శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
39
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే|| 2-56 ||
దుఃఖమునందు కలత (ఉద్విగ్నత)చెందని మనస్సుకలవాడు,సుఖమునందు నిస్పృహ కలవాడు (ఆసక్తి చూపని వాడు) రాగ ద్వేషములు, భయము, క్రోధము తొలగిన వాడు,మనన శీలుడు (ముని) స్థితప్రజ్ఞుడు అనబడును.
ఒక వస్తువుపై మితిమీరిన అనురాగం వ్యామోహంగా పరిణమిస్తుంది. అది పోతుందేమో అన్న భయం వస్తుంది. లేదా తానే ముందు పోవచ్చును, అదివెంటరాదు, అన్న భయం వస్తుంది. దీనికి కారణాన్ని ఊహించుకుని దానిపై క్రోధము పెంచుకుంటాడు. ఐశ్వర్యమును అనుభవించినప్పుడు కూడా అదిపోతుందేమో ఆన్న భయం లోఉంటాడు. రాగము, భయము, క్రోధములను జయించినవాడే స్థిత ప్రజ్ఞుడు.
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్|
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-57 ||
ఎవరు సమస్త విషయములందును అభిమానములేక యుందురో, తనకు కలుగు శుభాశుభములను సంతోషము, దుఃఖములేక స్వీకరింతురో, అట్టివారి ప్రజ్ఞ సుస్థిరముగా ఉండును.
ఇతడు తనకు మంచిది, చెడు అనేది చూడడు. సంగవిహీనుడు. ఒకచోట స్నేహబుద్ధి, మరొకచోట భేదబుద్ధి, ద్వేషము ఉండవు. తనయందే తాను స్థిరుడై ఉంటాడు. సగుణ మూర్తియైన భగవంతుని కళ్యాణగుణములయందుకూడా మోహము, ఆశ లేకుండా ఉంటాడు.
****
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
పరిపాలన కార్యాలయం హైదరాబాద్
No comments:
Post a Comment