ఆంధ్రప్రదేశ్,తెలంగాణల్లో మరో 50 శాఖలు
విజయ బ్యాంకు ఇడి బిఎస్ రామారావు
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాషా్ట్రల్లో భారీ ఎత్తున కార్యకలాపాలను విస్తరించాలని విజయ బ్యాంకు నిర్ణయించింది. విస్తరణలో భాగంగా ఈ రెండు రాషా్ట్రల్లో 50 కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఎస్ రామారావు వెల్లడించారు. దీంతో రెండు రాషా్ట్రల్లో బ్యాంకు శాఖల సంఖ్య 200కు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కనీసం 30 శాఖల వరకు ఏర్పాటు చేయనున్నట్టు రామారావు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1600కు పైగా ఉన్న శాఖల సంఖ్యను 2017 నాటికి 2000కు పెంచుకోనున్నట్టు వెల్లడించారు. బెంగళూరులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శనివారం ఆంధ్రజ్యోతి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పరపతి పంపిణీ ఇంకా ప్రోత్సాహకరంగా లేదని చెప్పారు. అయితే ఆర్థిక రంగంలో మళ్లీ పునరుత్తేజం ప్రారంభమైందని ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం నుంచి ఆర్థిక రంగం పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు. ఆర్థిక రంగం కోలుకుంటే బడా కార్పొరేట్ సంస్థలు, మధ్యతరహా వ్యాపార సంస్థల నుంచి రుణాలకు డిమాండ్ పుంజుకుంటుందని ఆయన చెప్పారు. ఈ లోపు ఎంఎస్ఎంఇలు, రిటైల్, వ్యవసాయ, ఇతర ప్రాధాన్యత రంగాల పరపతి అవసరాలపై బ్యాంకు దృష్టి సారిస్తుందని రామారావు చెప్పారు. ఈ ఏడాది రుణాల పంపిణీలో కనీసం 15-16 శాతం, డిపాజిట్లలో 19 శాతం వరకు వృద్ధిని అంచనా వేస్తున్నట్టు ఆయన వివరించారు. వడ్డీ రేట్ల తగ్గింపు అనివార్యంగా మారిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బ్యాంకుల నిధుల సేకరణ వ్యయం తగ్గలేదని అన్నారు. రుణాలకు డిమాండ్ పెరగాలంటే రేట్ల తగ్గింపు తప్పదని ఆయన అన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినంత వరకు తమ ఎన్పిఎలు చాలా తక్కువని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుంటే పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పాదుకొల్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు విదేశీ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రుణ మాఫీ అంశంపై మాట్లాడుతూ ఇలాంటి తాత్కాలిక ప్రయోజనాలు రైతులకు మేలు చేస్తాయని తాను భావించడం లేదన్నారు. ప్రస్తుత ఏడాది దేశవ్యాప్తంగా 2000 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు చెప్పారు. బ్యాంకు మొత్తం ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 13,600 వరకు ఉంది. రిస్క్ అధికంగా ఉండే విభాగాలకు నిపుణులైన సిబ్బందిని అధిక జీతాలు చెల్లించి నియమించుకునే స్వేచ్ఛ బ్యాంకులకు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యతా రంగాలకు 31వేల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయబోతున్నట్లు చెప్పారు. గత ఏడాదితో ఇది 20 శాతం ఎక్కువని అన్నారు. వ్యవసాయ రంగానికి 11,500 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ఈసారి ఎంఎస్ఎంఇ రంగానికి రుణాల కేటాయింపులు 16,000 కోట్ల రూపాయలు, రిటైల్ బ్యాంకింగ్కు 19,000 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 12 లక్షల ఖాతాలను ప్రారంభించామన్నారు. ఇప్పటికే వీరికి రూపే కార్డులను కూడా పంపిణీ చేశామన్నారు. అతి త్వరలో జన్ధన్ ఖాతాదారులకు 5,000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ఇదికాక రెండు లక్షల రూపాయల జీవిత బీమా సదుపాయం ఉంటుందన్నారు.
ఈ ఏడాది రూ. 185 కోట్ల టర్నోవర్
No comments:
Post a Comment