ఏపీ సీఎం బాగోతాలను బయటపెట్టిన రిటేర్డ్ ఉపాధ్యాయుడు ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పలు బాగోతాలను బయటపెట్టాడు ఒక విశ్రాంతి ఉపాధ్యాయుడు .ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దుబారా ఖర్చులపై తన మెసేజ్ ద్వారా ఆవేదనని బయటపెట్టాడు .తమకు రావాల్సిన డీఏలు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటున్న చంద్రబాబు తన సొంత సౌకర్యాల కోసం,ఆర్భాటాల కోసం ఖర్చు చేస్తున్న వైనాన్ని తనదైన శైలీలో అందరికి అర్ధమయ్యే విధంగా వివరిస్తూ అ ఉపాధ్యాయుడు ప్రస్తుతం మీడియా కంటే పవర్ ఫుల్ గా మారిన సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ ను షేర్ చేశాడు.ఇప్పుడు అది సోషల్ మీడియా లో విపరీతంగా షేరింగులు అవుతున్నది.
ఆ ఉపాధ్యాయుడు పంపిన మెస్సేజ్ ఏమిటి అంటే “కొత్తగా ఏర్పడిన రాష్టానికి కాస్ట్ల్ లీ ముఖ్యమంత్రి ‘’ -ఇప్పటిదాకా చంద్రబాబు బాబు ప్రభుత్వం దుబారా నిధుల మొత్తం 4వేల కోట్ల పై మాటే ...అవి కనుక సరిగా ఖర్చు పెట్టి ఉంటే ఈ పాటికి కేంద్రము వద్ద అడుక్కోవలసిన పని లేకుండా ఉండు . బాబు ఇప్పటి వరకు చేసిన కేంద్ర నిధుల దుబారాలో కొన్ని ఖర్చులు ఏమిటి అంటే తన ముఖ్యమంత్రి పదవీ ప్రమాణస్వీకారానికి చేసిన ఖర్చు అక్షరాల రూ 50 కోట్లు..అంతే కాకుండా నీరు మీరు రూ 150 కోట్లు..
ఎప్పుడు విజయవాడ లో ఉంటూ అప్పుడప్పుడు హైదారాబాద్ లో ఉండటానికి ఇల్లు బాగు చెయ్యడానికి అక్షరాల రూ. 20 కోట్లు .అంతే కాకుండా మరో ఏడు ఏండ్లలో ఖాళీ చేయబోతున్న సెక్రటేరియట్ రీమోడలింగ్ ఖర్చు రూ.20 కోట్లు ..అంతే కాకుండా కాన్వాయ్ లు అంటూ 3 చోట్ల కలిపి అక్షరాల రూ. 30 కోట్లు .ఇక బెజవాడ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు కోసం రూ. 20 కోట్లు.తను తిరగడానికి ఖరీదు అయిన కొత్త బస్ కోసం రూ. 5 కోట్లు ..రాష్ట్రంలో ఉండటానికి బెజవాడ లో ఇల్లు అంటూ రూ. 5 కోట్లు . ఇంటికి దారులు, కరంట్ అంటూ ....రూ. 22 కోట్లు .పండగల పేరిట చంద్రన్న సంక్రాంతి అంటూ రూ.350 కోట్లు .
చంద్రన్న రంజాన్ అంటూ ఊడేసినది .. రూ.50 కోట్లు.ఇక ప్రాజెక్టులు అంటూ పట్టిసీమ అంటూ దోచిన సొమ్ము..రూ. 1350 కోట్లు . పుష్కరాలు అంటూ సినిమా షూటింగ్ ల కోసం... రూ.250 కోట్లు.తనకోసం ప్రత్యేక విమానాలు, విదేశాలు బూడిదలో పోసింది ..రూ. 75 కోట్లు.. అమరావతి పూజ(భూమి పూజ )రూ. 50 కోట్లు .. శంఖుస్థాపన అంటూ మట్టి మొహాన కొట్టించిన దానికి ...రూ. 400 కోట్లు .. సంకల్ప సభ అని కేసిఆర్ ,ప్రతిపక్షాలను ని తిట్టడానికి పెట్టిన సభ ....రూ. 50 కోట్లు. అమరావతి ఆహ్వానం కోసం కేసిఆర్ ని ఇంటికి వెళ్ళి పిలవడానికి విమానం కోసం..రూ. 1 కోటి.. ఇక సభలు, సమావేశాలు, రైతు క్షేత్రం అంటూ ....రూ. 100 కోట్లు ..ఇలా ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్చు చేస్తూ పేద రాష్ట్రం అంటే ఎవరు నమ్ముతారు అని ప్రశ్నిస్తున్నాడు ఆ ఉపాధ్యాయుడు ....
..........................................
No comments:
Post a Comment