ఆయనకు కావలిసింది తుచ్చమైన రాజకీయాలు కాదు…వనరులను, భావితరాల భవిష్యత్తును దోచుకుని తినే నాయకులు అంతకంటే కాదు…సొంత కుల ప్రయోజనాలకోసం ప్రజల ఆస్తులనే రాక్షసంగా దోచిపెట్టే ప్రభుత్వ ప్రతినిధులు కానే కాదు.
విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ…ప్రజా సంపద, వనరులను కాపాడుతూ….భావి తరాల మనుగడ కోసం సరైన ప్రణాలికలను రచించి వాటి లక్ష్యాలు కోసం పోరాడుతూ…సమాజాన్ని చైతన్య వంతంగా నడిపించి ప్రజల కలలను సాకారం చేస్తూ…ప్రజల నమ్మకాన్ని, భవితను మోస్తూ ప్రజలు గర్వ పడే విధంగా ఉండే ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు కావాలనేదే ఆయన ధ్యేయం.
ఇవన్నీ సాధించడం ప్రస్తుత సమాజంలో అంత సులువు కాదు. డబ్బు, కుల బలం, కుట్ర పూరిత రాజకీయాలు నడుస్తున్న కలికాలం ఇది. కానీ ఇవన్నీ చూస్తూ ఊరుకోవడం కన్నా సమాజంలో ఉన్న రాజయకీయ వ్యవస్థను ఎంతోకొంత ప్రభావితం చేసి ఓ పౌరిడిగా రుణం తీర్చుకోవాలని అనుకున్నాడు. రాజకీయాలలోకి ప్రవేశించాడు. తన అభిమానులను, ప్రజలను ప్రభావితం చేసి తన మద్దతు ఇచ్చిన కూటమిని గెలిపించాడు. అయినా అనుకున్న మార్పు వచ్చిందా అంటే…సమాధానం కష్టమే.
ఆయన మద్దుతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలే ‘ఏరు దాటిన తరువాత తెప్ప తగలయ్యడమే’ అన్న మాదిరిగా ప్రవర్తిస్తూ ఉన్న నేపధ్యంలో…ఆయనలో ఆవేదన మళ్ళీ మొదలైంది. ప్రజల తరపున పోరాడడానికి సిద్దమవ్వాలసిన పరిస్తితి నెలకొంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా పోరాడేది మాత్రం ఆపేది లేదు అన్న సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతున్నాడు. ప్రజలూ ఆయన ఆవేదనని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టారు. ఆయనకు సొంత మీడియా సపోర్ట్ లేకపోయినా…సోషల్ మీడియా సపోర్ట్ దండిగా ఉండడంతో ఇప్పుడు చర్చ అంతా ఆ వ్యక్తి గురించే. ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ఆయన మీద ప్రజల్లో ఏదో మార్పు తీసుకువస్తాడన్న నమ్మకం, ఆశ ఉన్నాయనేది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తను మద్దతు ఇచ్చిన పార్తీలనే ప్రజా వ్యతిరేక చర్యలు చేపడతన్నందుకు ప్రశ్నిస్తుండడం ప్రజలకు ఆయన మీద విశ్వాసం పెంచుతుంది.
ఇక ఆయన తాజాగా ట్విట్టర్ లో ఆవేదనగా స్పందించిన విదానం చూసి సోషల్ మీడియాలో ఆయనమీద ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తాజా ట్వీట్ ను గమనిస్తే…”యువతరానికి ఏ సంపద విడిచి పెట్టాం..యుద్ధము, రక్తము కన్నీరు తప్ప,గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు కలలు కలలు తప్ప,పిరికితనం మోసం తప్ప,” అని పవన్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ప్రతి అక్షరము లోనూ ఎంతో ఆవేదన కనిపిస్తుంది. ఈ ట్వీట్ ను గమనిస్తే ప్రతి అక్షరమూ నిజమే కదా అని మనకూ అనిపిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అదే పేదరికం, అదే అరాచకం, అదే అవినీతి తప్ప మార్పు మాత్రం శూన్యంగానే ఉంది. వీటన్నిటిపై ఆవేదన చెందే పవన్ ఈ ట్వీట్ చేశారని అనిపిస్తుంది.
అంతే కాదు..పవన్ తాజా స్పందన చూస్తుంటే రాజకీయ ప్రణాలికలు రచిస్తున్నట్లే కనిపిస్తుంది. ఇక త్వరలో ప్రజల్లోకి డైరెక్ట్ గా వచ్చి సమస్యలపై పోరాడాలనేది ఆయన మాటలను బట్టి స్పష్టమవుతుంది.
మరి ప్రస్తుత రాజకీయాలను పవన్ ఏ మేర ప్రభావితం చేస్తాడో అన్న ఆశక్తీ ప్రజల్లో బలంగా నెలకొంది.
No comments:
Post a Comment