భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 6
తక్షశిల
శ్రీరామచంద్రుని తమ్ముడగు భరతుని కుమారుడు నిర్మించిన నగరమైనందువల్ల ఈ నగరమునకు తక్క్షశిల అన్న పేరు వచ్చినదన్నది పురాణ ప్రసిద్ధము. తక్షుడు పునాదిరాయిని ఈ నగరానికి వేసినాడు కాబట్టి ఈ నగరము ఆ పేరు కలిగి యుండవచ్చు. ఈ నగరపు ప్రస్తాపన మస్త్య పురాణములో కనబడుతుంది. ధర్మజుని పురోహితుడు ధౌమ్యుడు ఇచ్చట ఆచార్యునిగా వుండినాడని వ్యాస భారతము తెలుపుతుంది. నేటి శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారము క్రీ.పూ. 2550-2288 నకే ఈ నగరము వున్నదని నిర్ధారించినారు. శంఖున పడనిదే తీర్థము కాదుగదా!క్రీ.శ. 5 వ శతాబ్దము వరకు దేశీయ విదేశీయ రాజుల చేతులు మారినా ఈ నగరము సజావుగానే వుండినది.
క్రీ.శ. 460–470 మధ్యకాలములో హూణుల దండయాత్రలచే ఈ జగత్ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయ నగరము నేలమట్టమైపోయినది. చంద్రగుప్తమౌర్యుని గురువైన విష్ణుగుప్తుడు (కౌటిల్యుడూ,చాణక్యుడు ) ఇక్కడ ఆచార్యునిగా పనిజేసినాడు.
ఇక ఇక్కడి గ్రంథములు బహుశ లక్షలలో వుండియుండ వచ్చునేమో దహనమైపోయివుంటాయి.
అసలింకొక ముఖ్యమైన విషయమున్నది. క్రీ.శ.1863–64 మరియు 1872–73 లో అల గ్జాండర్ కన్నింగ్ హాం( Alexander Cunningham ) అన్న చారిత్రిక పరిశోధకుడు తన పశొధన ఫలితాన్ని బహిర్గతము చేయకుండియుంటే భారతీయులమైన మనము తప్ప ప్రపంచము తక్షశిల వుండినది అన్న విషయము పుక్కిటి పురాణము ఆని తృణీకరించేవారు. ఎందువల్లనంటే అంతకు ముందువరకూ తృణీకరించినారు కాబట్టీ! దోచుకొన్న వారిని నమ్మినంతగా దాచియుంచిన మన పూర్వీకులను నమ్ముట లేదు. ఇది మన దౌర్భాగ్యము. మన పూర్వులు సత్య వ్రతులు, ధర్మ నిష్ఠా గరిష్ఠులు.
క్రీ.శ. 460–470 మధ్యకాలములో హూణుల దండయాత్రలచే ఈ జగత్ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయ నగరము నేలమట్టమైపోయినది. చంద్రగుప్తమౌర్యుని గురువైన విష్ణుగుప్తుడు (కౌటిల్యుడూ,చాణక్యుడు ) ఇక్కడ ఆచార్యునిగా పనిజేసినాడు.
ఇక ఇక్కడి గ్రంథములు బహుశ లక్షలలో వుండియుండ వచ్చునేమో దహనమైపోయివుంటాయి.
అసలింకొక ముఖ్యమైన విషయమున్నది. క్రీ.శ.1863–64 మరియు 1872–73 లో అల గ్జాండర్ కన్నింగ్ హాం( Alexander Cunningham ) అన్న చారిత్రిక పరిశోధకుడు తన పశొధన ఫలితాన్ని బహిర్గతము చేయకుండియుంటే భారతీయులమైన మనము తప్ప ప్రపంచము తక్షశిల వుండినది అన్న విషయము పుక్కిటి పురాణము ఆని తృణీకరించేవారు. ఎందువల్లనంటే అంతకు ముందువరకూ తృణీకరించినారు కాబట్టీ! దోచుకొన్న వారిని నమ్మినంతగా దాచియుంచిన మన పూర్వీకులను నమ్ముట లేదు. ఇది మన దౌర్భాగ్యము. మన పూర్వులు సత్య వ్రతులు, ధర్మ నిష్ఠా గరిష్ఠులు.
