*!! శాంతి యుత ఉద్యమానికి కార్యాచరణ గ్రామ స్థాయి నుంచి కాపు కమిటీల ఏర్పాటు !!*
*కాపు ఉద్యమనేత ముద్రగడ మండపేట కాపులను ఎన్నికల ముందు వాడుకుని కరివేపాకుల తీసిపారేసారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు.*
*హైదరాబాదులో జరిగిన జె ఏ సి సమావేశంలో పాల్గొని రోడ్డు మార్గాన కిర్లపూడి వెళుతూ స్థానిక కాపు భవన్ లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదు జే ఏ సి లో పలు కీలకాంశాలు చర్చించామన్నారు.*
*చిరంజీవి , దాసరి , మాజీ ఐ ఏ ఎస్ , ఐ పి ఎస్ అధికారులతో పాటు కాపు ప్రముఖులందరితో చర్చించామన్నారు.*
*తొలుత గ్రామ ,మండల , జిల్లా , రాష్ట్ర కస్థాయిల్లో కాపు కార్యాచరణ కమిటీలను నియమిస్తామన్నారు.*
*సంస్థా గతంగా కాపు జెఎసి ని బలోపేతం చేస్తామన్నారు. ప్రతి పది హేను రోజుల కో సారి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.*
*శాంతి యుతంగా కాపుల ఆవేదనను వ్యక్తపరుస్తామన్నారు.*
*ఇతర కులాల వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా వారి రిజర్వేషన్లలో తమను కలపకుండా అదనంగా రిజర్వేషన్ లు అమలు చేయాలని తాము డిమాండు చేస్తున్నామన్నారు.*
*ఈ సమావేశంలో కాపు జె ఎసి నాయకులు ఆకుల రామకృష్ణ , వై ఏసుదాసు , తుమ్మలపల్లి రమేష్ , తోట రాజు , సంగిశెట్టి అశోక్ , ఎస్ కె ఇబ్రహీం , ఓరుగంటి గోపాలం , ములకల చంటిబాబు , రావేటి పెద్ధ , మండపేట కాపు సంఘం కార్యదర్శి అధికారి శ్రీనివాస్ , కాపు యువత అధ్యక్షులు పడాల సతీష్ , శెట్టి నాగేశ్వరరావు , జిన్నూరి సాయిబాబా , కోళ్ళ శ్రీనివాస్ , సంగుల దొరబాబు , శెట్టి రవి , సూరి,తదితరులు పాల్గొన్నారు*
No comments:
Post a Comment