
కొలువుల జాతర
-15522 పోస్టులకు ఆమోదం.. త్వరలో మరో 10 వేల పోస్టులు
-గ్రూప్స్ పరీక్షా విధానాన్ని విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
-గ్రూప్-1, 2లో తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేక పేపర్లు
-తెలంగాణ కేంద్రంగా నూతన సిలబస్
తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభమైంది. లక్ష కొలువుల నోటిఫికేన్లలో భాగంగా మొదటి విడతగా 15,522 ఉద్యోగాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొద్దిరోజుల్లోనే అధికారింగా నోటిఫికేషన్ వెలువడనుంది. అలాగే మరో 10 వేల ఉద్యోగాలకు కూడా త్వరలోనే పరిపాలన ఆమోదం లభించనుంది. అంతేగాకుండా విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్స్ పరీక్షల విధానాన్ని కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.
సిలబస్, పేపర్లు, మార్కుల విధానం ఎలా ఉంటుందో జీవో 330ని జారీ చేసింది. గ్రూప్-1లో ఆరు పేపర్లు 1000 మార్కులు (900+100), గ్రూప్-2లో 4 పేపర్లు 675 (600+75) మార్కులు, గ్రూప్-3లో 3 పేపర్లు 450 మార్కులు, గ్రూప్-4లో రెండు పేపర్లు 300 మార్కులకు పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల సిలబస్ మొత్తం తెలంగాణ చుట్టే తిరగనుంది. తెలంగాణ-సంస్కృతి, ప్రత్యేక ఉద్యమం, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, సమాజం, భౌగోళిక పరిస్థితులు తదితర అంశాలపై 50శాతం వరకు ప్రశ్నలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మారనున్న పేపర్లు, సిలబస్ ఎలా ఉంటాయో ప్రత్యేక విశ్లేషణను సబ్జెక్టు నిపుణులు అందిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లకు, యావత్ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ధన్యవాదాలు తెల్పుకోవాలి. విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందించిన కానుకగానే ఈ నూతన సిలబస్ అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు తెలంగాణ ఉద్యమం- మొబిలైజేషన్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన క్రమం వంటి ముఖ్యాంశాలుగా చదువుకోవడానికి, తెలంగాణ ప్రజలకు కానుకగానే ఈ సిలబస్ చాలా ఉపయోగపడుతుంది. అంటే తెలంగాణ సంస్కృతి-వారసత్వంను కూడా పోటీ ప్రపంచంలో ఉన్న ప్రతి అభ్యర్థి తెలుసుకొనేందుకు సిలబస్లో చేర్చడం తెలంగాణ ప్రజలకు వరంలాంటిది.
ప్రస్తుతం తెలంగాణ చరిత్ర- సంస్కృతి, వారసత్వం, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ (2014) వంటి అంశాలు సిలబస్లో అతి ముఖ్యాంశాలుగా ప్రకటన వెలువడింది. మన సంస్కృతిని మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడిన నేటి యువతకు ఇప్పుడు మన తెలంగాణ సంస్కృతి-వారసత్వం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వీరమరణం పొందిన విద్యార్థుల బలిదానాలు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగం ఆశించే అభ్యర్థులు చదవక తప్పదు. ఎన్నో ఉద్యమాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం! ఇప్పుడు ఆ సిలబస్ను చేర్చి, సంస్కృతికి, వారసత్వానికి పెద్దపీఠ వేయడం గర్వకారణం.
నూతన సిలబస్ గ్రూప్-1లో..
గ్రూప్-1లో మెయిన్స్ 2వ పేపర్
1. తెలంగాణ చరిత్ర-సంస్కృతి, వారసత్వం (50 మార్కులు)
అలాగే మెయిన్స్ పేపర్ VIలో తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర అవతరణ
(150 మార్కులు) దీనిలో ప్రత్యేకంగా..
I. ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970)
II. మొబిలైజేషన్ ఫేజ్ (1971-1990)
III. టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (1991-2014)
భారతస్వాతంత్య్రోద్యమంలో మూడు దశలు ఎలాగున్నాయో ( మితవాద యుగం (1885-1905), అతివాద యుగం (1905-1920), గాంధీయుగం(1920-1947)) అలాగే మన తెలంగాణ స్వాతంత్రోద్యమ చరిత్ర కూడా ఉంది. ఎందరో భారతస్వాతంత్రోద్యమానికి చేసిన ఉద్యమాలు, త్యాగాలు, వీరమరణాల ఫలితమే స్వేచ్ఛా భారతదేశం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం 1948 నుంచి తిరిగి 2వ దశ స్వాతంత్య్రోదమం సాగించారని చెప్పవచ్చు. దీనినే ఆపరేషన్ పోలో, హైదారాబాద్ పోలీస్ చర్య,-1948, సెప్టెంబర్ 17, తెలంగాణ విముక్తి దినం ప్రారంభం. అంటే గ్రూప్-1లో మొత్తం 200 మార్కులు తెలంగాణకు సంబంధించినవిగా చెప్పవచ్చు.
