UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 13 January 2016


శాస్త్రిగారి చెప్పులు Vs శాస్త్రీయ చెప్పులు..
మాకు చాగంటి కోటేశ్వరరావు గారిని తప్పుపట్టేటంత.., ఆయన చెప్పిన విషయాల్ని విశ్లేశించి విమర్శించేంత స్థాయి.., ఆలోచనా లేదని ఆయన తరహా వ్యక్తుల్ని వ్యవస్థల్ని సమర్దించేవారి భావన...
సరే.. ఇప్పుడు మనం మన చాగంటివరు చెప్పిన ఒక విషయాన్ని తీసుకుని ఒకటి ఆయన చెప్పే భాష్యాల కోణంలోనూ.., రెండోది మేము చెప్పే శాస్త్రీయ దృక్పధకోణంలోనూ చూద్దాం,,
ఆయన చెప్పిన ప్రకారం " జమదగ్ని అనే మహర్షి గర్భిణీగా ఉన్న అతని భార్య రేవతిగారితో భాణాలాట ఆడుకుంటుండగా సూర్యుడి ఎండ తగిలి రేవతిగారికి చెమటపట్టి చీకాకుపడుతుండగా.. జమదగ్ని అది చూసి మా ఆవిడనే చిరాకు పెడతావా అని తనదగ్గరున్న చెంబులోంచి జలాన్ని తీసి సూర్యుడిని శపించబోయాడు.. అది చూసి భయపడ్డ సూర్యుడు పరిగెత్తుకువచ్చి ఋతువులనుబట్టి ఎండకాస్తు చేయడం నా ధర్మం.. మీరు నన్ను శపించెస్తే యెలా అని బదులు చెప్పుకుని.. చెమట పట్టకుండా.. కాళ్లు కాలకుండా ఉండడానికి సూర్యుడు లోకంలో లేని రెండు పధార్ధాలను తయారుచేసి జమదగ్నిగారికి "చెప్పులు.., గొడుగూ.." ఇచ్చారు.. ఆవిధంగా ఈ భూమ్మీదకి చెప్పులూ.., గొడుగూ వచ్చాయి... ఇదీ చెప్పులు గొడుగులూ యెలా వచ్చాయి అనేదానికి మన చాగంటి కోటేశ్వరరావుగారు ఇచ్చిన భాష్యం.. ఆయనకెలాగూ మంచి ఫాలోయింగుందిగాబట్టి ఓ వెయ్యి మంది ఆసభలో విన్నవాళ్లు ఆ ప్రవచనం విని
"ఆహా... జమధగ్ని మహర్షివారు ఎంత గొప్పవారు.. ఆయన సూర్యుడినే శపించగల సమర్ధులు.. గొప్పవారు అని ఆయన్ని తలచుకుని.., ఈలోకంలోకి గొడుగులూ చెప్పులూ యెలా వచ్చాయో తెలుసుకుని.. చాగంటి వారి వాక్చాతుర్యానికి.., ఆయన చెప్పినదానికి ముగ్ధులై ఆయన్ని కూడా గురువుగారు భలే చెప్పారు.. ఆహా.. ఓహో అని అనుకుని తరవాత ఆయన చెప్పే రామాయణాలకి భారతాలకి భజన చేస్కుంటూ ఇంటికిపోతారు... రేప్పొద్దున్న ఈ భజనకెళ్లిన బేచ్చులోవారింట్లో యే పిల్లలైనా పొరపాటున "అమ్మా../నాన్నా.. అసలు చెప్పులెలా వచ్చాయంటారూ..??" అనడిగితే పైన చాగంటిగారు చెప్పిన కధనే చెబుతారు.. వాళ్లు తరవాతి తరంలో భజన బృందాలుగానే తయారవుతారు...
ఇప్పుడు చెప్పులు.., గొడుగులు యెలా వచ్చాయనేదాని మీద శాస్త్రిగారి భాష్యం కాకుండా శాస్త్రీయ దృక్పధంతో మేం చెప్పే విషయం చూద్దాం..
