పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి కటీఫ్ చెప్పినట్టేనా???
Pawan Kalyan vs chandrababu
బీజేపీ, టీడీపీ కూటమితో జతగట్టి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలు చేసిన పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడ్డారు. జనసేన భవిష్యత్తు కోసం అధికారిక కూటమి పట్ల జాగురూకతకు సిద్దమవుతున్నారు. అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ ..అవకాశం కోసం ఎదురుచూసే ధోరణిలో సాగాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే గ్రేటర్ ఎన్నికలకు దూరం కావడంతో పాటు అనేక అంశాలలో ప్రభుత్వ తీరును క్షుణ్ణంగా పరిశీలించడానికి పూనుకుంటున్నారు.
ముఖ్యంగా ఎన్నికలకు ముందు, తర్వాత కూడా పవన్ మిత్రబంధానికి విలువ ఇస్తూ వస్తున్నారు. దాని కారణంగా ఆయన మీద విమర్శలు వచ్చినప్పటికీ ఏమాత్రం వెనకడుగేయడం లేదు. తనకు అంగీకారం కాని అనేక విషయాల్లో కూడా ప్రభుత్వ పెద్దలకు నచ్చజెప్పడం తప్ప..ఒక్క అడుగు కూడా ముందుకేయడం లేదు.చివరకు పదే పదే ప్రశ్నించిన మీడియా ముందు కూడా నోరు విప్పడానికి రెడీ కాలేదు. అయినప్పటికీ ఏపీలో చంద్రబాబు తీరు పవన్ కి మనస్తాపం కలిగించిందని సమాచారం. కేంధ్ర ప్రభుత్వ వైఖరి కూడా సమ్మతంగా లేదని భావిస్తున్నట్టు అంతరంగీకుల సమాచారం.
ప్రత్యేక హోదా విషయం మొదలుకుని ప్రస్తుత సమస్యల వరకూ అన్ని విషయాల్లోనూ ఉభయప్రభుత్వాల వైఖరి పవన్ ని నిరాశపరిచింది. ముఖ్యంగా అధికారుల మీద దౌర్జన్యానికి దిగిన ఇసుక మాపియా చింతమనేని వ్యవహారంలో కనీస చర్యలు తీసుకోకపోవడం పవన్ కి ఆగ్రహం కలిగించిందంటున్నారు. కాల్ మనీలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ల పాత్రపై కూడా పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. వాటికితోడు భూకేటాయింపుల అవినీతి పరంపరపై కూడా పవన్ ఆరాతీస్తున్నట్టు చెబుతున్నారు. రాజధాని వ్యవహారం, బాక్సైట్ భాగోతంలో కూడా తనకు ఇచ్చిన హామీల అమలుచేయకుండా చంద్రబాబు మిత్రధర్మానికి బిన్నంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా అమరావతిలో రైతులకు అన్యాయం జరగదని చెబుతూ ఇప్పుడు భూములిచ్చిన వారికి కూడా ధీమా లేకుండా చేసేయడం పవన్ వైఖరిలో మార్పునకు కారణం అంటున్నారు. ఇక బాక్సైట్ జీవో రద్దు చేస్తామని చెప్పినప్పటికీ దానికి విరుద్దంగా ఇప్పుడు బాక్సైట్ వ్యవహారంలో చాపకింద నీరులా వ్యవహరించడం కూడా పవన్ కి కంటగింపుగా మారిందంటున్నారు.
ఇక ఈ విధానాల కారణంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తే పవన్ లో మార్పునకు అసలు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన నో చెప్పేశారు. పదే పదే ఆయనతో మాట్లాడినప్పటికీ ససేమీరా అనేశారు. దాంతో పవన్ కోసం టీడీపీ, బీజేపీ పెట్టుకున్న ఆశలు గంగపాలయ్యాయి. అయితే ఆ పార్టీలను పవన్ దూరం పెట్టడంలో ఇది తొలి అడుగుమాత్రమే అని చెబుతున్నారు. త్వరలో పూర్తిగా కటీఫ్ చెప్పే దిశగా పరిణామాలున్నాయంటున్నారు. ఆపార్టీల వైఖరులతో ప్రజలకు దూరమవుతున్న తరుణంలో తాను కూడా డిస్టేన్స్ మెయింటెన్ చేయాలన్న కృతనిశ్చయంలో జనసేనాని ఉన్నారు. దాంతో మొన్నటి ఎన్నికల్లో ఓట్లురాల్చడానికి క్యాంపెయిన్ లో కీలకంగా వ్యవహరించిన పవన్ కల్యాణ్ కూడా టీడీపీ వ్యతిరేక పవనాలకు స్పందిస్తున్నట్టు భావించవచ్చు.