-15522 పోస్టులకు ఆమోదం.. త్వరలో మరో 10 వేల పోస్టులు
-గ్రూప్స్ పరీక్షా విధానాన్ని విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
-గ్రూప్-1, 2లో తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేక పేపర్లు
-తెలంగాణ కేంద్రంగా నూతన సిలబస్
తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభమైంది. లక్ష కొలువుల నోటిఫికేన్లలో భాగంగా మొదటి విడతగా 15,522 ఉద్యోగాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొద్దిరోజుల్లోనే అధికారింగా నోటిఫికేషన్ వెలువడనుంది. అలాగే మరో 10 వేల ఉద్యోగాలకు కూడా త్వరలోనే పరిపాలన ఆమోదం లభించనుంది. అంతేగాకుండా విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్స్ పరీక్షల విధానాన్ని కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.
సిలబస్, పేపర్లు, మార్కుల విధానం ఎలా ఉంటుందో జీవో 330ని జారీ చేసింది. గ్రూప్-1లో ఆరు పేపర్లు 1000 మార్కులు (900+100), గ్రూప్-2లో 4 పేపర్లు 675 (600+75) మార్కులు, గ్రూప్-3లో 3 పేపర్లు 450 మార్కులు, గ్రూప్-4లో రెండు పేపర్లు 300 మార్కులకు పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల సిలబస్ మొత్తం తెలంగాణ చుట్టే తిరగనుంది. తెలంగాణ-సంస్కృతి, ప్రత్యేక ఉద్యమం, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, సమాజం, భౌగోళిక పరిస్థితులు తదితర అంశాలపై 50శాతం వరకు ప్రశ్నలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మారనున్న పేపర్లు, సిలబస్ ఎలా ఉంటాయో ప్రత్యేక విశ్లేషణను సబ్జెక్టు నిపుణులు అందిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లకు, యావత్ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ధన్యవాదాలు తెల్పుకోవాలి. విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందించిన కానుకగానే ఈ నూతన సిలబస్ అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు తెలంగాణ ఉద్యమం- మొబిలైజేషన్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన క్రమం వంటి ముఖ్యాంశాలుగా చదువుకోవడానికి, తెలంగాణ ప్రజలకు కానుకగానే ఈ సిలబస్ చాలా ఉపయోగపడుతుంది. అంటే తెలంగాణ సంస్కృతి-వారసత్వంను కూడా పోటీ ప్రపంచంలో ఉన్న ప్రతి అభ్యర్థి తెలుసుకొనేందుకు సిలబస్లో చేర్చడం తెలంగాణ ప్రజలకు వరంలాంటిది.
ప్రస్తుతం తెలంగాణ చరిత్ర- సంస్కృతి, వారసత్వం, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ (2014) వంటి అంశాలు సిలబస్లో అతి ముఖ్యాంశాలుగా ప్రకటన వెలువడింది. మన సంస్కృతిని మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడిన నేటి యువతకు ఇప్పుడు మన తెలంగాణ సంస్కృతి-వారసత్వం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వీరమరణం పొందిన విద్యార్థుల బలిదానాలు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగం ఆశించే అభ్యర్థులు చదవక తప్పదు. ఎన్నో ఉద్యమాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం! ఇప్పుడు ఆ సిలబస్ను చేర్చి, సంస్కృతికి, వారసత్వానికి పెద్దపీఠ వేయడం గర్వకారణం.
నూతన సిలబస్ గ్రూప్-1లో..
గ్రూప్-1లో మెయిన్స్ 2వ పేపర్
1. తెలంగాణ చరిత్ర-సంస్కృతి, వారసత్వం (50 మార్కులు)
అలాగే మెయిన్స్ పేపర్ VIలో తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర అవతరణ
(150 మార్కులు) దీనిలో ప్రత్యేకంగా..
I. ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970)
II. మొబిలైజేషన్ ఫేజ్ (1971-1990)
III. టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (1991-2014)
భారతస్వాతంత్య్రోద్యమంలో మూడు దశలు ఎలాగున్నాయో ( మితవాద యుగం (1885-1905), అతివాద యుగం (1905-1920), గాంధీయుగం(1920-1947)) అలాగే మన తెలంగాణ స్వాతంత్రోద్యమ చరిత్ర కూడా ఉంది. ఎందరో భారతస్వాతంత్రోద్యమానికి చేసిన ఉద్యమాలు, త్యాగాలు, వీరమరణాల ఫలితమే స్వేచ్ఛా భారతదేశం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం 1948 నుంచి తిరిగి 2వ దశ స్వాతంత్య్రోదమం సాగించారని చెప్పవచ్చు. దీనినే ఆపరేషన్ పోలో, హైదారాబాద్ పోలీస్ చర్య,-1948, సెప్టెంబర్ 17, తెలంగాణ విముక్తి దినం ప్రారంభం. అంటే గ్రూప్-1లో మొత్తం 200 మార్కులు తెలంగాణకు సంబంధించినవిగా చెప్పవచ్చు.
No comments:
Post a Comment