చాగంటివారు చెప్పినట్టు శాస్త్రీయ దృక్పధ సమాధానంలో యే సూర్యుడు ఆప్పటికప్పుడు రెండు పదార్ధాలను సృష్టించి ఇవ్వలేడు.. ( గట్టిగా మాట్లాడితే సూర్యుడు తనలో ఉన్న హైడ్రోజన్ అణువుల అణుసంలీనం చర్య(Nuclear Fusion) ద్వారా హీలియంనుతప్ప యే ఇతర మూలకాలనూ తయారుచేయలేడు..).. ఇక్కడ యెవరి శాపనార్ధాలూ యేవీ పనిచేయవు.. శాస్త్రీయ దృక్పదం ప్రకారం.. ప్రపంచంలో ప్రతి పనీ దాని ముందు పనికి కొనసాగింపే.. అంటే ప్రతి పనీ జరగడానికి/చేయటానికి ముందు దానికి సంభందించిన పని అంతకు ముందే జరిగి ఉంటుంది.. అంటే ప్రపంచంలో ప్రతి పనీ ఒక పరిణామం ప్రకారం జరుగుతుంది..
ఇక చెప్పుల విషయాన్ని శాస్త్రీయ కోణంలో చూస్తే మొదటి ప్రశ్న చెప్పులు ఎందుకు..??? ఏ జీవీ వేసుకోలేని చెప్పులు..,గొడుగులూ మనుషులే ఎందుకేసుకోవాల్సొచ్చి­ంది...??? ఏ జంతువూ చెప్పులూ గొడుగులూ దరించకుండా మనుషులే ఎలా తయారుచేసుకున్నారు...­??? అనేవి ప్రాధమిక ప్రశ్నలు..
జంతువులకూ మనిషికి ఉన్న తేడా మనిషి మిగతా జీవులకన్నా బుద్ది ఉన్నతి కలిగిన జీవి.. బుద్ది ఎందుకు ఉన్నతి కలిగింది అనేది పూర్తిగా అవగాహన రావాలంటే "జీవ పరిణామ క్రమం" ను చదవండి..(అదిక్కడ మొదలెడితే నాకు తెల్లారిపోద్ది..) మనిషి పరిణామం చెంది జీవన పరంగా మిగతా జీవులనుండి వేరుపడ్డాడు.. అతని మారిన శరీరాకృతి.., శరీరాకృతితో పాటు శరీరంలోని అన్ని అవయవాలకూ అనుగుణంగా అభివృద్ది చెందిన మెదడూ.., ప్రకృతితో జీవనపోరాటం చేస్తూ అతను నేర్చుకున్న సేకరించిన జ్నానం అతను యే జీవీ చేయలేనటువంటి పనులూ.., పనులతోపాటు సౌకర్యాలు కల్పించుకునేలా చేసింది..
మనిషి కాకుండా ఆహార సేకరణలో ఎక్కువ సమయం వెచ్చించే యే ఇతర జీవులైనా ఉదహారణకు గేదెలూ.., జింకలు.., గాడిదలూ మొదలైనవి సూర్యుడి వేడినుండి తప్పించుకోడానికి వాటి కాలికి గిట్టలనేవుంటాయి.. పైన చర్మానికి ఎక్కువ వెంట్రుకల నిర్మాణం ఉంటుంది.. ఆ నిర్మాణం సరిగా లేని జీవులు యే చెరువురోలో నదిలోనో దొర్లుతూ బురద రాసుకుని గడ్డిమేస్తూ వాటి పని కానిస్తాయి.. ఇక గిట్టలు లేని సింహాలూపులులూ నక్కల్లాంటి జీవులు ఆహార సేకరణకోసం ఎక్కువసమయం ఎండలో గడపాల్సిన అవసరంలేదుగాబట్టి వాటికి చెప్పులతో అవసరంలేదు.. ఒకదాన్ని వేటాడాక అవి చెట్లూ గుహల నీడన సేదతీరుతాయిగాబట్టి వాటికి గొడుగుకూడా అవసరంలేదు
ఇక మనిషి విషయానికొస్తే మనిషి కాలికి గిట్టలూ లేవు.., శరీరానికి మిగతా జంతువుల్లా పూర్తి వెంట్రుకలూ లేవు.., అలాగని సింహం పులుల్లా తిని తొంగోడానికీ కుదరదు.. ఇప్పుడు మనిషి ఎండలో పనిచేయాలన్నా.., తిరగాలన్నా మొదట మనిషి కాలికి నేలవేడినుండి రక్షణ కావాలి.. దానికోసం అతను బురద కాలికి రాసుకున్న ఉండదు.. కాబట్టి మనిషి మొదట కాళ్లకి రక్షణకోసం చెట్ల బెరడులూ.., పుల్లముక్కలూ.., దళసరి ఆకులతో తయారు చేసిన వాటిని వాడాడు.. వీటిని కూడా కాలికి కట్టుకోడానికి తాడు.., ముడి వేయడానికి చేత్తివేళ్ల నిర్మాణ సహకారం అన్నీ ఉండాలి(చేతివేళ్లు..,­ బొటనవేలు నిర్మాణాలు మనకి మిగతా వానర జాతులకి వేరు....)
