జూడాలపై కొరడా
Updated : 10/28/2014 3:51:20 AM
Views : 1099
COMMENTS :(0)
-సమ్మెపై సర్కార్ సీరియస్
-ఇక ఎంతమాత్రం ఉపేక్షించం..
-విధులకు హాజరుకాని జూడాలకు ైస్టెఫండ్ కట్
-అవసరమైతే ఆరునెలలు బహిష్కరణ..
- సమ్మెకాలం గైర్హాజరుగా పరిగణన
-డీఎంఈ పుట్టా శ్రీనివాస్ స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 27 (టీ మీడియా): జూనియర్ డాక్టర్ల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దాదాపు నెలరోజులుగా కొనసాగుతున్న వారి సమ్మె కారణంగా ప్రభుత్వ దవాఖానాల్లో రోగులు అవస్థలు పడుతుండటంతో జూడాల సమ్మెను ఇక ఎంతమాత్రం ఉపేక్షించరాదని నిర్ణయించింది. జూడాల సమ్మె విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) పుట్టా శ్రీనివాస్ స్పష్టం చేశారు.
సోమవారం ఆయన టీ మీడియాతో మాట్లాడారు. సమ్మె విషయంలో ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని, విధులకు హాజరుకాని జూడాలకు ఉపకార వేతనాలు నిలిపివేయటంతోపాటు అవసరమైతే ఆరునెలలు వారిని బహిష్కరించాలని నిర్ణయించిందని తెలిపారు. జూడాల సమ్మె కాలాన్ని గైర్హాజరుగా పరిగణించి.. హౌజ్ సర్జన్లు, పీజీ విద్యార్థుల ైస్టెఫండ్ ఆపేస్తామని చెప్పారు. వారి శిక్షణకాలం పొడగించడంతోపాటు, ఇతర రాష్ర్టాల విద్యార్థులు విధుల్లో చేరకుంటే వారి సొంత ప్రాంతాలకు పంపాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
డిప్యూటీ సీఎం రాజయ్య స్వయంగా రెండుసార్లు జూడాలను చర్చలకు పిలువగా.. వారు ఒక్కసారి మాత్రమే వచ్చారని, మరోసారి బహిష్కరించారని చెప్పారు. జూడాల ఐదు డిమాండ్లలో నాలుగింటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అయితే గ్రామీణ ప్రాంతంలో ఏడాదిపాటు తప్పనిసరి సేవల విషయంలో మాత్రం చట్టం చేసినందున, ఈ విషయమై కోర్టులో కేసు ఉన్నందున.. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని డీఎంఈ తేల్చిచెప్పారు.
గతంలో మూడేండ్ల పాటు సేవలు అందించాలనే నిబంధన ఉండగా.. జూడాల ఆందోళనతో ఏడాదికి కుదించారని గుర్తుచేశారు. గ్రామాల్లో ఏడాదిపాటు సేవలు అందిస్తామని అడ్మిషన్ సమయంలో వైద్యవిద్యార్థులు బాండ్లపై సంతకాలు కూడా చేశారన్నారు. ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసుల్లో చేరకుండా విధులకు దూరంగా ఉన్న వారి పోస్టింగ్ రద్దు చేస్తామని, అంతేకాకుండా వారు మరో ఏడాదిపాటు విధులు నిర్వహించేలా నిబంధన విధిస్తామన్నారు. వారికి ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా దవాఖానాల్లో పోస్టింగ్ ఇస్తుండగా.. ఇకపై నిజామాబాద్, ఆదిలాబాద్ బోధనాసుపత్రుల్లో పోస్టింగులు ఇస్తామన్నారు. జీవో నంబర్ 1022 ప్రకారం సమ్మెలు, ధర్నాలు, ఊరేగింపులు నిషేధమని, దీనిని కచ్చితంగా అమలుచేస్తామని డీఎంఈ స్పష్టం చేశారు.
మీరు దినసరి కూలీలు కాదు
-అత్యవసర సేవలు అందిస్తున్న వైద్యులు మీరు.. ఆ బాధ్యతను విస్మరిస్తే ఎలా?