Pawan Kalyan vs chandrababu
బీజేపీ, టీడీపీ కూటమితో జతగట్టి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలు చేసిన పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడ్డారు. జనసేన భవిష్యత్తు కోసం అధికారిక కూటమి పట్ల జాగురూకతకు సిద్దమవుతున్నారు. అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ ..అవకాశం కోసం ఎదురుచూసే ధోరణిలో సాగాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే గ్రేటర్ ఎన్నికలకు దూరం కావడంతో పాటు అనేక అంశాలలో ప్రభుత్వ తీరును క్షుణ్ణంగా పరిశీలించడానికి పూనుకుంటున్నారు.
ముఖ్యంగా ఎన్నికలకు ముందు, తర్వాత కూడా పవన్ మిత్రబంధానికి విలువ ఇస్తూ వస్తున్నారు. దాని కారణంగా ఆయన మీద విమర్శలు వచ్చినప్పటికీ ఏమాత్రం వెనకడుగేయడం లేదు. తనకు అంగీకారం కాని అనేక విషయాల్లో కూడా ప్రభుత్వ పెద్దలకు నచ్చజెప్పడం తప్ప..ఒక్క అడుగు కూడా ముందుకేయడం లేదు.చివరకు పదే పదే ప్రశ్నించిన మీడియా ముందు కూడా నోరు విప్పడానికి రెడీ కాలేదు. అయినప్పటికీ ఏపీలో చంద్రబాబు తీరు పవన్ కి మనస్తాపం కలిగించిందని సమాచారం. కేంధ్ర ప్రభుత్వ వైఖరి కూడా సమ్మతంగా లేదని భావిస్తున్నట్టు అంతరంగీకుల సమాచారం.
ప్రత్యేక హోదా విషయం మొదలుకుని ప్రస్తుత సమస్యల వరకూ అన్ని విషయాల్లోనూ ఉభయప్రభుత్వాల వైఖరి పవన్ ని నిరాశపరిచింది. ముఖ్యంగా అధికారుల మీద దౌర్జన్యానికి దిగిన ఇసుక మాపియా చింతమనేని వ్యవహారంలో కనీస చర్యలు తీసుకోకపోవడం పవన్ కి ఆగ్రహం కలిగించిందంటున్నారు. కాల్ మనీలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ల పాత్రపై కూడా పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. వాటికితోడు భూకేటాయింపుల అవినీతి పరంపరపై కూడా పవన్ ఆరాతీస్తున్నట్టు చెబుతున్నారు. రాజధాని వ్యవహారం, బాక్సైట్ భాగోతంలో కూడా తనకు ఇచ్చిన హామీల అమలుచేయకుండా చంద్రబాబు మిత్రధర్మానికి బిన్నంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా అమరావతిలో రైతులకు అన్యాయం జరగదని చెబుతూ ఇప్పుడు భూములిచ్చిన వారికి కూడా ధీమా లేకుండా చేసేయడం పవన్ వైఖరిలో మార్పునకు కారణం అంటున్నారు. ఇక బాక్సైట్ జీవో రద్దు చేస్తామని చెప్పినప్పటికీ దానికి విరుద్దంగా ఇప్పుడు బాక్సైట్ వ్యవహారంలో చాపకింద నీరులా వ్యవహరించడం కూడా పవన్ కి కంటగింపుగా మారిందంటున్నారు.
ఇక ఈ విధానాల కారణంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తే పవన్ లో మార్పునకు అసలు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన నో చెప్పేశారు. పదే పదే ఆయనతో మాట్లాడినప్పటికీ ససేమీరా అనేశారు. దాంతో పవన్ కోసం టీడీపీ, బీజేపీ పెట్టుకున్న ఆశలు గంగపాలయ్యాయి. అయితే ఆ పార్టీలను పవన్ దూరం పెట్టడంలో ఇది తొలి అడుగుమాత్రమే అని చెబుతున్నారు. త్వరలో పూర్తిగా కటీఫ్ చెప్పే దిశగా పరిణామాలున్నాయంటున్నారు. ఆపార్టీల వైఖరులతో ప్రజలకు దూరమవుతున్న తరుణంలో తాను కూడా డిస్టేన్స్ మెయింటెన్ చేయాలన్న కృతనిశ్చయంలో జనసేనాని ఉన్నారు. దాంతో మొన్నటి ఎన్నికల్లో ఓట్లురాల్చడానికి క్యాంపెయిన్ లో కీలకంగా వ్యవహరించిన పవన్ కల్యాణ్ కూడా టీడీపీ వ్యతిరేక పవనాలకు స్పందిస్తున్నట్టు భావించవచ్చు.
No comments:
Post a Comment