ఈ బెరడులూ ఆకులూ పుల్లలూ స్తమానూ అరిగిపోతుంటాయిగాబట్ట­ి మనిషి వాటికన్నా ఇంకా బాగా మన్నే వస్తువుల గురించి ఆలోచించి.. ఇతర జంతువులను చంపిన తరువాత ఆ జంతువుల చర్మాలను కాళ్లు కట్టుకుని తొలితరం చెప్పులను తయారు చేసుకున్నాడు..
గొడుగు సంగతీ ఇంతే.. గుహలోనో ఒక చెట్టుకిందో ఉండడం కుదరదుగాబట్టి ఆకుల్ని ఎండకూ వానకు రక్షణగా వాడాడు.. ఆ ఆకుల్లో కూడా యే ఆకు చేతితో పట్టుకోడానికి తేలికగా సౌకర్యంగా చిరగకుండా ఎండనూ వాననూ లోపలికి రానియకుండా ఉంటుందో ఆ చెట్ల ఆకుల్ని పరిశీలించి ఆ ఆకుల్ని తొలితరం గొడుగులుగా వాడుకున్నాడు.. వాటిలో సౌకర్యంగా.., అందుబాటులో ఉండే ఆకు తాటాకు.. పైగా ఆ తాటాకును ఏ జీవీ నరకలేదు.. ఖచ్చితంగా తాటాకుని నరకడానికి ఆయుధం తయారుచేస్కోవాలి.. ఆ ఆయుధాన్ని తయారు చేస్కోడానికి అతని శరీర నిర్మాణం.., బుద్ది పరిణామం చెంది ఉండాలి..
తరువాత మనిషికి విషయ సేకరణ.., జ్నానం అభివృద్ది చెంది తను తెలుసుకున్న విషయాలతో ఆనాటి చెక్క.., తోలు చెప్పులనుండి.., ఆకుల గొడుగులనుండి తన స్థాయిని పెంచుకుంటూ రసాయన శాస్త్రంలోనూ.., బౌతిక శాస్త్రంలోనూ అభివృద్ధి సాదించి ప్రకృతిలో దొరికే వస్తువులతో పాలిమర్లు.., రెజిన్లు.., వివిదరకాల దారాలు.., ప్లాస్టిక్.., లోహా సామాగ్రి తయారుచేసుకుని ఈరోజున్న ఆదునిక "గొడుగూ - చెప్పుల" స్థాయికొచ్చాడు ..
ఇదీ శాస్త్రీయ దృక్పదం చెప్పే గొడుగూ-చెప్పుల వెనుక సమాధానం.. ఇప్పుడు శాస్త్రీయ దృక్పధం చెప్పిన సమాధానాల వెనుక మళ్లీ బోలెడు ప్రశ్నలూ సమాధానాలు.. పరిణామక్రం అంటే ఏమిటి..???? అదెలా జరిగింది.. ఎందుకు జరిగింది... మనమెదడు ఎలా పని చేస్తుంది.. మనకు మిగతా జంతువులు అలా వుండడానికి కారణాలేంటి...?? ఇవన్నీ ప్రశ్నలు..
ఇప్పుడు రేప్పొద్దున్న ఏ పిల్లాడైనా గొడుగు గురించి చెప్పుల గురించి అడిగితే
శాశ్త్రీయ దృక్పదం చెప్పిన సమాధానాలను చెబితే అతను మరికొన్ని ప్రశ్నలడిగి వాడు మరికొన్ని సమాధానాల్ని అన్వేషించి ఒక ఆలోచనా పరుడవుతాడు..