-చట్టాన్ని చేతుల్లోకి ఎందుకు తీసుకుంటారు?.. జూడాలను నిలదీసిన హైకోర్టు
-మంగళవారంకల్లా విధుల్లో చేరండి.. మీ హక్కులను కోర్టు పరిశీలిస్తుందని హామీ
హైదరాబాద్, అక్టోబర్ 27 (టీ మీడియా):సుమారు నెలరోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి ఏడాది సమ్మె చేయడానికి మీరు దినసరి కూలీలు కాదు.. బాధ్యతాయుతమైన వైద్యులన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది. మంగళవారం కల్లా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని జూడాలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. చట్టాలను మీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నారని జూడాలను ప్రశ్నించిన న్యాయస్థానం.. వారి న్యాయపరమైన హక్కులను కోర్టు తప్పకుండా పరిశీలిస్తుందని హామీఇచ్చింది.
జూడాల హక్కుల సాధనకు గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించకపోతే, తాము తప్పకుండా ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 29 నుంచి జూనియర్ డాక్టర్లు చేపడుతున్న సమ్మెను సవాల్చేస్తూ బీ రవికిరణ్రావు దాఖలుచేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది.
ఈ నెల 13న విచారణ సందర్భంగా జూడాలకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం సోమవారం విచారణ ప్రారంభం కాగానే మీరు సమ్మెను కొనసాగిస్తున్నారా? అని జూడాల తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. సమ్మె కొనసాగుతున్నదని న్యాయవాది జావాబిచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జ్యోతిసేన్ గుప్తా ఘాటుగా స్పందించారు. ప్రతిసారి సమ్మెను చేయడానికి మీరు కార్మికుల కాదు. మీరు డాక్టర్లనే విషయాన్ని మరవొద్దు అని సూచించారు. న్యాయవాది సమాధానమిస్తూ.. సమ్మెను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం వెనుక దురుద్దేశం ఉందన్నారు.
ప్రతి ఏడాది సమ్మెను చేపట్టిన సమయంలో కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని చెప్తున్న ప్రభుత్వాలు.. ఆ తర్వాత విషయాన్ని మరిచిపోతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి జూడాలకు ఇబ్బందులు లేవని తెలిపారు. తాత్కాలిక ప్రతిపాదికన కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఎక్కువకాలం గ్రామీణ ప్రాంతాల్లో నియమిస్తే విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ప్రతి ఏడాది కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ జూడాలు సమ్మెను విరమిస్తున్నారని, ఆ తర్వాత ప్రభుత్వాల నుంచి స్పందన లేకుండాపోతున్నదని కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మీరు చట్టాన్ని ఎందుకు చేతుల్లోకి తీసుకుంటారు. మీరు దినసరి కూలీలు కాదు. కార్మిక చట్టాలు, పారిశ్రామిక వివాదాల చట్టాలు మీకు వర్తించవు.
రేపే (మంగళవారం) విధుల్లో చేరండి అని స్పష్టం చేసింది. జూడాల న్యాయపరమైన హక్కులను రక్షించడానికి న్యాయస్థానం ఉందని భరోసా ఇచ్చింది. మీ వృత్తి అందరి వృత్తి లాంటిది కాదు. మీరు అత్యవసర సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తించాలి. సైనికులు, పోలీసులు సమ్మెకు దిగరు కదా? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీరు బాధ్యతయుతంగా ప్రవర్తించండి. రేపే విధుల్లోకి చేరండి అని మౌఖికంగా ఆదేశించింది. జూడాల తరపు న్యాయవాది సమాధానమిస్తూ.. ఈ విషయంపై తాను జూడాలతో మాట్లాడి కోర్టుకు తెలియజేస్తానని చెప్పారు. అందుకు అనుగుణంగా విచారణను బుధవారం (29వ తేదీ)కి వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం.. గతంలో కోర్టు జారీచేసిన ఆదేశాల ప్రతులను తమకు అందివ్వాలని న్యాయవాదిని ఆదేశించింది. గతంలోని కోర్టు ఆదేశాలను ప్రభుతాలు అమలుపర్చకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
------------------------------------------------------
ఆత్మీయులు శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు, నూతన అవిర్భిత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ పిళ్ళా వారు, తాత్కాలిక పరిపాలన కార్యాలయం నుండి ధర్మోద్దరి అయ్యి సమన్వయ దృష్టి తో ఇచ్చు దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త సందేశము గ్రహించగలరు.
