|
మౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధం
హెల్త్హబ్గా మారుద్దాం సహకరించండి
వైద్య నిపుణులకు చంద్రబాబు పిలుపు
వైద్యరంగాన్ని పర్యాటకంతో అనుసంధానిస్తాం
విదేశాల కన్నా భారత్లో వైద్యం 90% చౌక
ఎండోకాన్-2015లో ముఖ్యమంత్రి
విశాఖపట్నం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): దేశవిదేశీ వైద్యనిపుణులు రాష్ట్రంలో ఆస్పత్రులను నెలకొల్పేందుకు ముందుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వారికి అవసరమైన మౌలిక వసతులు, మానవ వనరులను సమకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్యాసో్ట్ర ఎంటరాలజీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 16వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖ నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన ఎండోకాన్-2015ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విదేశాలతో పోలిస్తే మనదేశంలో వైద్యం 90 శాతం తక్కువ ఖర్చుతో అందుతుందన్నారు. అయితే నిపుణులు విదేశాల్లో ఉండడం వల్ల ఉత్తమ వైద్యసేవల కోసం ఎన్ని కష్టాలైనా అందరూ అక్కడికే వెళుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ను హెల్త్హబ్గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని, దీనికి దేశవిదేశాల్లోని వైద్యనిపుణులు సహకరించాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో నిష్ణాతులైన వైద్యులు, వైద్య రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు, నర్సులు ఎంతోమంది ఉన్నారన్నారు. గ్యాసో్ట్ర ఎంటరాలజీలో అత్యున్నత సేవలందించినందుకు ప్రపంచంలోని 12 మంది వైద్యనిపుణులకు అవార్డులు అందజేస్తే వారిలో నలుగురు భారతీయులు.. అందులో ఇద్దరు తెలుగువారు కావడం రాష్ట్రానికే గర్వకారమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు వైద్యరంగాన్ని టూరిజంతో అనుసంధానం చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు విశాఖ అనువైన ప్రాంతంగా గుర్తించామన్నారు. ప్రపంచ దేశాల్లోని నిపుణులు కేజీహెచ్లోనూ, రాష్ట్రంలోనూ తమ సేవలను అందించేందుకు ముందుకొస్తే ఎన్నికోట్లు ఖర్చయినా తాను భరించేందుకు సిద్ధమన్నారు. ‘మీరు విజ్ఞానాన్ని అందిస్తే..నేను మౌలిక వసతులు కల్పిస్తాను. నేను హార్డ్వేర్ ఇస్తాను...మీరు సాఫ్ట్వేర్ ఇవ్వండని’ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్యాసో్ట్ర ఎంటరాలజీ సొసైటీ జాతీయ అధ్యక్షడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి, తదితరులు ప్రసంగించారు.
|
No comments:
Post a Comment