నలందా
నలందా తక్షసిల తరువాత అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయము. ఉన్నత విద్యార్జనకు దేశవాసులేకాక చైనా టిబెట్టూ,గ్రీసు, పర్షియా మొదలగు ఎన్నో విదేశములనుండి కూడా విద్యార్థులు వచ్చిఏవారు.5వ శతాబ్దము మొదలు 12వ శతాబ్దము వరకు ఇది మత, సాంస్కృతిక, ఉన్నత విద్యార్జన కేంద్రము. దీని విస్తారము 14 హెక్టేరులు ( One Hectare = 100 acres or 10,000^2 mtrs). దాదాపు 7 శతాబ్దముల కాలము ఇది మెధోనిలయము. ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దిన్ ఐబాక్ యొక్క సైన్యాధిపతియైన భక్తియార్ ఖిల్జి నలందా మరియు విక్రమశిల విశ్వవిద్యాలయములను అగ్నికీలలకు ఆహుతి చేసిన దుర్మార్గుడు. వేనకువేల్ట. అన్ని నెలలూ ప్రళయకాల మందు కళ్ళు పొడుచుకొన్నా కనిపించని కరి మబ్బులు కమ్ముకొనంట్లు బీహారు ప్రాంతము వుండిపోయిందట. ఎన్ని లక్షల గ్రంథములు అగ్నికి సమిధలైనాయో చెప్పుట కష్టము. ఇవి కట్టు కథలు కావు చారిత్రిక సత్యములు. బౌద్ధ చైత్యములు,ఆరామములు ఎన్ని నాశనము చేసినాడో చెప్పుట కష్టము. ఈ విషయములను మనము సాంఘీక శాస్త్రములో పాఠ్యాంశముగా విన్నామా !
ఇది చాలా క్లుప్తమైన వివరణ. అసలీ విషయముల నెందుకు చెబుతున్నానా అన్న సందేహము జిజ్ఞాసువు శ్రద్ధాళువు అయిన పాఠకునికి తప్పక కలుగుతుంది. నేను ఈ విషయాలను ఎందుకు చెప్పుకొచ్చినానతే ఇటువంటి మహత్తర సంస్కృతి, సంస్కృత సంపద చరిత్రకందకుండా వుండిపోయినది ఎంత పోగొట్టుకున్నామో!
ఈ విధంగా విద్యాలయాలనేకాక, గ్రంథములు గ్రంథాలయములను కుప్పలు తెప్పలుగా కాల్చి పారవేసినారు.కొందరు మహనీయులు ప్రాణాలకు తెగించి కాపాడిన గ్రంథములే ఇప్పుడు అందుబాటులోవుండేవి. అయినా ఈ సంస్కృత సాహిత్యము ఆంగ్ల సాహిత్యముకన్నా నేటికీ ఎక్కువే!
"సమరాంగణ సూత్రధార నాటి ఆవిష్కరణల యదార్థ దర్పణము.ఇందులో వాయుయాన విశేషములను అన్నికోణములలో పరిశీలించి విశ్లేషింపబడినది. ఒకవేళ దీనిని కల్పితగాధగా భావించితే ఇంతవరకు ఇంతకుమించిన కాల్పనిక గాధ ఎవరూ వ్రాయలేదు." అన్నాడు పాశ్చాత్య చరిత్ర కారుడు అండ్రూ థామస్.
ఆక్స్ ఫొర్డ్ విశ్వవిద్యాలయపు ప్రముఖ ఆచార్యుడు సంస్కృత పండితుడు అయిన V.R.రామచంద్రన్ దీక్షితర్ తన "“War in Ancient India in 1944 “, లో " ఈ సాహిత్యమునంతయును అనాలోచితముగా ,పరిశీలనా రహితముగా కట్టుకథయని తెలుపుట ఫాశ్చాత్య చారిత్రికులేకాకుండా వారి అంధ సమర్థకులైన ప్రాచీ (తూర్పు అంటే మనము ఇంకా నేపాల్, టిబెట్టు,చైనా, మొదలగు దేశాలు) దేశ చారిత్రికులు కూడా ఈ రచనలను కట్టుకథలుగా వాకృచ్చినారులేక వ్యాఖ్యానించినారు.అసలు భారతీయ విమాన శాస్త్ర గ్రంథములను,వాయు యాన యంత్రములను, కల్పనలుగా కొట్టిపారవేసినారు.
భోజరాజు వ్రాసిన "సమరాంగణ సూత్రధార" ఇటీవలి కాలములో లభించుట చేత , అందులో 230 శ్లోకములతోనిండిన ఒక అధ్యాయము పూర్తిగా వివిధ వ్యోమనౌకలను తత్సంబంధమైన వివిధ యంత్రములను గూర్చి, వానిని సైనిక బలము వుపయోగించు విధివిధానములను గూర్చిన వివరణ ఇవ్వబడినది.
ఈ విషయము తెలిపినది ఆంగ్లములో Bermuda Triangle వంటి బహు గ్రంథ రచయితయైన యైన Charles Berlitz ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన Berlitz schools వ్యవస్థాపకుడు Berlitz మనవడు. ( సేకరణ : Doomsday 1999 - By Charles Berlitz p. 123-124).
ఆక్స్ ఫొర్డ్ విశ్వవిద్యాలయపు ప్రముఖ ఆచార్యుడు సంస్కృత పండితుడు అయిన V.R.రామచంద్రన్ దీక్షితర్ తన "“War in Ancient India in 1944 “, లో " ఈ సాహిత్యమునంతయును అనాలోచితముగా ,పరిశీలనా రహితముగా కట్టుకథయని తెలుపుట ఫాశ్చాత్య చారిత్రికులేకాకుండా వారి అంధ సమర్థకులైన ప్రాచీ (తూర్పు అంటే మనము ఇంకా నేపాల్, టిబెట్టు,చైనా, మొదలగు దేశాలు) దేశ చారిత్రికులు కూడా ఈ రచనలను కట్టుకథలుగా వాకృచ్చినారులేక వ్యాఖ్యానించినారు.అసలు భారతీయ విమాన శాస్త్ర గ్రంథములను,వాయు యాన యంత్రములను, కల్పనలుగా కొట్టిపారవేసినారు.