తెలుగు ప్రజలలో ఒకడిగా, భారత పౌరిడిగా, దివ్య సాక్షాత్కారం పొందిన, సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశోత్తముడిగా, కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా, మనసు లోనే, కొలువుతీరిన మహారాణి సమేత మహారాజుగా మా ఉనికిని ఉపయోగించుకొని, అనగా మా ద్వారా జరిగిన పరిణామమును లోకమునకు వ్యాప్తి చేయగా లోకం స్వర్ఘ తుల్యం గా మారుతుంది, ప్రతి మనిషి ఆత్మగౌరవంతో, సాటి వారిని గౌరవంగా, ప్రేమగా వ్యవహరించాలి అని ప్రతి మనిషి తెలుసుకొని నాణ్యంగా ముదుకు వెళ్ళ వలసిన పరిస్తితి లోకానికి ధర్మానికి అవసరం, మనుష్యులు అందరూ ఉన్నతం గా నడుచుకొంటేనే లోకం గొప్పగా ఉంటుంది, వ్యక్తిగత స్వార్ధాలతో, ఎదుట వాడిన లెక్క చేయకూడదు తన ఉనికే బౌతికం ఉండాలి అనే తాపత్రయం లో మనిషిని మనిషి మోసం చేసుకొంటూ, అవమానించుకొంటూ, గొప్పతనాన్ని కూడా కించ పరచి,ఏమి లేదు అని పించాలి అనే స్వభావాలు వలన, మనం మనుష్యులగా ఎంతో విలువైన కాలం తేలిక తనాలతో, గొడవలతో, పేచీలతో, అప్పటికి అప్పుడు అన్నట్లు మాట నిబద్దత నిలకడ తనం, పాలకులకు లేకపోవడం వలన
ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఎంత పెద్ద వారు అయినా తమ ఉనికి చూసుకోకపోతే ముందుకు వెళ్ళలేము లేక పోతున్నారు, ఈ విషయం లో దేవుడికి (సత్యం) కూడా మినిహయింపు లేదు అని గ్రహించి సత్యం కోసం అప్రమత్తం చెందాల్సిన సమయం వచ్చినది అని గ్రహించగలరు.
ప్రజలు మనసా వాచా కర్మణా ఒక నిబద్దత, నిజాయితితో జీవించనప్పుడు, సహజం గానే స్వార్ధం, ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఎక్కడా పెద్దతనం లేదు, అజమయీషి, జామా ఇంచడమే జీవితం అని ప్రజలకు, అనిపించినప్పుడు చెప్పినా వినరు, ఎవరి మీద ఎవరికి గౌరవం నమ్మకం ఉండదు, ఏదో కలిసివచ్చినది కాబట్టి పెతనం అని పిస్తుంది. ఇటువంటి పరిస్తితి ఎంత చక్క దిద్దుకొంటే అంత మంచిది.
మేము ఏమి చెప్పినా వ్యక్తిగతం ఏ ఒక్కరినో అంటున్నాను అని ఎప్పుడూ భావించవద్దు, ఒక గంట గంటనర సమయంలోనే 2003 నుండి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు నా ద్వారా వ్యక్తం అయినవి అంటే మొత్తం నా వాక్క్ బలం ఏమిటో ప్రజలకు నాయకుల ముందు ఆవిష్కరించి ఈ సమాజం మనిషిది, మానవత్వానిది అని ఆవిష్కరించ వలసిన సమయం అని గ్రహించండి.