చాగంటి వంటి వారి సమాధానాల్లో పూర్వజన్మ ఫలాలూ.., దేవుళ్ల అనుగ్రహాలు.., తలరాతలు.., స్వర్గాలూ నరకాలే మనుషుల జీవితాన్ని సమాజాన్ని శాసిస్తాయి.. కాని శాస్త్రీయ దృక్పదం ఇచ్చే సమాధానాల్లో రాజకీయ.., ఆర్ధిక.., సామాజిక.., ప్రజల చైతన్యస్థాయిల విషయాలే ప్రజల జీవణ ప్రమాణాలని అవసరాలని.., సౌకర్యాలని శాసిస్తాయి.. శాస్త్రీయ దృక్పధం ఇచ్చే విషయాల్లో నువ్వెవడికీ బానిసవు కావు.. ప్రతివాడూ ఎలా పుట్టాడో నువ్వూ అలానే పుట్టావ్.. ప్రకృతిలో ఉండే వనరులపై అందరిలాగే నీకూ హక్కుంది.. ప్రకృతి సంపద అందరిదీ.. వాటిని నువ్ పొందాలంటే మంచి రాజకీయ వ్యవస్థని..,ఆ వ్యవస్థ సరిగా నడవడంకోసం సరైన రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకొమ్మని చెబుతుంది.. అది పూర్వంనుండి నెట్టుకొస్తున్న కులవ్యవస్థల్ని.., బానిస వ్యవస్థల్ని .., దోపిడీ వ్యవస్థని.., వాటిని ఆసరాగా చేసుకుని బతికే కుల.., మత రాజకీయ వ్యవస్థల గోడల్ని బద్దలు గొట్టి ఉన్నత మానవ సమాజం వైపు మనుషుల్ని నడిపిస్తుంది..
కాని మన చాగంటివారు.., గాలిగీతల నాగఫణిశర్మల్లాంటివాళ­్ల వల్ల.., రెండు మూడు భాషల్లో డబ్బింగులు చెప్పే చర్చి పాస్టర్లు.., రోజుకునాలుగైదు సార్లు మోకరిల్లి నమాజులు చేసే యే ప్రవక్తలూ ఈ విషయాలు చెప్పరు.. వారు చేసే పనల్లా మనుషుల నమ్మకాల్ని అజ్నానాల్ని ఆసరాగా చేసుకుని మనుషున్ల్నెప్పుడు భూజులుపట్టిన పురాతన కాలంలో ఉంచి జనాల చెత దండలు.., దణ్ణాలు పెట్టించుకుంటూ గురువులుగా.., గొప్ప వ్యక్తులుగా..., సెలెబ్రిటీలుగా బతికెయ్యడమే...వీళ్లక­ు యెటువంటి రాజకీయ చైతన్యంతోను.., ప్రజల ప్రగతితోనూ ఏ సంభందం.., యే అవసరం లేదు...
వీళ్లు సమాజ ప్రగతి నిరోదకులేదప్ప.., వీరి వల్ల ఒరిగేదీ... జరిగేది.. పెరిగేది.. యేo ఉండదు..
ఈరోజుదాకా జరిగిన అభివృద్దంతా శాస్త్రీయ దృక్పధం వల్ల మనిషి సాదించిన ప్రగతే తప్ప వాళ్లు చెప్పినట్టు యే సూర్యుడు.., ఇంద్రుడు ఇవ్వలేదు.. ఆఖరుకి వారు వాగే మైకు..,స్పీకరు.., వాళ్ల వాగుల్లని ప్రసారం చేసే TVలు శాటిలైటులు.., యూట్యూబులు అన్నీ మనుషులు శాస్త్రీయ దృక్పదాన్ని అనుసరించడంవల్ల వచ్చినవే....
ఇదీ శాస్త్రిగారి చెప్పులు Vs శాస్త్రీయ చెప్పుల కధ...
దీనిపై యే చర్చకైనా మేం సిద్దం... మీరు యెక్కడ యే డిబేటు పెట్టినా యెవరితోనైనా చర్చించడానికి మేం సిద్దం ...!

No comments:

Post a Comment