UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 14 July 2015

రాజమండ్రి విషాదం పాపం ప్రవచనకర్తలదే !
  • ఆధ్యాత్మికత పేరిట అజ్ఞాన ప్రచారం
  • నదిలో మట్టి వేయడం సముద్ర స్నానానికి సంబంధించింది
  • మంగళవారంనాటి ఘోరంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి స్పందన
హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రిలో పుష్కర భక్తులు చనిపోవడం పూర్తిగా ప్రభుత్వం తప్పు కాదని ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చలో పాల్గొన్న ఆయన ఈ ఘోరానికి కారణం ప్రవచనకర్తలదేనని స్పష్టంచేశారు. ఆధ్యాత్మికతకు బదులు అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన అభిప్రాయాల్లో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
  • ఇవి మహాపుష్కరాలు అనేది పెద్ద తప్పు. మహా అంటే 1212.. 144 అన్నారు. దీన్ని మహాపుష్కరాలని ఎలా చెప్తారు? పోనీ గోదావరి పుట్టుక నుంచి లెక్కపెట్టారనుకుంటే నది పుట్టుకను ఎలా లెక్కిస్తారు? మహా పుష్కరాలన్నమాట ఎవరు ప్రచారం చేశారో వాళ్లంతా దీనికి బాధ్యులే. పైగా.. ‘‘ఇది 144 ఏళ్లకొకసారి వస్తుంది. మళ్లీ 144 ఏళ్ల వరకూ మనం బతికుంటామో బతికుండమో? ఇప్పుడు మునక్కపోతే పిశాచి జన్మ ఎత్తుతాం. రాక్షస జన్మెత్తుతాం’’.. ఇలా కొందరు ప్రచారం చేశారు. పుష్కరాల్లో స్నానం పుణ్యం వస్తుందని చెబితే సరే! కానీ... చేయకపోతే మహాపాపం చుట్టుకున్నట్టే, జన్మ మొత్తం వ్యర్థం.. అని ప్రవచన చక్రవర్తులు చెప్పడమే దారుణం.
  • జ్ఞానప్రధానమైన మన సంస్కృతిని స్నాన ప్రధానమైన సంస్కృతి చేసేస్తున్నారు. ఉపనిషత్తులు చెప్పిన జాతి చేత ఇవాళ ఉప్పూ ఊరగాయ అమ్మిస్తున్నారు.
  • నిజంగా మన సంస్కృతిలో ఎలాంటి స్నానం చేయాలో భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు చెప్పాడు. ‘ఆత్మ జ్ఞానం అనే నదిలో స్నానం చేయాలి. ఓపిక, సంయమనం, ఇంద్రియ నిగ్రహం అనే నీటిని మనసులో నింపుకోవాలి. సత్యమే దాన్నుంచి ప్రవహించే మడుగు. అందులో దయాగుణం కెరటాలు. దానికి అటూ ఇటూ ఉండే గట్టులే శీలం. ఇలా మన ప్రవర్తనను మార్చుకోమని సంస్కృతి చెబుతోంది. కానీ... ‘మునుగు - మొత్తం మారిపోతుంది.. తేలు-అంతకంటే మారిపోతుంది’ అంటున్నారు. అవినీతిపరులు, బ్లాక్‌ మార్కెటీర్లు, స్మగ్లర్లు వీళ్లందరినీ పట్టుకెళ్లి ముంచమని ఈ పెద్ద మనుషులకు చెప్పండి! ఎవరైనా మారతారేమో చూస్తాను.
  • పుష్కరాల్లో స్నానం చేసేవారు ‘పిప్పలాదాత్‌’ అనే పద్యం చదువుతూ మూడు గుప్పిళ్ల మట్టి నదిలో వేయాలని చెబుతున్నట్టు విన్నాను. ఈ అజ్ఞానానికి కారణమైన కథ వేరే ఉంది. అదేంటంటే.. పిప్పలాదుడు దధీచి మహర్షి కుమారుడు. ఆయన తన ఎముకలను దేవతలకు ఆయుధంగా ఇచ్చేస్తాడు. అప్పటికి ఆయన భార్య గర్భిణి. తన గర్భాన్ని తానే మోదుకుని పిండాన్ని బయటకు లాగేసి, దాన్ని పిప్పల వృక్షం దగ్గర పెడుతుంది. ‘నీ తండ్రిని దేవతలు చంపారు. కక్ష తీర్చుకోవడమే నీ లక్ష్యం’ అని చెప్పి అగ్ని ప్రవేశం చేసి చనిపోతుంది. ఆ బిడ్డను రావిచెట్టు చంద్రకిరణాల ఆహారంగా పెంచుతుంది. ఆ శిశువు పెద్దయ్యాక శివుడి గురించి తపస్సు చేసి మెప్పించగా.. శివుడు కృత్య అనే రాక్షసిని సృష్టించాడు. దేవతలను ఆహారంగా తీసుకోమని కృత్యకు అనుమతిస్తాడు. అది దేవతలను చాలామందిని సంహరించింది. కృత్య దేవతలను సంహారం చేస్తుంటే దేవతలు శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు వచ్చి ‘నీ పనైపోయింది కదా, ఇంత క్రోధం వద్దు’ అని పిప్పలాదుడికి చెప్తే ఆయన కృత్యను బంగారు కలశంలో పెట్టి సముద్రంలో స్థాపన చేశాడు. అది ఆకలితో అలమటించడమనే సమస్యే లేదు. ఆ కృత్య ఆహారానికి, పుష్కర స్నానానికీ సంబంధం లేదు. ఇది సముద్రస్నానానికి సంబంధించిన విషయం. జరిగిన ఘట్టానికి గుర్తుగా ఆ శ్లోకం చదువుకుని నమస్కారం పెట్టుకుని స్నానం చేయాలంతే. పైగా ఆ శ్లోకం పుష్కర స్నానానికి సంబంధించింది కాదు. కానీ కథేం ప్రచారం చేస్తున్నారంటే.. ‘అది లేవగానే ఆకలి-ఆకలి అంటుందని... పుష్కర స్నానం చేసేవారిలో మట్టి వేయని వారి పుణ్యఫలాలన్నీ హరిస్తుందని చెబుతున్నారు. ఇది అభూతకల్పన. పురాణాలు చదవకుండా, సంస్కృతం రాకుండా చెబుతున్నమాట.

No comments:

Post a Comment