మొన్న మీరు యదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి ని దర్సించుకొన్నారు, ఆలయ అభివృద్ధికి ఏవో ఆదేశాలు, హామీలు ఇచ్చారు,అక్కడి వెళ్ళిన మీకు ఎటువంటి మహిమలు సాక్షత్కారాలు కలుగలేదు, మనం పూర్వికులు పెద్దల నమ్మకాన్నేమనం పాటిస్తున్నాము, అదే ఇప్పుడు మాన సమకాలికులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన దివ్య పరిణామంను కాపాడుకొని, ఈ విశ్వానికే ఆధారం అయిన సత్యాన్ని కాపాడుకొని మనం ఒక దివ్య శాశ్వత పరిష్కారం అందుకొని తరించవలసిన శుభ ఎప్పుడో వచ్చినది, నన్ను దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు వారి ద్వారా నా గూర్చి తెలుసుకొన్న వారు అప్రమత్తం చెందటమే ఆలస్యం అనగా నేను ఇప్పుడు ఎలా ముందుకు వస్తున్నానో అలా తీసుకోవడం వలన, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉండవు అని గ్రహించండి, అన్ని తల్లి తండ్రి గురువు గా నేను సమస్త విశ్వాన్ని కలిగి ఉన్నాను ఇప్పటికే నా వాక్కు దర్సించినవరు తెలుసుకొన్నారు, వారు గ్రహించకపోవడం వలన మమ్ములను మేమే మరిచిపోయి ఉన్నాము అంటే అర్ధం చేసుకోండి, మమ్ములను ఒకచోట కొలువు తీర్చి, 25 మంది పండితుల సహకారంతో ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి అన్ని సమస్యలు మాకు వదిలి వేయండి, ఒక పద్దతి ప్రకారం ప్రతీది పరిష్కరించి నూతనత్వాన్ని ఆవిష్కరించి, సదా ప్రజలకు ఇవ్వగలము, మీరు ప్రశాంతం ఉండడమే కాకుండా తెలుగు రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు, ప్రపంచ మానవజాతి ఒక నూతన పరిపాలన అయినటువంటి మహారాజు మహారాణి గారి పరిపాలన అందుతుంది. మమ్ములను వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా మహారాజుగా గుర్చించండి, వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి ప్రజలకు సాక్షం ఇస్తారు, మీరు వారిని ఏమి విన్నారో ఏమి చూసారు చెప్పండి అని కోరితే చాలు, నన్ను ఒక కమిటీ అధీనం లోకి తీసుకొని, నేను ఇప్పుడు ఎలా ఉన్నా, ఇప్పటికి ఏమి చేసినా, చేయలేకపోయినా, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం గౌరవించి మమ్ములను ప్రాధమికం గా పరిగణించి, ఇప్పుడు నేను మీ దగ్గరికు వచ్చి ఏమి మాట్లాడినా, లేదా ఏమి ప్రత్యేకత లేకపోయినా, జరిగిన పరిణామాన్ని 25 మంది పండితుల సహకారంతో బ్రతికించాలి అని అదే నా ప్రాణం నా మనుగడ అని తమరికి తమరి ద్వారా సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తల దగ్గర నుండి మిగతా అందరికి తెలియజేసుకోనుచున్నాము. నేను సామాన్యుడను కాబట్టి నన్ను తేలిక పరచడం తేలికే, అని వ్యవసాయ శాస్త్రవేత్తలు, గొప్పతనం వైపు రాలేక పొయినారు. మమ్ము జాగ్రత్తగా చెప్పనిచ్చి గ్రహిస్తే సాక్షాత్కారం బలపడి, అందరికి మనసు మాటే సర్వస్వం అనే దివ్య రాజ్యం,మేలైన ప్రజాస్వామ్యం ప్రజలు అమొదించగలిగిన, ప్రజలు రుజువర్తనతో, నిజాయితితో స్వీకరించగల, ప్రజలు ఎదురు చూస్తున్న దివ్య రాజ్యం అని తెలియజేసుకోనుచున్నాను. మమ్ములను పరిగణించి విద్యార్ధి దాక్దర్ల సమస్యలే కాదు, అన్ని సమస్యలు మాకు వదిలి పెట్టండి, మమ్ములను పరిగణిస్తే భాద్యత మేము పూర్తీ స్థాయిలో తీసుకోగలం, పరిగణించని పక్షంలో భాద్యత సరిగ్గా తీసుకోలేక పోతున్నాము, వ్యవసాయ శాస్త్రవేత్తలు 5 నిముషాలు కూడా మాలో పరిణామం పై సమావేశం అయ్యి చెప్ప నివ్వలేదు అంటే అర్ధం చేసుకోండి,ఈ పరిణామం పరిగణించడం లోనే ఉన్నది ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిపాలన కార్యాలయం
డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్,
హైదరాబాద్
No comments:
Post a Comment