుని కౌగలించుకుని స్నేహితుని దగ్గరకు వెళుతున్నానని ఏదో తెచ్చిఉంటావు అని వెతకి వెతకి అటుకుల మూట విప్పుతుంటే కుచేలుడు సిగ్గుపడిపోయాడు. యితడు లక్ష్మీనాధుడు ఈ దిక్కుమాలిన అటుకులు పెట్టాలా ఏమిటి? అనుకున్నాడు. కృష్ణుడు గబగబా గుప్పెడు అటుకులు చేతిలోకి తీసుకుని పరమ సంతోషముతో నమిలి తినేసి ఏదీ మరొక్క పిడికెడు పోసుకుంటాను అని పోసుకుని తినపోతుంటే రుక్మిణీదేవి వచ్చి చెయ్యి పట్టుకుని ఒక్క పిడికెడు ఏమి ఇచ్చారో నాకు తెలుసు ఇంకొక్క పిడికెడు తింటే నన్ను కూడా ఇచ్చేస్తారు అన్నది. కుచేలుడు నాకు ఇది ఇమ్మని అడగలేదు. భాగవతములో ఎక్కడా కుచేలుడు తన దరిద్రము చెప్పలేదు. వెళ్ళిపోతూ అనుకున్నాడు. ఇంత ఉన్నవాడు నాకు ఏమీ ఇవ్వలేదే అని వెంటనే ఆనందముతో చిందులు వేసాడు. ఔనులే నాకు డబ్బిస్తే అనవసరపు వ్యామోహములలోపడి ఆయన పాదములు వదిలేస్తానని ఇవ్వకుండా నన్నుకాపాడాడు. కృష్ణా ! నన్ను ధన్యుని చేసావు అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇచ్చానని కృష్ణుడు చెప్పలేడు ఇవ్వమని కుచేలుడు అడగ లేదు. తన ఇంటికి వెళ్లేసరికి పూరిపాక స్థానములో పెద్ద హర్మ్యము కనపడింది. ఏ మహానుభావుని నిలయమో ఎవరు ఉంటారో. అందులోనుంచి బయటికి వస్తున్న దాసీజనము అన్ని ఆభరణములు పెట్టుకున్నారంటే యజమాని యజమాను రాళ్ళు ఎంత గొప్పవాళ్ళో అనుకున్నాడు.ఇంతలో ఒకావిడ వచ్చినాధా! నమస్కారము అన్నది తప్పమ్మా ! అలా అనకూడదు మీరెవరు? అన్నాడు. నేను మీ భార్యను అన్నది. వంటినిండా బంగారు ఆభరణములే సరిగంచు పట్టు చీర. ఎక్కడివి? అన్నాడు. ఎసమయములో కృష్ణుడు అటుకులు నోట్లో పోసుకున్నాడో ఆ సమయములో ఇక్కడ ఐశ్వర్యము వచ్చింది. ఐశ్వర్యము ఉన్నా కుచేలుని కృష్ణుడు రక్షించాడు. ఐశ్వర్యము ఉన్నా భక్తి పాడవకుండా వరము ఇచ్చి తనలో కలుపుకున్నాడు. ఇప్పటికి భేంట్ ద్వారక అని మనము వెళ్ళి దర్శనము చేస్తుంటాము. కుచేలుడు రక్షింపబడటానికి కారణము బ్రాహ్మణుడిగా బ్రాహ్మణ ధర్మము మాత్రమే అనుష్టించాడు.
No comments:
Post a Comment