భోజరాజు వ్రాసిన "సమరాంగణ సూత్రధార" ఇటీవలి కాలములో లభించుట చేత , అందులో 230 శ్లోకములతోనిండిన ఒక అధ్యాయము పూర్తిగా వివిధ వ్యోమనౌకలను తత్సంబంధమైన వివిధ యంత్రములను గూర్చి, వానిని సైనిక బలము వుపయోగించు విధివిధానములను గూర్చిన వివరణ ఇవ్వబడినది.
ఈ విషయము తెలిపినది ఆంగ్లములో Bermuda Triangle వంటి బహు గ్రంథ రచయితయైన యైన Charles Berlitz ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన Berlitz schools వ్యవస్థాపకుడు Berlitz మనవడు. ( సేకరణ : Doomsday 1999 - By Charles Berlitz p. 123-124).
మన ప్రియతమ నాయకుడైన అబ్దుల్ కలాం గారే ఈవిధంగా అంటున్నారు" ఆధునిక ఆవిష్కరణలకొరకు మన భారతీయ సాహిత్యము యువకులు తప్పనిసరిగా చదివి తీరవలెను."
ఈ విషయములన్నీ ఎందు వలన చెప్పవలసి వచ్చిందంటే ఇంత పొగొట్టుకొన్నా తల్పాడే తపన ఎంత గొప్పవాడొ అర్థము చేసుకొనండి. మన గ్రంథములు ఎంతటి సంపద కలిగి యుండినవో గమనించండి.
రామాయణ భారత భాగవతాది ఇతిహాస పురాణములలో విమానముల ప్రసక్తి ఉన్నదంటె అంతా కల్పన అని కొట్టిపారయేయ వీలౌతుందా! ఒకవేళ ఎవరైనా బైబిల్ వంటి మత గ్రంథములలో వున్నదంటె మరి అటువంటి యంత్రముల ఆవిష్కరణ బైబిల్ కాలములో వున్నదని గ్రంధాధారములతో చూపించగలరా!
మతాతీతంగా మనమంతా భారతీయులమే ! మొదట ఆభావన మనలో ఏర్పడితే మన పూర్వీకులు ఎంత సత్యసంధులో, ఎంత నిష్ఠా గరిష్టులో మనకు అర్థమౌతుంది.
ఈ విషయములన్నీ ఎందు వలన చెప్పవలసి వచ్చిందంటే ఇంత పొగొట్టుకొన్నా తల్పాడే తపన ఎంత గొప్పవాడొ అర్థము చేసుకొనండి. మన గ్రంథములు ఎంతటి సంపద కలిగి యుండినవో గమనించండి.
రామాయణ భారత భాగవతాది ఇతిహాస పురాణములలో విమానముల ప్రసక్తి ఉన్నదంటె అంతా కల్పన అని కొట్టిపారయేయ వీలౌతుందా! ఒకవేళ ఎవరైనా బైబిల్ వంటి మత గ్రంథములలో వున్నదంటె మరి అటువంటి యంత్రముల ఆవిష్కరణ బైబిల్ కాలములో వున్నదని గ్రంధాధారములతో చూపించగలరా!
మతాతీతంగా మనమంతా భారతీయులమే ! మొదట ఆభావన మనలో ఏర్పడితే మన పూర్వీకులు ఎంత సత్యసంధులో, ఎంత నిష్ఠా గరిష్టులో మనకు అర్థమౌతుంది.
అనంతమైన వేదములనుడి ఎన్నో ఆవిష్కరణలలో ఎంతో స్పూర్తిని పొంది ఎన్నెన్నో శాస్త్ర గ్రంథములు రచించినారు మన పూర్వులు. ఇందులో సందేహము లేదు. అందులోని ఒక భాగమే పలువురు శాస్త్రజ్ఞుల కృషి ఈ విమాన శాస్త్ర గ్రంథాలు.
వారి మీద ఆ నమ్మకముతో నాకు తెలిసిన ,చదివిన,తెలుసులొన్న మేరకు మనవారి విమాన శాస్త్ర విజ్ఞానమును మీ ముందు వుంచుచున్నాను.
వారి మీద ఆ నమ్మకముతో నాకు తెలిసిన ,చదివిన,తెలుసులొన్న మేరకు మనవారి విమాన శాస్త్ర విజ్ఞానమును మీ ముందు వుంచుచున్నాను.
ఈ విషయము 15వ తేదే తరువాత కొనసాగిస్తాము......
No comments:
Post a Comment